logo

5న పీఎంఓఓల నియామకానికి మౌఖిక పరీక్షలు

‘కంటి వెలుగు’ కార్యక్రమంలో పారామెడికల్‌  ఆప్తాలమిక్‌ అధికారు(పీఎంఓఓ)ల ఉద్యోగాలను పొరుగు సేవల పద్ధతిలో నియమించటానికి అర్హులైన అభ్యర్థులకు 5న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ రాఠోడ్‌ నరేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 01 Dec 2022 05:42 IST

ఆదిలాబాద్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే : ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో పారామెడికల్‌  ఆప్తాలమిక్‌ అధికారు(పీఎంఓఓ)ల ఉద్యోగాలను పొరుగు సేవల పద్ధతిలో నియమించటానికి అర్హులైన అభ్యర్థులకు 5న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ రాఠోడ్‌ నరేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు తమ నిజ ధ్రువపత్రాలతో ఉదయం 10.30కు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. దరఖాస్తు ఫారం, పూర్తి వివరాలను కార్యాలయం నోటీసు బోర్డుపై ప్రదర్శించటంతో పాటు http:///adilabad.telangana.gov.in  అంతర్జాలంలో పొందుపర్చినట్లు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని