‘కడెం’ ఆధునికీకరణకు తొలి అడుగు
కడెం జలాశయం గత జులై మాసంలో వచ్చిన భారీ వరదలతో ముప్పు నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే.
వరద తీవ్రత తెలుసుకునేలా.. గేట్లు త్వరగా పైకెత్తేలా యంత్రాలు
కడెం, న్యూస్టుడే
ప్రస్తుతం జలాశయంపై ఉన్న వరదను కొలిచే ఏకైక పరికరం
కడెం జలాశయం గత జులై మాసంలో వచ్చిన భారీ వరదలతో ముప్పు నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. ఎగువ నుంచి వచ్చే వరదలను లెక్కగట్టేందుకు సరైన పరికరాలు లేకపోవడం, జలాశయంలోకి ఎంత వరద వస్తుందో లెక్కించేందుకు పాతపద్ధతే ఉండడంతో ఏటా ఇక్కడి అధికారులకు ఇబ్బందిగా మారుతోంది. వరదగేట్లను ఎత్తేందుకు సైతం పాతపద్ధతే ఉండడంతో పరిశీలించిన ఉన్నతాధికారులు, నిపుణుల కమిటీ ఇక్కడ ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. దీంతో ప్రభుత్వం వరదగేట్లను ఎత్తే అధునాతన యంత్రపరికరాలు, సీసీ కెమెరాలు, వరదనీటిని కొలిచి చెప్పే ట్రాన్స్మీటర్లు మంజూరు చేసింది. పాతదైన కడెం జలాశయాన్ని ఆధునికీకరించాలనే డిమాండుకు తొలి అడుగు పడింది.
ప్రతి గేటుకూ సీసీ కెమెరా..
జలాశయానికి వరదపోటు ఎక్కువగా ఉంటుందని, దీన్ని లెక్కించడం, బయటకు వదలడం ఇబ్బందికరంగా ఉంటోందని కొత్త విధానంతో నిర్వహించే స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా ఎక్విజేషన్) సిస్టంను మంజూరు చేశారు. వరదగేట్లను ఎత్తే ప్రక్రియ మొత్తం ఇక కొత్తగా ఏర్పాటుచేసే కంట్రోల్ రూం నుంచే పరిశీలించనున్నారు. కడెం నారాయణ రెడ్డి జలాశయానికి మొత్తం 18 వరదగేట్లు ఉన్నాయి. ఇందులో తొమ్మిది జర్మన్ సాంకేతిక గేట్లు, తొమ్మిది ఇండియన్ గేట్లున్నాయి. వీటిలో ఇండియన్ గేట్లను ఎత్తేందుకు ఒక్కోదానికి రెండు పరికరాలు, జర్మనీ గేట్లను ఎత్తేందుకు ఒక పరికరం చొప్పున బిగించనున్నారు. ప్రతి గేటుకు ఒక సీసీ కెమెరా బిగించి వీటి ద్వారా గేటు ఎంత ఎత్తారు, నీరెంత పోతోంది, గేటు పనితీరును కంట్రోల్రూం నుంచే పరిశీలిస్తారు. జలాశయంపైన వరదగేట్లకు ఒక్కో చివరన పెద్ద(బుల్లెట్) సీసీకెమెరాలను అమర్చనున్నారు. జలాశయం ఎగువభాగంలో వరదవచ్చే శిఖామని(చీక్మాన్) కడెం నది ప్రాంతాలను గుర్తించి అక్కడ సోలార్ ద్వారా నడిచే రాడార్లెవల్ టైప్ ట్రాన్స్మీటర్లను బిగిస్తారు. వీటిద్వారా వచ్చే సమాచారంతో వరద ఉద్ధృతిని ముందే తెలుసుకునే అవకాశముంటుంది.
కంట్రోల్రూం నుంచే పర్యవేక్షణ..
జలాశయం దిగువన సైతం వరదల సమయంలో నీరెంత బయటకు పోతోందో తెలిసేలా వంతెన సమీపంలో ఒక ట్రాన్స్మీటర్ను ఏర్పాటుచేస్తారు. ఇదివరకు ప్రాజెక్టుకు వచ్చే వరదను ఇక్కడ గేజ్రూంలో ఉండే బావిలో మీటరుద్వారనే లెక్కించేవారు. అది లెక్కించడం ఆలస్యం అవుతోందని కొత్తపద్ధతిలోనే లెక్కించేలా ఒక పరికరాన్ని గేజ్రూంలోను ఏర్పాటు చేస్తారు. ఇలా ఎక్కడికక్కడ పరికరాలను ఏర్పాటుచేసి వచ్చే వరదను ముందుగానే పసిగట్టి జలాశయంలో నీరెంత నిల్వ ఉంచాలి, ఎంత వదలాలి, వరదగేట్లను ఎన్నిఎత్తాలి, ఎంతమేర ఎత్తాలనేది కంట్రోల్రూం ద్వారానే నిర్ణయిస్తారు. కంట్రోల్ రూంను కడెం వరదగేట్ల చివరన ఉన్న జనరేటర్ గదికి సమీపంలో నిర్మిస్తామని అధికారులు పేర్కొన్నారు. కొత్తగా కడెంతోపాటు ఎస్సారెస్సీ, ఎల్ఎండీ ప్రాజెక్టుకు స్కాడా సిస్టంద్వార వరదగేట్లను నిర్వహించేందుకు ఎంపికచేశారు. కడెంకు టెండరుద్వార పనులను దక్కించుకున్న సంస్థ యంత్రాలను బిగించి అయిదేళ్లపాటు జలాశయం నిర్వహణను పర్యవేక్షించనుంది. యంత్రాలు బిగించే పనులను ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించి కడెం మెరుగుపడేందుకు ఇది ఒక మెట్టు అని అభిప్రాయపడ్డారు.
నిర్వహణ మెరుగుపడుతుంది
- రాజశేఖర్ గౌడ్, ఈఈ కడెం
కడెం జలాశయం వరదగేట్ల నిర్వహణ ఇకపై సులభం అవుతుంది. ప్రతిగేటువద్ద ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఎగువన, దిగువన వరదనీటి ప్రవాహాన్ని కొలిచే పరికరాలుంటాయి. ఇవన్నీ జలాశయం వద్ద ఉండే కంట్రోల్రూంకు అనుసంధానమవుతాయి. గేట్లను ఎత్తడం, ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు తెలుసుకుని అప్రమత్తం అయ్యేందుకు అవకాశముంటుంది. జలాశయం ఆధునికీకరణలో భాగమిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ-సేవ కేంద్రం సేవలు ప్రారంభం
[ 28-03-2024]
జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్లోని న్యాయస్థానాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ-సేవ కేంద్రం సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. -
గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలి
[ 28-03-2024]
ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 60 ప్రకారం రిమ్స్ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా, ఈపీఎఫ్ వారి ఖాతాలో జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రిమ్స్ గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. -
వైభవంగా రమా సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
[ 28-03-2024]
కొత్త హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ రమా సత్యనారాయణ, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. -
ఎంపీగా సుగుణక్కను గెలిపించుకుంటాం
[ 28-03-2024]
ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించిన సుగుణక్కను పార్టీ కార్యకర్తలు అందరూ ఐక్యంగా కృషిచేసి గెలిపించుకుంటామని పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ అన్నారు. -
శివాజీ విగ్రహ నిర్మాణానికి విరాళం
[ 28-03-2024]
తాంసీ మండల కేంద్రంలో హిందూ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి భాజపా జిల్లా నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి విరాళంగా అందజేశారు. -
విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు
[ 28-03-2024]
జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం వరంగల్ మ్యాక్సీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. -
ఆదిలాబాద్లో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు
[ 28-03-2024]
ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం ఉదయం న్యాయస్థానం ఆవరణలో ప్రారంభమయ్యాయి. -
లక్ష్యానికి మించి ‘ఉపాధి’ పనులు
[ 28-03-2024]
మండుటెండల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్్ ప్రణాళికలు మించి పనులు చేశారు. 2023-24లో మొత్తం 36.58 లక్షల పని దినాలు అంచనాతో ప్రణాళికలు రూపొందించారు. -
కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ..
[ 28-03-2024]
అనూహ్య మలుపులు తిరిగిన ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఆత్రం సుగుణకే ఖరారైంది. ఉట్నూరుకు చెందిన టీచర్, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సుగుణ పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) ఆమోదించింది. -
‘పది’ మూల్యాంకనానికి ఏర్పాట్లు
[ 28-03-2024]
పదోతరగతి పరీక్షలు ఈనెల 30తో ముగియనున్నాయి. ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. పరీక్షపత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇతర జిల్లాల నుంచి పత్రాలు చేరాయి. -
గొంతు తడవదు.. గోస తీరదు
[ 28-03-2024]
ఆసిఫాబాద్ మండలం సుద్దాఘాట్ గ్రామానికి చెందిన ప్రజలు నిత్యం కిలోమీటరు దూరంలోని వాగు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. పక్కనే చెలమ తీసి నీటిని పట్టుకెళ్తున్నారు. వాగు అవతల ఉన్న పదుల సంఖ్యల్లో గ్రామాలదీ ఇదే పరిస్థితి. -
నిప్పు.. నిర్లక్ష్యం చేస్తే పెను ముప్పు
[ 28-03-2024]
వేసవి వచ్చిందంటే సహజంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ప్రధానంగా అడవుల్లో కార్చిచ్చులు మొదలవుతాయి. అటవీప్రాంతంలో జరిగితే మనకొచ్చిన ఇబ్బందేంటని నిర్లక్ష్య వైఖరి చాలా మందిలో కనిపిస్తుంటుంది. -
10,489 మందికి ఎన్నికల విధులు
[ 28-03-2024]
లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార యంత్రాంగం పోలింగ్ కోసం అంతా సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే ఉద్యోగ, ఉపాధ్యాయ సమాచార సేకరణ, కంప్యూటర్లో వారి వివరాల నిక్షిప్తం చేసే ప్రక్రియను పూర్తి చేశారు. -
అరచేతిలో అతివకు భద్రత
[ 28-03-2024]
ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా అతివలపై జరుగుతున్న నేరాలు ఆగడం లేదు. ఇప్పటికే మహిళలు, యువతుల, విద్యార్థినుల భద్రతకు అనేక మొబైల్ యాప్లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోలీసుశాఖ తాజాగా టీ-సేఫ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. -
భానుడి భగభగ
[ 28-03-2024]
వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పది ప్రాంతాల్లో ఆరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో జైనథ్లో మధ్యాహ్న సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలుగా నమోదు అయింది. -
పల్లెలు భళా.. పట్టణాల్లో డీలా
[ 28-03-2024]
స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రధానమైన ఆర్థిక వనరులు ఆస్తి పన్నులే. ఆర్థిక సంఘం, ప్రత్యేకాభివృద్ధి నిధులతో పంచాయతీలు, పురపాలక సంఘాల్లో సీసీ రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, మరమ్మతు పనులు చేపడుతున్నారు. -
ముదురుతున్న వివాదం!
[ 28-03-2024]
ప్రభుత్వస్థలం కబ్జాకు గురవుతోంది. అక్రమమార్గంలో పట్టాలు చేసుకుంటున్నారు. విచారణ జరపండి. బాధ్యులపై చర్యలు తీసుకోండి.. అంటూ ఏకంగా శాసనసభ్యుడు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. -
రోడ్లు నిర్మానుష్యం.. అవస్థల్లో జనం
[ 28-03-2024]
ఆదిలాబాద్లో రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో మూడ్రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. -
ప్రభుత్వ బడులకు ఉచిత వెలుగులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు ఛార్జీలు గుదిబండగా మారాయి. సర్కారు అందించే నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో చాలా పాఠశాలల్లో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. -
రెండు పడక గదుల ఇళ్లపై నీలినీడలు
[ 28-03-2024]
భారాస హయాంలో చేపట్టిన రెండు పడకల ఇళ్ల నిర్మాణాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వీటి విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
హలో.. హలోకు అనుమతి
[ 28-03-2024]
మారుమూల గ్రామాల్లో సంకేతాల (సిగ్నల్స్) సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రత్యేకంగా సెల్టవర్లు మంజూరు చేసింది. స్థలసమస్య కారణంగా పలు పనులు నిలిచి పోయాయి. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 28-03-2024]
పట్టణంలోని శివాజీచౌక్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న లక్ష్మణ్ (25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు పట్టణ సీఐ అనిల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి