జనం తోడుగా.. ‘బండి’ నడవగా
జిల్లాలో ప్రజా సంగ్రామయాత్ర నాల్గవరోజు జన సందోహం మధ్య కొనసాగింది.. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణుల అండగా దండులాగా సాగింది.
ఉత్సాహంగా సాగిన ప్రజాసంగ్రామయాత్ర
నిర్మల్-భైంసా, న్యూస్టుడే
రైతులతో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
జిల్లాలో ప్రజా సంగ్రామయాత్ర నాల్గవరోజు జన సందోహం మధ్య కొనసాగింది.. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణుల అండగా దండులాగా సాగింది. అడుగడుగునా నీరా‘జనం’ పట్టడంతో శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. గురువారం కుంటాల మండలం లింబా(బి), సేవాలాల్తాండ, కుంటాల, అంబకంటి గ్రామాల మీదుగా బండి సంజయ్ యాత్ర కొనసాగింది. గ్రామాల్లోని మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. యువకులు, ప్రజలు పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా రైతులు, ప్రజలను కలుస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకుసాగారు. అంతకుముందు బస శిబిరం వద్ద జిల్లాలోని పార్టీ మండల, ఆపైస్థాయి నాయకులకు పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేశారు. లింబా(బి) గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి.. మీరేమవుదామని అనుకుంటున్నారని అడగగా.. కలెక్టర్, డాక్టర్ను అవుతానని చెప్పడంతో సంతోషించారు. ఉపాధ్యాయుల కొరతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీపీఎస్ రద్దు చేయాలని ఆ పాఠశాల ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు. అనంతరం లింబా(బి) గ్రామంలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఓల గ్రామ సమీపంలో రైతులు తీసుకొచ్చిన ఎడ్లబండి ఎక్కి కాసేపు నడిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు 27 ప్యాకేజీ కింద నిర్మిస్తున్న సాగునీటి కాలువను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు.
లింబా - ఓల గ్రామాల మధ్య పాదయాత్ర
సారూ.. మా కష్టాలు తీర్చండి..
కుంటాల మండలం ఓల గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన పలువురు తాము పడుతున్న కష్టాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అంతకుముందు శివాజీ చిత్రపటానికి పూలమాల కాషాయజెండాను ఎగురవేశారు. అక్కడున్న అన్నబాహు సాటే, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాకు ఫసల్ బీమా యోజన రావడం లేదు. రెండు పడక గదుల ఇళ్లు, 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. రోడ్లు సరిగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. పోడు భూమి సమస్య ఉంది. అటవీ అధికారులు మా భూములను స్వాధీనం చేసుకున్నారని, ఆ భూమిని ఇప్పించాలని కోరారు. అంబుగాం నుంచి పాంగర్పాడ్కు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.. ఆటోలు కూడా రావడం లేదు.. రుణమాఫీ చేయలేదు. దళితబంధు రాలేదు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు పరిహారం అందలేదని ఆవేదనతో చెప్పడంతో ఆయన మాట్లాడుతూ సంవత్సరకాలంగా మీకోసమే పాదయాత్ర చేస్తున్నానని, ప్రజల దగ్గరకు వెళ్లాలని, సమస్యలను తెలుసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశిస్తేనే మీ దగ్గరికి వచ్చానన్నారు. ఎక్కడికి వెళ్లినా.. సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని, పేదోడు ప్రధాని అయిన తర్వాతే.. ఈ దేశంలో ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. ఓల గ్రామానికి కేంద్రం మంజూరుచేసిన నిధులగురించి వివరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు రామారావుపటేల్, మోహన్రావుపటేల్, సుహాసినిరెడ్డి, అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, డా.మల్లిఖార్జున్రెడ్డి, అప్పాల గణేశ్, జానుబాయి, బాజీరావు, భోజారెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
కుంటాల సభలో మాట్లాడుతున్న బండి సంజయ్
నేడు ప్రజా సంగ్రామ యాత్ర ఇలా..
నిర్మల్, న్యూస్టుడే : ప్రజా సంగ్రామ యాత్ర అయిదవ రోజైన శుక్రవారం ముథోల్ నియోజకవర్గంలో ముగించి నిర్మల్లో ప్రవేశించనుంది. నర్సాపూర్(జి) మండలం బామ్ని, నందన్, నర్సాపూర్(జి), కుస్లిగేట్, నసీరాబాద్ల మీదుగా రాంపూర్ వరకు కొనసాగుతుంది.
హాజరైన ప్రజలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గౌతమ్.. నన్ను మన్నించురా...
[ 18-04-2024]
మరికొద్ది గంటల్లో సంతోషంగా పండగ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ కుటుంబంలో విద్యుత్తు ప్రమాదం విషాదం నింపింది. కాసిపేట ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. -
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణోత్సవం
[ 18-04-2024]
పల్లెపట్టణం, ఊరూవాడల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. ఆలయాల్లో శ్రీరామచంద్రుడు, సీతాదేవీల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తుండగా తలంబ్రాలు, -
ఎన్నికల సమర శంఖారావం..
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. ఈ పోరులో పాల్గొనే వివిధపార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల నామపత్రాల దాఖలుకు రంగం సిద్ధం అయ్యింది. -
ఉపాధి కూలి.. నిరీక్షణతో సరి
[ 18-04-2024]
పేద కూలీలతోపాటు ఇటీవల వ్యవసాయ పనుల సీజన్ ముగియడంతో రైతు కుటుంబాలు అధిక సంఖ్యలో ఉపాధి హామీ పనుల బాట పట్టాయి. సకాలంలో డబ్బులు చేతికందక పూట గడవడం కోసం ఇతరుల వద్ద వారు చేతులు చాచాల్సి వస్తోంది. -
ముగిసిన 27 ఏళ్ల విప్లవ ప్రస్థానం
[ 18-04-2024]
ఆదివాసీ మహిళ రెండు దశాబ్దాల విప్లవ ప్రస్థానం ముగిసిపోయింది. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో బజార్హత్నూర్ మండలం డెడ్రాకు చెందిన దాసరివార్ సుమన్బాయి అలియాస్ రజిత మృతి చెందారు. -
విద్యార్థి మరణం పాఠం నేర్పేనా?
[ 18-04-2024]
ఆర్జీయూకేటీలో వరుస విద్యార్థి మరణాలు.. ప్రాంగణంలో తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలు విశ్వవిద్యాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు విద్యార్థులకు, ఇటు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. -
బాధలు చెప్పుకొనేదెలా?
[ 18-04-2024]
జిల్లాలో 2015లో ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న ఈ స్టేషన్లో ప్రస్తుతం అధికారులెవరూ లేరు. -
నిధుల ప్రవాహం.. తీరాలి దాహం
[ 18-04-2024]
చెన్నూరు పట్టణంలోని శివారు కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటికోసం నిధులు అందుబాటులో ఉండటంతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు. -
వలసల జోరు.. కారు బేజారు!
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నామపర్వానికి ముందు జిల్లాలో అనూహ్య పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టున్న నాయకులందరూ కాంగ్రెస్, భాజపా పార్టీలోకి చేరుతున్నారు. -
రాయితీ.. పక్కదారి!
[ 18-04-2024]
జిల్లాలోని రెండు పురపాలికలు, పలు మండలాలు వ్యాపార, వాణిజ్యపరంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామికంగా కాగజ్నగర్తోపాటు పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు గ్యాస్తో నడిచే ఆటోలు, కార్లు ఎక్కువగా ఉన్నాయి. -
ఈదురు గాలుల బీభత్సం.. క్షణాల్లో అతలాకుతలం..
[ 18-04-2024]
మండలంలోని బూరుగూడలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్షణాల వ్యవధిలోనే పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిత్యావసర సామగ్రి చెల్లాచెదురయ్యాయి. -
అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
[ 18-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అపారమైన చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. అద్భుతమైన ఆలయాలు, జాలువారే జలపాతాలకు నిలయంగా ఉంది. ఊహకందని రీతిలో వందల సంవత్సరాల కిందటే నిర్మించిన అబ్బురపరిచే శిల్పసంపద, గత వైభవానికి చిహ్నంగా కోటలు దర్శనమిస్తాయి. -
సంపూర్ణ అక్షరాస్యతకు.. నవభారత!
[ 18-04-2024]
నిరక్షరాస్యులైన వయోజనులందరినీ వచ్చే అయిదేళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భారత ప్రభుత్వం నూతనంగా నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఎండలతో ఉక్కిరిబిక్కిరి
[ 18-04-2024]
జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడిందని సంతోషిస్తున్న సమయంలోనే భానుడు తిరిగి భగ్గమంటున్నాడు. రెండు రోజుల్లోనే ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు పైగా పెరిగింది. -
అభ్యర్థులకు కీలకం.. నామపత్రాల ఘట్టం
[ 18-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో లోక్సభ ఎన్నికల పోరు క్రమేణా జోరందుకుంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!