మారరు.. మార్చరు..
బాసర ఆర్జీయూకేటీలో భోజనశాలల నిర్వాహకులను మార్చాలని విద్యార్థులు ఉపవాస దీక్షలు, శాంతియుత నిరసనలు తెలిపినా అధికారులు ససేమిరా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
ఆర్జీయూకేటీ భోజనశాలల నిర్వాహకులకు అధికారుల అండ
భద్రతా సిబ్బందిపై వేటు
ముథోల్(బాసర), న్యూస్టుడే
బాసర ఆర్జీయూకేటీ
బాసర ఆర్జీయూకేటీలో భోజనశాలల నిర్వాహకులను మార్చాలని విద్యార్థులు ఉపవాస దీక్షలు, శాంతియుత నిరసనలు తెలిపినా అధికారులు ససేమిరా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. గతంలో జరిగిన ఘటనలతో భోజనశాలల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని టెండర్లు పిలిచి విద్యాసంవత్సరం ప్రారంభం లోపు కొత్తవారికి అప్పగించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ వారినే కొనసాగిస్తున్నారు. బుధవారం విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. అయితే వీరు ఆసుపత్రికి వెళ్లిన సమాచారం ఇవ్వలేదని భద్రతా సిబ్బందిపై వేటు వేసి చేతులు దులుపుకొన్నారు.
భోజనశాలలో మారని దుస్థితి..
గతంలో నాణ్యత,పరిశుభ్రత లేని భోజనం వడ్డించడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. అప్పుడు నాణ్యతలో రాజీపడకుండా, పట్టిక ప్రకారం భోజనం అందిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. హామీఇచ్చి నెలలు గడుస్తున్నా అది అమలు కావడం లేదు. ఇప్పటికే రెండు, మూడుసార్లు భోజనం వికటించి విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. సంఘటనలు జరిగినప్పుడే అధికారులు నిర్వాహకులను మారుస్తామని చెబుతున్నారు. తర్వాత దాని గురించి పట్టించుకోవడం లేదు. భోజనశాల నిర్వాహకులకు రాజకీయ అండ ఉండటంతో వారు పెట్టింది తినాలి, చెప్పింది వినాలన్నట్లుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందజేయలేని..
గతంలో కొందరిని విశ్వవిద్యాలయంలోకి తీసుకెళ్లి వారితో మత ప్రచారం చేయించిన అటెండర్ను వదిలేసి వారిని లోపలికి పంపించిన భద్రతా సిబ్బందిలో ఒకరిపై వారం రోజుల పాటు వేటు వేశారు. నిన్న జరిగిన ఘటనలో ఆసుపత్రి వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది తమకు సమాచారం అందజేయలేదని ఒకరిపై నెలరోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైతే మాత్రం బాధ్యులపై ఎలాంటి చర్యలు ఉండకపోవడంతో విద్యార్థులు మండిపడుతున్నారు. అధికారులు మాత్రం ఆహారం వికటించి కాదు, జలుబు, కడుపునొప్పితోనే విద్యార్థులు ఆసుపత్రికి వచ్చారని చెబుతున్నారు.
* ఈ విషయమై ‘న్యూస్టుడే’ గురువారం చరవాణిలో భద్రతాధికారి, డీఎస్పీ సురేష్ను సంప్రదిస్తే తమకు సమాచారం అందించకపోవడంతో నెల రోజుల పాటు ఒక భద్రతా సిబ్బందిని తొలగించామమన్నారు.
* ఈ విషయమై ‘న్యూస్టుడే’ ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీష్కుమార్, ఇన్ఛార్జి ఉపకులపతి వెంకటరమణలకు చరవాణిలో సంప్రదించగా వారు స్పందించలేదు. మెసేజ్ చేసిన సమాధానం ఇవ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గౌతమ్.. నన్ను మన్నించురా...
[ 18-04-2024]
మరికొద్ది గంటల్లో సంతోషంగా పండగ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ కుటుంబంలో విద్యుత్తు ప్రమాదం విషాదం నింపింది. కాసిపేట ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. -
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణోత్సవం
[ 18-04-2024]
పల్లెపట్టణం, ఊరూవాడల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. ఆలయాల్లో శ్రీరామచంద్రుడు, సీతాదేవీల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తుండగా తలంబ్రాలు, -
ఎన్నికల సమర శంఖారావం..
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. ఈ పోరులో పాల్గొనే వివిధపార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల నామపత్రాల దాఖలుకు రంగం సిద్ధం అయ్యింది. -
ఉపాధి కూలి.. నిరీక్షణతో సరి
[ 18-04-2024]
పేద కూలీలతోపాటు ఇటీవల వ్యవసాయ పనుల సీజన్ ముగియడంతో రైతు కుటుంబాలు అధిక సంఖ్యలో ఉపాధి హామీ పనుల బాట పట్టాయి. సకాలంలో డబ్బులు చేతికందక పూట గడవడం కోసం ఇతరుల వద్ద వారు చేతులు చాచాల్సి వస్తోంది. -
ముగిసిన 27 ఏళ్ల విప్లవ ప్రస్థానం
[ 18-04-2024]
ఆదివాసీ మహిళ రెండు దశాబ్దాల విప్లవ ప్రస్థానం ముగిసిపోయింది. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో బజార్హత్నూర్ మండలం డెడ్రాకు చెందిన దాసరివార్ సుమన్బాయి అలియాస్ రజిత మృతి చెందారు. -
విద్యార్థి మరణం పాఠం నేర్పేనా?
[ 18-04-2024]
ఆర్జీయూకేటీలో వరుస విద్యార్థి మరణాలు.. ప్రాంగణంలో తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలు విశ్వవిద్యాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు విద్యార్థులకు, ఇటు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. -
బాధలు చెప్పుకొనేదెలా?
[ 18-04-2024]
జిల్లాలో 2015లో ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న ఈ స్టేషన్లో ప్రస్తుతం అధికారులెవరూ లేరు. -
నిధుల ప్రవాహం.. తీరాలి దాహం
[ 18-04-2024]
చెన్నూరు పట్టణంలోని శివారు కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటికోసం నిధులు అందుబాటులో ఉండటంతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు. -
వలసల జోరు.. కారు బేజారు!
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నామపర్వానికి ముందు జిల్లాలో అనూహ్య పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టున్న నాయకులందరూ కాంగ్రెస్, భాజపా పార్టీలోకి చేరుతున్నారు. -
రాయితీ.. పక్కదారి!
[ 18-04-2024]
జిల్లాలోని రెండు పురపాలికలు, పలు మండలాలు వ్యాపార, వాణిజ్యపరంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామికంగా కాగజ్నగర్తోపాటు పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు గ్యాస్తో నడిచే ఆటోలు, కార్లు ఎక్కువగా ఉన్నాయి. -
ఈదురు గాలుల బీభత్సం.. క్షణాల్లో అతలాకుతలం..
[ 18-04-2024]
మండలంలోని బూరుగూడలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్షణాల వ్యవధిలోనే పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిత్యావసర సామగ్రి చెల్లాచెదురయ్యాయి. -
అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
[ 18-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అపారమైన చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. అద్భుతమైన ఆలయాలు, జాలువారే జలపాతాలకు నిలయంగా ఉంది. ఊహకందని రీతిలో వందల సంవత్సరాల కిందటే నిర్మించిన అబ్బురపరిచే శిల్పసంపద, గత వైభవానికి చిహ్నంగా కోటలు దర్శనమిస్తాయి. -
సంపూర్ణ అక్షరాస్యతకు.. నవభారత!
[ 18-04-2024]
నిరక్షరాస్యులైన వయోజనులందరినీ వచ్చే అయిదేళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భారత ప్రభుత్వం నూతనంగా నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఎండలతో ఉక్కిరిబిక్కిరి
[ 18-04-2024]
జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడిందని సంతోషిస్తున్న సమయంలోనే భానుడు తిరిగి భగ్గమంటున్నాడు. రెండు రోజుల్లోనే ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు పైగా పెరిగింది. -
అభ్యర్థులకు కీలకం.. నామపత్రాల ఘట్టం
[ 18-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో లోక్సభ ఎన్నికల పోరు క్రమేణా జోరందుకుంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.