‘మాస్టర్ ప్లాన్’ అమలుకు సన్నాహాలు
రాష్ట్రంలోని 84 నగర, పురపాలికల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించి, ముసాయిదాను ఈ నెలాఖరులోపు ఆమోదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
22ఏళ్ల తర్వాత మార్పు
కాగజ్నగర్, న్యూస్టుడే
మాస్టర్ ప్లాన్ మ్యాప్
రాష్ట్రంలోని 84 నగర, పురపాలికల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించి, ముసాయిదాను ఈ నెలాఖరులోపు ఆమోదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కుమురం భీం జిల్లాలోని కాగజ్నగర్ పురపాలికకు అవకాశం దక్కింది. ఇక్కడ మూడేళ్ల కిందట సర్వే పూర్తి చేసిన మాస్టర్ ప్లాన్ (బృహత్తర ప్రణాళిక) ఎట్టకేలకు ప్రభుత్వం ఆమోదించి, అమలుకు శ్రీకారం చుట్టనుంది.
జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్నగర్ పురపాలికలో 1999-2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ ఆధారంగా.. రోడ్ల నిర్మాణంతో పాటు, ఇతర కార్యక్రమాలు సాగుతుండగా, దాదాపు 22ఏళ్ల తర్వాత మళ్లీ బల్దియాలో మాస్టర్ ప్లాన్ అమలు కానుంది. మాస్టర్ ప్లాన్ అమలు జరిగితే ఇరుకైన ప్రధాన రహదారులతోపాటు, రోజు రోజు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరింత అభివృద్ధి జరగనుంది.
కాగజ్నగర్ పట్టణం
మూడేళ్ల కిందట రెండు విడతలుగా సర్వే
కాగజ్నగర్ బల్దియాలో ఉన్న 30 వార్డులతోపాటు, పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పట్టణ సరిహద్దు ప్రాంతాలను గుర్తించి, పూర్తి స్థాయిలో రాబోయే 20 ఏళ్లకు అనుకూలంగా ఉండే విధంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీకి చెందిన డీడీఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దీన్ని రూపొందించే టెండర్ దక్కించుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు రెండు విడతలుగా పురపాలికను సందర్శించి పూర్తి స్థాయి నివేదికలను తయారు చేశారు. ఆ సర్వే నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. మూడేళ్లు గడిచినప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఎన్నో ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడంతో పట్టణవాసులు నరకయాతన పడుతున్నారు. పట్టణంలోని రైల్వే పై వంతెన ఏరియా, లారీ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, రాజీవ్గాంధీ చౌరస్తా, తదితర ఏరియాల్లో రహదారులు ఇరుకుగా మారడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొత్తగా మాస్టర్ ప్లాన్ అమలుకు చర్యలు చేపట్టడంతో ఇబ్బందులు తొలగుతాయని ఆశిస్తున్నారు.
సిబ్బంది కొరతే అసలు సమస్య
మాస్టర్ ప్లాన్ అమలులో పురపాలిక పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులదే కీలక పాత్ర. అయితే బల్దియాలో కొన్నేళ్లుగా పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి పురపాలికలో టీపీఎస్గా కొనసాగుతున్న తిరుపతమ్మ ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. కాగజ్నగర్ పురపాలికలో సోమవారం, మంగళవారం, బుధవారం విధులు నిర్వర్తించి, మిగతా మూడు రోజులు చొప్పదండిలో నిర్వహించాల్సి ఉంటుంది. ఆ విభాగంలో టీపీఓ-01, టీపీఎస్-01, టీపీబీవో-04, సర్వేయిర్-01 పోస్టులుండగా.. ఏ ఒక్క పోస్టు భర్తీ కాలేదు. ప్రస్తుతం ఒక టీపీఎస్ డిప్యూటేషన్పై కొనసాగుతున్నారు. దీంతో పట్టణంలో ఆక్రమణలు, భవనాల అనుమతులు తదితర పనులు తీవ్ర జాప్యంతోపాటు, మాస్టర్ ప్లాన్ అమలుపై పర్యవేక్షణ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.
ఉత్తర్వులు అందాయి..
అంజయ్య, కమిషనర్
పట్టణ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించేందుకు దిల్లీకి చెందిన సంస్థ ప్రతినిధులు మాస్టర్ప్లాన్ సర్వే చేశారు. వారికి పట్టణ సమగ్ర వివరాలు అందజేశాం. ప్రభుత్వం నుంచి ఇటీవలే అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రణాళిక విభాగంలోని ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాం. ఆ పోస్టులు భర్తీ అయితే సత్వరమే మాస్టర్ ప్లాన్ అమలు జరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గౌతమ్.. నన్ను మన్నించురా...
[ 18-04-2024]
మరికొద్ది గంటల్లో సంతోషంగా పండగ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ కుటుంబంలో విద్యుత్తు ప్రమాదం విషాదం నింపింది. కాసిపేట ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. -
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణోత్సవం
[ 18-04-2024]
పల్లెపట్టణం, ఊరూవాడల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. ఆలయాల్లో శ్రీరామచంద్రుడు, సీతాదేవీల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తుండగా తలంబ్రాలు, -
ఎన్నికల సమర శంఖారావం..
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. ఈ పోరులో పాల్గొనే వివిధపార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల నామపత్రాల దాఖలుకు రంగం సిద్ధం అయ్యింది. -
ఉపాధి కూలి.. నిరీక్షణతో సరి
[ 18-04-2024]
పేద కూలీలతోపాటు ఇటీవల వ్యవసాయ పనుల సీజన్ ముగియడంతో రైతు కుటుంబాలు అధిక సంఖ్యలో ఉపాధి హామీ పనుల బాట పట్టాయి. సకాలంలో డబ్బులు చేతికందక పూట గడవడం కోసం ఇతరుల వద్ద వారు చేతులు చాచాల్సి వస్తోంది. -
ముగిసిన 27 ఏళ్ల విప్లవ ప్రస్థానం
[ 18-04-2024]
ఆదివాసీ మహిళ రెండు దశాబ్దాల విప్లవ ప్రస్థానం ముగిసిపోయింది. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో బజార్హత్నూర్ మండలం డెడ్రాకు చెందిన దాసరివార్ సుమన్బాయి అలియాస్ రజిత మృతి చెందారు. -
విద్యార్థి మరణం పాఠం నేర్పేనా?
[ 18-04-2024]
ఆర్జీయూకేటీలో వరుస విద్యార్థి మరణాలు.. ప్రాంగణంలో తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలు విశ్వవిద్యాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు విద్యార్థులకు, ఇటు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. -
బాధలు చెప్పుకొనేదెలా?
[ 18-04-2024]
జిల్లాలో 2015లో ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న ఈ స్టేషన్లో ప్రస్తుతం అధికారులెవరూ లేరు. -
నిధుల ప్రవాహం.. తీరాలి దాహం
[ 18-04-2024]
చెన్నూరు పట్టణంలోని శివారు కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటికోసం నిధులు అందుబాటులో ఉండటంతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు. -
వలసల జోరు.. కారు బేజారు!
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నామపర్వానికి ముందు జిల్లాలో అనూహ్య పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టున్న నాయకులందరూ కాంగ్రెస్, భాజపా పార్టీలోకి చేరుతున్నారు. -
రాయితీ.. పక్కదారి!
[ 18-04-2024]
జిల్లాలోని రెండు పురపాలికలు, పలు మండలాలు వ్యాపార, వాణిజ్యపరంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామికంగా కాగజ్నగర్తోపాటు పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు గ్యాస్తో నడిచే ఆటోలు, కార్లు ఎక్కువగా ఉన్నాయి. -
ఈదురు గాలుల బీభత్సం.. క్షణాల్లో అతలాకుతలం..
[ 18-04-2024]
మండలంలోని బూరుగూడలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్షణాల వ్యవధిలోనే పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిత్యావసర సామగ్రి చెల్లాచెదురయ్యాయి. -
అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
[ 18-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అపారమైన చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. అద్భుతమైన ఆలయాలు, జాలువారే జలపాతాలకు నిలయంగా ఉంది. ఊహకందని రీతిలో వందల సంవత్సరాల కిందటే నిర్మించిన అబ్బురపరిచే శిల్పసంపద, గత వైభవానికి చిహ్నంగా కోటలు దర్శనమిస్తాయి. -
సంపూర్ణ అక్షరాస్యతకు.. నవభారత!
[ 18-04-2024]
నిరక్షరాస్యులైన వయోజనులందరినీ వచ్చే అయిదేళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భారత ప్రభుత్వం నూతనంగా నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఎండలతో ఉక్కిరిబిక్కిరి
[ 18-04-2024]
జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడిందని సంతోషిస్తున్న సమయంలోనే భానుడు తిరిగి భగ్గమంటున్నాడు. రెండు రోజుల్లోనే ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు పైగా పెరిగింది. -
అభ్యర్థులకు కీలకం.. నామపత్రాల ఘట్టం
[ 18-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో లోక్సభ ఎన్నికల పోరు క్రమేణా జోరందుకుంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ