బీమా.. కార్మిక కుటుంబాలకు ధీమా
సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమంలో కార్మిక శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ శాఖ ద్వారానే ప్రభుత్వం పథకాలకు రూపకల్పన చేస్తుంది.
సహాయ కార్మిక అధికారి జి.రాజలింగు
ఈటీవీ - ఆదిలాబాద్: సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమంలో కార్మిక శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ శాఖ ద్వారానే ప్రభుత్వం పథకాలకు రూపకల్పన చేస్తుంది. నిబంధనలకు అనుగుణంగా వారు తమ పేర్లు నమోదు చేసుకుంటే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలేమిటి? వాటి ప్రయోజనాలేమిటి? అనే అంశాలపై ఆదిలాబాద్ సహాయ కార్మిక అధికారి జి.రాజలింగుతో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి.
ఈనాడు : కార్మికులు పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి?
ఏఎల్వో : భవన, ఇతర నిర్మాణ కార్మికులు లబ్ధి పొందాలంటే అయిదేళ్ల కోసం రూ.110 చెల్లించి పేరు నమోదు చేసుకుంటే గుర్తింపు కార్డు వస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6.30 లక్షల పరిహారం పొందొచ్చు. సహజ మరణమైతే రూ.1.30 లక్షలు పొందొచ్చు. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల వివాహాల సమయంలో రూ.30 వేల చొప్పున పెళ్లి కానుక వస్తుంది. ఆ ఇద్దరు ఆడ పిల్లల రెండు కాన్పుల వరకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పు ప్రసూతి సాయం లభిస్తుంది. ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు పొందే వెసులుబాటు ఉంది. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో అయిదు రోజులకు పైబడి చేరితే రోజుకు రూ.300 చొప్పున ఆర్థిక సాయం పొందొచ్చు.
ఈ : భవన నిర్మాణ రంగం మినహాయిస్తే ఇతర కార్మికులకు పథకాల మాటేమిటి?
ఏఎల్వో : అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక వెసులుబాటు ఉంది. ముఖ్యంగా జర్నలిస్టులు, రైతులు, రైతుకూలీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, దుకాణాల్లో పని చేసే కార్మికులు, వీధి వ్యాపారులు, మత్స్యకారులు, ఆటో, లారీ డ్రైవర్లు, హమాలీలు, వ్యవసాయ అనుబంధ రంగాల కార్మికలకు మేలు చేసేలా ప్రత్యేక సౌకర్యం ఉంది. అందుకోసం ఈ-శ్రమ్లో ఉచితంగా పేరు నమోదు చేసుకోవాలి. ఒకసారి పేరు నమోదు చేసుకుంటే జీవితకాలం పనికొస్తుంది. అప్పుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు, అంగవైకల్యమైతే రూ.1 లక్ష ఆర్థికసాయం పొందవచ్చు.
ఈ : పెళ్లి కూతుళ్లు, ఎక్స్గ్రేషియానే కాకుండా కార్మికుడిపై ఆధారపడిన భార్య, కొడుకు ఉంటే వారికేమైనా సాయం అందుతుందా?
ఏఎల్వో : భార్య, కొడుకు, బిడ్డలకు నేషనల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అకాడమీ(న్యాక్) ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తాం. టేలరింగ్, తాపీమేస్త్రీ, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ కోసం మూడు నెలల పాటు ఉచిత సర్టిఫికెట్ కోర్సు అందిస్తాం. శిక్షణలో రోజుకు రూ.300 చొప్పున ఉపకార వేతనం వస్తుంది. మహిళలకైతే ఉచితంగా కుట్టుమిషన్ అందజేస్తాం.
ఈ : సామాజిక భద్రతా పథకం ఉద్దేశమేమిటి?
ఏఎల్వో : ఇది ప్రధానంగా జర్నలిస్టులు, హోంగార్డులు, ఆటో, లారీ డ్రైవర్లకు మాత్రమే ఉద్దేశించిన పథకం. వీరి తరఫున ప్రభుత్వమే రుసుం చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం పొందే వెసులుబాటు ఉంది. జర్నలిస్టులైతే పౌర సంబంధాల అధికారి, హోంగార్డులైతే ఎస్పీ, ఆటో, లారీ డ్రైవర్లయితే ఎంవీఐల ద్వారా ధ్రువపత్రాలు సమర్పించి పరిహారం పొందడానికి అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముఖ్య నేతల కోసం అభ్యర్ధుల యత్నం
[ 20-04-2024]
ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాలు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల తేదీలు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వు కాగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానం. -
బాలభవన్ కల సాకారమయ్యేనా?
[ 20-04-2024]
కళలకు నిలయంగా ఆదిలాబాద్లోని బాలకేంద్రం నిలుస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన బాలలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. -
నిర్మల్ నేతలదే ఆధిపత్యం
[ 20-04-2024]
ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్సభకు సంబంధించినవి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. -
పరిమళించిన పల్లె.. పరిశ్రమల ముల్లె
[ 20-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానంగా 62 ఏళ్ల కింద ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు 15 మంది ఎంపీ అభ్యర్థులుగా దిల్లీకి వెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలతో సమ్మిళితమై ఉంటుంది. -
రెండోరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరే!
[ 20-04-2024]
లోక్సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు. -
ఆత్రం సుగుణకు ఆభరణాలు లేవు..
[ 20-04-2024]
తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్ కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో పెండింగ్లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ వెల్లడించారు. -
సరిహద్దు గ్రామాల్లో.. ముగిసిన పోలింగ్
[ 20-04-2024]
తెలంగాణ - మహారాష్ట్ర వివాదాస్పద 12 గ్రామాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాలు ఈ గ్రామాలు మావే అంటుండగా, ఇక్కడి ప్రజలందకిరి ఓటర్లు కార్డులు ఉన్న విషయం విదితమే. -
నింగికెగసిన ఆడబిడ్డలకు సలాం
[ 20-04-2024]
జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది. -
ఎన్నికల హడావుడి.. ఇసుక దోపిడీ
[ 20-04-2024]
రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది. -
ఆడిట్లో అవకతవకలు గుర్తిస్తున్నా ఫలితం శూన్యం
[ 20-04-2024]
పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. -
నైపుణ్యం పెంచేలా.. సేవలు మెరుగయ్యేలా
[ 20-04-2024]
ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. -
అసౌకర్యాలు గుర్తించి.. దూరాభారం తగ్గించి
[ 20-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,850 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
గల్ఫ్ బాధితులకు భరోసా కలిగేనా?
[ 20-04-2024]
ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబునిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బెహరాన్, ఒమన్లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. -
విలువలతో కూడిన విద్య అందించాలి
[ 20-04-2024]
ఒకప్పుడు చదువులకు దూరంగా ఉన్న మారుమూల అల్లంపల్లి గిరిజన విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని త్రిదండి రామానుజ చినజీయరు స్వామి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు