తరలింపు తప్పదా?
జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి (ప్రస్తుత జీజీహెచ్)లో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం కొనసాగింపుపై సందిగ్ధం..
ఆరోగ్యశ్రీ ద్వారా రక్తనిధి కేంద్రంలో చికిత్స పొందుతున్న తలసీమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్థులు
మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి (ప్రస్తుత జీజీహెచ్)లో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తనిధి కేంద్రం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. దాదాపు 14 ఏళ్లుగా వేలమంది లబ్ధి దీనిద్వారా పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, తలసీమియా, సికిల్సెల్ బాధితులు, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు అత్యవసర సమయంలో రక్తాన్ని అందిస్తూ వారి ప్రాణాలకు భరోసా కల్పిస్తోంది. మొన్నటి వరకు తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు (టీవీవీపీ) సహకారంతో సాఫీగా సాగగా ఇటీవల ఆసుపత్రి డీఎంఈ పరిధికి వెళ్లడంతో కేంద్రం నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఆసుపత్రిలో ప్రభుత్వ రక్తనిధి కేంద్రం ఉండాలనే నిబంధన ఉండటంతో రెడ్క్రాస్ ఆధ్వర్యంలోని ఈ సంస్థను మరో ప్రాంతానికి తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఏళ్లుగా ధర్మాసుపత్రి ఆవరణలో రక్తనిధి కేంద్రం కొనసాగుతుండటంతో అద్దె, విద్యుత్తు ఖర్చులు ఆసుపత్రి భరిస్తోంది. బాధితులకు రక్తాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఆసుపత్రి టీవీవీపీ పరిధిలో ఉండటంతో ఏ ఇబ్బంది లేకపోయింది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఈ కేంద్రంలో ఉచితంగా రక్తంతో పాటు మందులు, ఇతర సౌకర్యాలు పొందుతున్నారు. ముందుగా ఈ ఖర్చులు రక్తనిధి కేంద్రం భరిస్తుండగా ఆ తర్వాత వచ్చే ఆదాయం ఆసుపత్రి ఖాతాలో జమవుతోంది. టీవీవీపీ పర్యవేక్షణలో ఉన్నంత కాలం లావాదేవీలు సక్రమంగానే ఉన్నా ఇటీవల వైద్యకళాశాల మంజూరుతో ఇబ్బందులు మొదలైనట్లు తెలుస్తోంది. కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి జీజీహెచ్గా మారడం, సంబంధిత పర్యవేక్షకులు వీటిని రక్తనిధికి చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ నుంచి రావాల్సిన బకాయిల్లో ఇటీవల రూ.30 లక్షలకు పైగా జమ అయినట్లు కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. కానీ వీటిని రక్తనిధి కేంద్రానికి బదిలీ చేసేందుకు పర్యవేక్షకులు జాప్యం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
ఐఆర్సీఎస్తో ప్రయోజనం..
వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రికి తప్పనిసరిగా ప్రభుత్వ రక్తనిధి కేంద్రం ఉండాలి. ఐఆర్సీఎస్ కేంద్రాన్ని మరో చోటుకు తరలించాలి. జిల్లా కేంద్రంలో ఈ రెండూ అందుబాటులో ఉంటే బాధితులకు సేవలు మరింత మెరుగ్గా అందుతాయి. తలసీమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్థులకు రక్తం కొరత రాకుండా ఉంటుంది. ఐఆర్సీఎస్ కేవలం రక్తనిధి కేంద్రానికి పరిమితం కాకుండా అనాథాశ్రమాల ఏర్పాటుచేసి ఎంతో మందికి ఆపన్నహస్తం అందిస్తోంది. విపత్తు సమయంలో జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ప్రభుత్వ రక్తనిధి కేంద్రం వస్తుండటంతోనే
- భాస్కర్రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్
జిల్లాకు వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో ప్రభుత్వ రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేసే అవకాశముంది. దీంతో రాష్ట్ర ఛైర్మన్ సైతం ఆసుపత్రి నుంచి కేంద్రాన్ని తరలించాలని ఆదేశాలిచ్చారు. ప్రైవేటు భవనంలో ఏర్పాటు చేసి సేవలు మరింత విస్తృతం చేస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా తలసీమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్థులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గణపతి గుడిలో హుండీ చోరీ
[ 25-04-2024]
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్రనగర్ ఓంసాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున చోరీ వెలుగు చూసింది. -
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు