Mini Theatre: నట్టింట్లో నవలోకం..!
సినిమా అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టమైన వ్యాపకం. కొత్త సినిమా వస్తే ఉదయమే లేచి టికెట్లకు వరుసలో నిలబడి కుస్తీలు పట్టేవారు.
మినీ థియేటర్లపై పెరుగుతున్న ఆసక్తి
నిర్మల్ పట్టణం/మామడ, న్యూస్టుడే
సినిమా అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టమైన వ్యాపకం. కొత్త సినిమా వస్తే ఉదయమే లేచి టికెట్లకు వరుసలో నిలబడి కుస్తీలు పట్టేవారు. అధిక ధర చెల్లించైనా సొంతం చేసుకునేందుకు ప్రయత్నించేవారు. విడుదలైన రోజే చూడాలన్న తపనతో పల్లెనుంచి పట్టణాలకు వెళ్లేవారు. మీ దగ్గరెన్ని థియేటర్లున్నాయంటూ దూరప్రాంతాల వారు సందర్భం వచ్చినపుడు ప్రత్యేకంగా అడిగేవారు. అంతర్జాల వినియోగం పెరిగాక ఇంటిదగ్గర నుంచే మనకు కావాల్సిన షో చూసేందుకు టికెట్లు రిజర్వ్ చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. ఇక ఇప్పుడు ఇవన్నీ ‘తెర’మరుగై పోతున్నాయి. కళ్లు చెదిరే సినిమా థియేటర్లు ‘మినీ’గా మారి ఇంట్లోకే వచ్చేస్తున్నాయి. మహా నగరాల్లోనే కాదు మన పట్టణాలు, గ్రామాలకు సైతం ఈ అనుభూతి చేరువవుతోంది.
తమ ఇంట్లో సినిమా చూస్తున్న నిర్మల్ వైద్యుడు ప్రమోద్చంద్రారెడ్డి
మన ఇంట్లో.. మన థియేటర్లో..
థియేటర్లో సినిమా చూడాలంటే ఇంటిల్లిపాది ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేదు. ఎవరింట్లో వారికి సొంత హాల్లో కోరుకున్నది భారీ తెర మీద కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘హోం థియేటర్ల’ సంస్కృతి పెరిగిపోతోంది. ఇప్పటివరకు నాలుగు జిల్లాల్లో 150కి పైగా ఇంటి సినిమా హాళ్లు ముస్తాబయ్యాయి. అత్యాధునిక సౌండ్ సిస్టం, నవీకరించిన తెర, మిరుమిట్లు గొలిపే లైట్లు, మల్టీప్లెక్స్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో సీట్లతో సినిమా హాల్ నట్టింట్లోనే ఆనందం, ఆహ్లాదాన్ని పంచుతోంది.
కరోనా.. తీసుకొచ్చిన సినిమా హాళ్లు..
కొవిడ్ సమాజంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. కొన్ని విషయాల్లోనైతే కరోనాకు ముందు కరోనా తర్వాత అన్న పరిస్థితి ఉంది. సినిమారంగాన్ని ఈ వైరస్ బాగా ప్రభావితం చేసింది. సినీప్రియులను కొన్నాళ్లపాటు థియేటర్లకు దూరం చేసేసింది. సినిమాహాళ్లనే ఇంటికి చేర్చింది. ఈ హోం థియేటర్ల సంస్కృతికి ప్రధాన కారణం కరోనానే అని చెప్పుకోవచ్చు. కుటుంబంతో కలిసి సినిమా చూడాలన్న ఆసక్తి తీర్చుకునేందుకు, కొవిడ్ కల్గించిన భయాన్ని అధిగమించేందుకు మినీ థియేటర్లు అన్ని ప్రాంతాలకు చేరుకున్నాయి.
మినీ థియేటర్లో నిర్మల్కు చెందిన గృహిణి స్వప్న
స్థాయికి అనుగుణంగా..
ఈ మధ్య కొత్త నివాసాలు కడుతున్నవారిలో చాలామంది ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక గదినే చిన్నపాటి సినిమాహాలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రొజెక్టర్, స్క్రీన్, 5.1 (5.2.2) ఆడియో సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. నిర్మిస్తున్న ఇల్లు, అందుబాటులో ఉండే స్థలానికి అనుగుణంగా మినీ థియేటర్ను సిద్ధం చేసుకుంటున్నారు. స్థలంకొరత ఉన్నవారు ఒకే గదిలో హోం థియేటర్, లైబ్రరీ, మెడిటేషన్, డైనింగ్హాల్.. ఇలా ఎన్నో అవసరాలను సర్దుబాటు చేసుకోవచ్చు.
ఇంటిల్లిపాదికీ ఆనందం..
ఉరుకుల పరుగుల జీవితంలో పనిఒత్తిడి సర్వసాధారణంగా మారింది. అందరూ కలిసి సరదాగా బయటకు వెళ్లొద్దామంటే చాలామందికి సమయం చిక్కట్లేదు. ఇలాంటి వారికి ఇంట్లోని మినీ థియేటర్ ఓ చక్కని అవకాశంగా వచ్చింది. పెద్ద తెర కావడంతో కళ్లకు పెద్దగా ఇబ్బంది లేకుండానే సినిమాలతో పాటు పిల్లలకు ఆన్లైన్ పాఠాలు, యూట్యూబ్ వీడియోలు, తమవారి పెళ్లిళ్లు- శుభకార్యాల వీడియోలు, నచ్చిన సీరియళ్లు.. ఇలా ఇంటిల్లిపాదీ కలిసి ఏదైనా చూసేయొచ్చు. బంధువులొచ్చినా ఇంట్లోనే కొత్త సినిమా వీక్షించొచ్చు.
అద్దెకు ఈ థియేటర్లు..
మినీ థియేటర్లో కాలనీవాసులు..
చిన్న పార్టీలు, సమావేశాలు, పుట్టినరోజు వేడుకల్లాంటివి కొత్త కోణంలో చేసుకునేందుకు హోం థియేటర్లను అద్దెకిస్తున్నారు. నిర్మల్లో రెండేళ్లుగా ఈ విధానం అందుబాటులో ఉంది. ఎక్కడికో దూరతీరాలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడే బదులు తక్కువ ఖర్చుతో బయటిలోకాన్ని మర్చిపోయేలా ఇక్కడే ఆనందించొచ్చని నిర్మల్కు చెందిన నంగె శ్రీనివాస్, రమణ, తిరుమలేశ్, ప్రవీణ్ తదితరులు తమ అనుభవాన్ని వెలిబుచ్చారు.
నిర్వహణభారం ఉండదు
వివేక్, హోం థియేటర్ నిపుణుడు, నిర్మల్
ఆసక్తి ఉన్నవారి స్థాయిని బట్టి ఇంట్లోనే థియేటర్ ఏర్పాటు చేసుకోవచ్చు. కనీసం రూ.3 లక్షల నుంచి రూ. కోటి వరకు ఎంతైనా ఖర్చు చేయొచ్చు. గది, మన అవసరాలు, వినియోగితమయ్యే కేబుల్స్, స్పీకర్లు, ఇతరత్రా పరికరాలను బట్టి ధరలు పెరుగుతుంటాయి. మొదట్లో పెట్టుబడి కాస్త ఎక్కువైనా నిర్వహణకు ఎలాంటి ఖర్చుండదు. ప్రస్తుతం ప్రతీ ఇంట్లో అంతర్జాలం వినియోగిస్తున్నందున ఓటీటీకి సంబంధించిన చిత్రాలు, సీరియళ్లు ఏవైనా ఇందులో చూడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. -
డీఎల్ఎస్ఏ కార్యదర్శి బదిలీ
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా 32 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. -
విక్రయదారులు లైసెన్స్ తీసుకోకపోతే చర్యలు
[ 23-04-2024]
ఇండియాస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నమోదు లేదా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. -
25న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. -
25న విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఈనెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. -
హోటల్లో ఆకస్మిక తనిఖీ.. రూ.25వేలు జరిమానా
[ 23-04-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని బావర్చి బిర్యానీ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. -
వ్యాధి తీవ్రత అధికంగా ఉంటేనే రిఫర్ చేయాలి..
[ 23-04-2024]
మహిళల వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేయాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. -
హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు
[ 23-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి, గుట్ట హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మహిళల హక్కుల పై ఉపాధి కూలీలకు అవగాహన
[ 23-04-2024]
సఖీ కేంద్రం, మహిళా సాధికారత కేంద్రం అధ్వర్యంలో మంగళవారం అదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకొలి, లోకారి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు సఖీ కేంద్రం అందించే సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. -
ఆదిత్య ఖండేష్కర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
[ 23-04-2024]
ఆదిత్య ఖండేష్కర్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
భారాస అభ్యర్థి నామినేషన్ దాఖలు
[ 23-04-2024]
ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు చేశారు. -
మంగమఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని మంగ మఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. -
ఊరూరా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మండలంలోని పొన్నారి, తాంసి, హస్నాపూర్, కప్పలరా, బండల నాగపూర్, వడ్డాడి, గిరిగాం తదితర గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ... -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. -
సంక్షేమ మంత్రం.. ప్రత్యర్థులపై విమర్శల బాణం
[ 23-04-2024]
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న భారాస, భాజపా అభ్యర్థులు ఆత్రం సక్కు, గోడం నగేష్ వ్యవహారశైలి మీకు తెలుసు. వారి పనితనం మీకు తెలిసిందే. మంచోడు మంచోడని మంచం ఎక్కిస్తే మంచమంతా పాడు చేసినట్లు ఆత్రం సక్కు వ్యవహారం ఉంటే, బుద్ధిమంతుడని సద్ది కట్టిస్తే బొడ్రాయి దగ్గర భోంచేసి మళ్లీ ఇంటికొచ్చి బోర్లాపడుకున్నట్లు నగేష్ వ్యవహారముంది. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 23-04-2024]
విద్యాసంవత్సరం నేటితో ముగియనుంది. విద్యార్థులకు సంగ్రహణాత్మక(ఎస్ఏ2) పరీక్షలు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. -
శుద్ధజలంపై శ్రద్ధ
[ 23-04-2024]
పంచాయతీల్లో కలుషిత నీటి సరఫరాను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతిరోజు తాగు నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
పారిశ్రామిక ప్రాంతం.. ప్రచారానికి లేదు వేసవి తాపం
[ 23-04-2024]
అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే. -
ఆదిలాబాద్ లోక్సభ బరిలో..
[ 23-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బరిలో నిలిచారు. 1952లో ఆదిలాబాద్ లోక్సభ స్థానంగా ఏర్పడింది. -
మళ్లీ.. ఏనుగు గండం!
[ 23-04-2024]
గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది. -
పట్టణానికి దూరం.. కావాలి ప్రత్యామ్నాయం
[ 23-04-2024]
మంచిర్యాల ఎంసీహెచ్(మాతా, శిశు ఆరోగ్య కేంద్రం).. పట్టణానికి దూరంగా ఉండటంతో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అత్యవసరమైనవి.. ముఖ్యమైనవి.. ఆసుపత్రిలో చల్లదనం, సరిపడా నీటి సౌకర్యం. -
నకిలీ వేలిముద్రలతో పీఎంకేకే పథకంలో మోసం
[ 23-04-2024]
నకిలీ వేలిముద్రలతో హాజరు శాతం ఎక్కువగా చూపించి బిల్లులు కాజేసిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర పథకం నిర్వాహకులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఇసుక దోచేస్తున్నారు..
[ 23-04-2024]
జిల్లాలోని నదులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
సాయంత్రం ఈదురుగాలులతో అతలాకుతలం
[ 23-04-2024]
భైంసా, కుభీరు, కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రగాలులతో రేకుల ఇళ్లు, షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్