అడ్డంకి తొలగింది.. అభివృద్ధే మిగిలింది
ఎక్కడికైతే మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటాయో ఆ ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి. నేటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా కనీస రహదారి సౌకర్యాలు లేని గ్రామాలు అనేకం ఉన్నాయి.
ఖానాపూర్, న్యూస్టుడే
పుల్గంపాండ్రి అటవీ ప్రాంతం నుంచి సిరిచెల్మ వైపు వెళ్తున్న వాహనదారుడు
ఎక్కడికైతే మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటాయో ఆ ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి. నేటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా కనీస రహదారి సౌకర్యాలు లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో రహదారుల నిర్మాణాలకు నిధులు కేటాయించినా.. చాలా మార్గాలు అటవీ అనుమతులు లేక ఆగిపోయాయి. ఈక్రమంలో గతేడాది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ అటవీ ప్రాంతంలో గతంలో ప్రతిపాదనలు చేసిన రహదారులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తీసుకొచ్చిన ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్-2022 వెసులుబాటు కల్పిస్తోంది. ఫలితంగా దశాబ్దాలుగా నిర్మాణానికి నోచుకోని రహదారులకు మహర్దశ రానుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిని గుర్తించి, ఇక నిధులు మంజూరు చేయిస్తే.. పనులు చేపట్టడమే తరువాయిగా మారింది.
రహదారి నిర్మాణానికి నోచుకోని అల్లంపల్లి రహదారి
అటవీ అనుమతులు లేక ఆగిన దారులివీ..
* ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం నుంచి వాయిపేట్ వెళ్లేందుకు 14 కి.మీ. రహదారి దశాబ్దాలుగా ప్రతిపాదన దశలోనే ఉంది. వాయిపేట్, ధర్మసాగర్ల మధ్య 2 కి.మీ. రహదారి, ధర్మసాగర్ నుంచి లక్ష్మీపూర్-బి వరకు 4 కి.మీ., లక్ష్మీపూర్ నుంచి రిమ్మకు 3 కి.మీ. నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్యోజన పథకంలో.. గతంలో రూ.10 కోట్లు మంజూరయ్యాయి. అటవీ అనుమతులు లేకపోవడంతో పనులు ముందుకు సాగలేదు.
* నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉట్నూరు ప్రధాన రహదారి నుంచి 14 కి.మీ. దూరంలో ఉన్న అల్లంపల్లి గ్రామానికి పక్కా రహదారి నిర్మాణం నోచుకోలేదు. మంచిర్యాల ప్రధాన రహదారి నుంచి కడెం నది మీదుగా గంగాపూర్కు 15 కి.మీ. రహదారి నిర్మించేందుకు కొన్నేళ్ల కిందట రూ.8 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. అనుమతులు రాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. పాండ్వాపూర్ నుంచి డ్యాంగూడ వరకు రహదారి నిర్మాణం ప్రతిపాదన దశలోనే నిలిచిపోయింది.
* నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సోమార్పేట్ గ్రామం(ఎర్వచింతల్) నుంచి దత్తోజిపేట్ వరకు రోడ్డు నిర్మించేందుకు అవకాశముంది.
* నిర్మల్ జిల్లా మామడ మండలంలోని తాండ్ర-వాస్తాపూర్, జన్నారం నుంచి కొలాంగూడ వరకు..
* కుమురంభీం జిల్లా తిర్యాణి, గాదిగూడ, కెరిమెరిలలో దాదాపు రూ.5 కోట్లతో ప్రతిపాదించిన రహదారులు నిలిచిపోయాయి. ఉట్నూర్, సిర్పూర్, జైనూర్లలో రూ.6 కోట్లతో ప్రతిపాదించిన పనులు నిలిచిపోయాయి.
* ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని గోండుగూడ, నర్సాపూర్ గ్రామాలకు 3కి.మీ. రహదారికి రూ.2 కోట్ల నిధులు వెచ్చించినా.. అటవీ అడ్డంకులతో నిలిచిపోయాయి.
* నిర్మల్ జిల్లా పెంబి మండలం పుల్గంపాండ్రి నుంచి సిరిచెల్మ వరకు ప్రస్తుతం కాలిబాట ఉంది. సుమారు 10 కి.మీ. ఉన్న ఈ దారిని నిర్మించేందుకు 2008లో నిధులు మంజూరు చేశారు. అటవీ అనుమతులు లేకపోవడంతో.. పుల్గంపాండ్రి వరకు బీటీ నిర్మించి వదిలేశారు. తాజా ఉత్తర్వులతో అడ్డంకులు తొలగినట్లయింది.
పాతవాటికి మాత్రమే సడలింపులు
కోటేశ్వర్రావు, ఎఫ్డీవో, ఖానాపూర్
తాజా నిబంధనల ప్రకారం గతంలో ప్రతిపాదించి, పనులు చేపట్టేందుకు అనుమతులు లేక నిలిచిపోయిన పలు రహదారుల నిర్మాణానికి కొంత వెసులుబాటు కల్పించింది. కొత్తగా ప్రతిపాదించే వాటికి ఇది వర్తించదు. ఖానాపూర్ అటవీ డివిజన్ పరిధిలో 8 గ్రామాల రహదారులకు గతంలో ప్రతిపాదనలు పంపించారు. వీటి నిర్మాణానికి అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా