అందాల జలపాతం.. అసౌకర్యాల రాజ్యం
రాష్ట్రంలోనే ఎత్తయిన కుంటాల జలపాతం వద్ద పర్యాటకులకు సౌకర్యాలు లేక అవస్థలు తప్పడం లేదు. ఇక్కడికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి సెలవు రోజులు, శని, ఆదివారాల్లో జలపాత అందాలను వీక్షించేందుకు భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు.
న్యూస్టుడే, నేరడిగొండ
కుంటాల జలపాతం
రాష్ట్రంలోనే ఎత్తయిన కుంటాల జలపాతం వద్ద పర్యాటకులకు సౌకర్యాలు లేక అవస్థలు తప్పడం లేదు. ఇక్కడికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి సెలవు రోజులు, శని, ఆదివారాల్లో జలపాత అందాలను వీక్షించేందుకు భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు జలపాత అందాల గురించి గొప్పగా చెప్పడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదు.
పర్యాటకుల ఇబ్బందులను గుర్తించిన సంబంధిత శాఖ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపారు. కేంద్ర గిరిజన సంక్షేమ నిధుల ద్వారా 2020లో హోటల్ నిర్మాణం కోసం రూ.3.81 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పర్యాటకులు సేద తీరేందుకు విశ్రాంత గదులు, భోజన గదులు, గిరిజన నివాసాల రూపంలో అందమైన కాటేజ్ నిర్మాణం, పచ్చదనం ఉట్టిపడేలా పార్కు, విశాలమైన రోడ్డు నిర్మిస్తారు. వాహనాలు నిలిపేందుకు స్థలం కేటాయించాలి. వీటితో పాటు మరిన్ని సౌకర్యాలు ప్రణాళికలో ఉన్నాయి. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు.
నిర్మాణం పూర్తి చేస్తే..
జలపాతం సమీపంలో అనువైన స్థలం కేటాయిస్తే హోటల్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కుంటాల గ్రామస్థులంతా సమావేశమయ్యారు. జలపాత సమీపంలో రూ.3 లక్షలతో, 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమికి సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేశారు. హరిత హోటల్ నిర్మాణం పూర్తయితే గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
మహిళలకు అవస్థలు..
సుదూర ప్రాంతాల నుంచి జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చిన మహిళలు మూత్రశాలలు లేక ఇబ్బంది పడుతున్నారు. అక్కడి సిబ్బంది, సమీపంలో మరుగుదొడ్లు నిర్మించేందుకు ఎంపిక చేసి పునాది నిర్మించిన స్థలంలో పాలిథీన్ కవర్లతో తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేశారు. జలపాతం వద్ద పర్యాటకుల సందడి ఉండటంతో వారు వాటిని సైతం వినియోగించుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు.
అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం
రవికుమార్, జిల్లా పర్యాటక అధికారి
ప్రైవేటు కన్సల్టెంట్ సంస్థ నిర్మాణ పనుల ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. డిజైనింగ్ పూర్తయిన తరువాత టెండరు ప్రక్రియ పూర్తి చేస్తాం. పనులు ప్రారంభించమని ప్రభుత్వం నుంచి నివేదికలు రాగానే హోటల్, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదిత్య ఖండేష్కర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
[ 23-04-2024]
ఆదిత్య ఖండేష్కర్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
భారాస అభ్యర్థి నామినేషన్ దాఖలు
[ 23-04-2024]
ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు చేశారు. -
మంగమఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని మంగ మఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. -
ఊరూరా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మండలంలోని పొన్నారి, తాంసి, హస్నాపూర్, కప్పలరా, బండల నాగపూర్, వడ్డాడి, గిరిగాం తదితర గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ... -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. -
సంక్షేమ మంత్రం.. ప్రత్యర్థులపై విమర్శల బాణం
[ 23-04-2024]
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న భారాస, భాజపా అభ్యర్థులు ఆత్రం సక్కు, గోడం నగేష్ వ్యవహారశైలి మీకు తెలుసు. వారి పనితనం మీకు తెలిసిందే. మంచోడు మంచోడని మంచం ఎక్కిస్తే మంచమంతా పాడు చేసినట్లు ఆత్రం సక్కు వ్యవహారం ఉంటే, బుద్ధిమంతుడని సద్ది కట్టిస్తే బొడ్రాయి దగ్గర భోంచేసి మళ్లీ ఇంటికొచ్చి బోర్లాపడుకున్నట్లు నగేష్ వ్యవహారముంది. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 23-04-2024]
విద్యాసంవత్సరం నేటితో ముగియనుంది. విద్యార్థులకు సంగ్రహణాత్మక(ఎస్ఏ2) పరీక్షలు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. -
శుద్ధజలంపై శ్రద్ధ
[ 23-04-2024]
పంచాయతీల్లో కలుషిత నీటి సరఫరాను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతిరోజు తాగు నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
పారిశ్రామిక ప్రాంతం.. ప్రచారానికి లేదు వేసవి తాపం
[ 23-04-2024]
అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే. -
ఆదిలాబాద్ లోక్సభ బరిలో..
[ 23-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బరిలో నిలిచారు. 1952లో ఆదిలాబాద్ లోక్సభ స్థానంగా ఏర్పడింది. -
మళ్లీ.. ఏనుగు గండం!
[ 23-04-2024]
గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది. -
పట్టణానికి దూరం.. కావాలి ప్రత్యామ్నాయం
[ 23-04-2024]
మంచిర్యాల ఎంసీహెచ్(మాతా, శిశు ఆరోగ్య కేంద్రం).. పట్టణానికి దూరంగా ఉండటంతో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అత్యవసరమైనవి.. ముఖ్యమైనవి.. ఆసుపత్రిలో చల్లదనం, సరిపడా నీటి సౌకర్యం. -
నకిలీ వేలిముద్రలతో పీఎంకేకే పథకంలో మోసం
[ 23-04-2024]
నకిలీ వేలిముద్రలతో హాజరు శాతం ఎక్కువగా చూపించి బిల్లులు కాజేసిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర పథకం నిర్వాహకులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఇసుక దోచేస్తున్నారు..
[ 23-04-2024]
జిల్లాలోని నదులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
సాయంత్రం ఈదురుగాలులతో అతలాకుతలం
[ 23-04-2024]
భైంసా, కుభీరు, కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రగాలులతో రేకుల ఇళ్లు, షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?