చోరీలు ఎక్కువ.. చిక్కేది తక్కువ
జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చోరీలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏటా చోరీలు పెరుగుతున్నా.. అందులో పోలీసులు ఛేదిస్తున్నవి పదుల సంఖ్యలో మాత్రమే ఉంటున్నాయి.
కాగజ్నగర్, న్యూస్టుడే
* కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం న్యూకాలనీ ఉద్యోగులు ఓఆర్టీ-363, దాని వెనుక భాగంలోని ఓఆర్టీ-308లో ఇంటి యజమానులు సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లారు. తిరిగి వచ్చేలోపు ఆ రెండు క్వార్టర్ల తాళాలను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.
* తాజాగా కాగజ్నగర్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో గుర్తుతెలియని వ్యక్తి పండ్లు విక్రయిస్తూ జీవనోపాధి పొందే వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు.
జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చోరీలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏటా చోరీలు పెరుగుతున్నా.. అందులో పోలీసులు ఛేదిస్తున్నవి పదుల సంఖ్యలో మాత్రమే ఉంటున్నాయి. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా జరుగుతున్న దొంగతనాల్లో నిందితులు ఎంతకూ చిక్కకపోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. సీసీ కెమెరాల్లో ఆధారాలు లభించినప్పటికీ దొంగలు పోలీసులకు చిక్కడం లేదు.
జిల్లాలోని కాగజ్నగర్ పురపాలికతో పాటు పలు మండలాలు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు చిన్న చిన్న వస్తువుల విక్రయాల పేరిట పట్టణం, మండలాల్లో పర్యటిస్తుంటారు. ఆ సమయంలో తాళం వేసిన ఇళ్లను గుర్తించి, మరుసటి రోజు చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 2022లో జిల్లాలో 124 నేరాల్లో రూ.76.04 లక్షల విలువైన నగలు, బంగారం ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. 47 కేసులు పరిష్కరించి రూ.17.36 లక్షలు రికవరీ చేశారు. మిగతా కేసులు విచారణలోనే ఉన్నాయి.
దృశ్యాలు కనిపించినా..
2022 నవంబరు 17న కాగజ్నగర్ ప్రయాణ ప్రాంగణం ఏరియాలో నిలిపిన లారీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. 18న ఆ లారీ అంతర్రాష్ట్ర రహదారి మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వైపు వెళ్లినట్లు ఆ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని ఫుటేజీలు పోలీసులకు లభించినప్పటికీ ఇప్పటికీ ఆ లారీని పట్టుకోలేక పోయారు.
* 2022 డిసెంబరు 1న పెట్రోల్పంపు ఏరియాలోని టీచర్స్ కాలనీలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ జరుగ్గా, దాదాపు రూ.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ముందస్తు సమాచారంతోనే కట్టడి..
ఎస్పీఎం క్వార్టర్లలోని ఉద్యోగులు ఊళ్లకు వెళితే ఎస్పీఎం సెక్యూరిటీ ఆఫీసర్(ఎస్హెచ్ఓ)కు ముందస్తు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. పట్టణవాసులు, మండలాల పరిధిలోని వారు సైతం ఊర్లకు వెళితే విలువైన నగలు, నగదు ఇంట్లో ఉండకుండా జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు.
* 2022 డిసెంబరు 2న కాగజ్నగర్ పట్టణంలోని బాలాజీనగర్లోని ఆదర్శ కాలనీలో వ్యాపారి సురేష్ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడు. ఆ సమయంలో సురేష్ భార్య అన్నపూర్ణ ఒక్కరే ఉండటంతో అరిస్తే చంపేస్తానంటూ(హిందీ)లో బెదిరించాడు. ఈ ఘటనలో అయిదు తులాల బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఆ ఇంటి ఆవరణలోని సీసీ కెమెరా ఫుటేజీలు, కాలనీలోని కెమెరాల్లో ఆ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు ఆధారాలు లభించాయి. నేటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు.
ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం
కరుణాకర్, డీఎస్పీ, కాగజ్నగర్
పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేసి ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం జరిగిన చోరీలపై సమగ్ర విచారణ జరుగుతోంది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్