ఐదేళ్లుగా.. అదేకథ..
పట్టణంలోని ద్వారకానగర్ కాలనీలో పైప్లైన్ లీకేజీ కారణంగా ఇలా గుంత తవ్వి వదిలేశారు. నెలన్నర రోజులుగా గుంతను పూడ్చకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బల్దియాలో ‘భగీరథ’ పనుల దుస్థితి..
ఆదిలాబాద్ పట్టణం, న్యూస్టుడే
పట్టణంలోని ద్వారకానగర్ కాలనీలో పైప్లైన్ లీకేజీ కారణంగా ఇలా గుంత తవ్వి వదిలేశారు. నెలన్నర రోజులుగా గుంతను పూడ్చకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టణంలోని విద్యానగర్ కాలనీలో వేసిన పైప్లైన్
జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ పనులతో ప్రజలు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. పట్టణంలో గ్రామాలు విలీనం కాకముందు నుంచి మొదలైన ఈ పనుల్లో నాణ్యత లోపించడంతోపాటు నత్తతో పోటీపడడం విమర్శలకు తావిస్తోంది. చాలాచోట్ల ఇప్పటికీ పాత పైప్లతోనే నీరు అందిస్తుండగా.. అడపాదడపా తమకు ఇష్టమున్న చోట అధికారులు కొత్తగా పైప్లైన్ తవ్వుతూ పనులు చేపడుతున్నారు. అయిదేళ్లయినా ఈ పనులు పూర్తికాకపోవడం, తరచూ లీకేజీలతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో భగీరథ పనుల బాధ్యత గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు అప్పగించగా.. పట్టణంలో మాత్రం ప్రజారోగ్య విభాగం (పబ్లిక్ హెల్త్) పర్యవేక్షిస్తోంది. గతంలో పట్టణ జనాభా 1.17 లక్షల వరకు ఉండగా ప్రతి ఒక్కరికి నిర్మల్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి శుద్ధిచేసిన జలాన్ని అందించేందుకు పనులు మొదలెట్టారు. ఐదేళ్ల కిందట ఎల్అండ్టీ సంస్థ పనులు దక్కించుకుంది. అప్పటినుంచి పనులు సాగుతూనే వచ్చాయి.
శాఖల సమన్వయం లేక..
పట్టణంలో పలుచోట్ల ఆర్అండ్బీ శాఖకు చెందిన రహదారులు ఉండటంతో వారితో సమన్వయం లేకుండానే పనులు చేపట్టారు. ఇలా తెలంగాణ కూడలి నుంచి వినాయక్చౌక్ వరకు వేసిన పైప్లైన్ను ఇటీవల విస్తరణలో మళ్లీ తీసి పక్కకు జరపాల్సి వచ్చింది. దీనికోసం ఆర్అండ్బీకి రూ.10 లక్షల అదనపు ఖర్చు రాగా నెలపాటు వివిధ కాలనీలకు నీటి సరఫరా కాక ఇబ్బందులు పడ్డారు.
లీకేజీలపై ఫిర్యాదులు..
దాదాపు ప్రతి కాలనీలో లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో నీరు వృథా అవుతుండటంతోపాటు చాలాచోట్ల నీరు కలుషితమవుతోంది. ద్వారకానగర్లో నీటి కలుషితంతో సదరు వార్డు కౌన్సిలర్ పుర అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. దాదాపు రెండు వందలకుపైగా లీకేజీలపై ఫిర్యాదు రావడంతో.. అధికారులు తమకు సంబంధంలేదని పనులు పర్యవేక్షిస్తున్న ప్రజారోగ్య అధికారులకు చెప్పడం, వారు మరమ్మతులు చేయడంలో జాప్యం చేయడం పరిపాటిగా మారింది.
తక్కువ లోతులో తవ్వకాలు
వాస్తవానికి పెద్ద పైప్లైన్ ఉంటే మీటరున్నర, అంతర్గత పైప్లైన్ వేస్తే మీటరు లోతు వరకు గుంత తవ్వాలి. ఇక్కడ మాత్రం అర మీటర్ వరకు తవ్వేసి చేతులు దులుపేసుకున్నారు. పట్టణంలోని దాదాపు 20కిపైగా కాలనీల్లో అంతర్గత పైప్లైన్లు అసలు వేయనలేదు. పాత పైప్లైన్లకే కనెక్షన్ ఇచ్చి నీరు అందిస్తుండటం గమనార్హం.
కొత్త గుత్తేదారు వచ్చినా..
తొలుత ఎల్అండ్టీ సంస్థ పనులు దక్కించుకుంది. దాదాపు 90శాతం వరకు పనులు చేపట్టిన ఆ సంస్థ ఆ తరువాత నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ముందుకు సాగలేదు. అడపాదడపా పనులు చేపట్టడం విమర్శలకు తావిచ్చింది. దీంతో సదరు సంస్థను తొలగించి కొత్త గుత్తేదారుకు ఎనిమిది నెలల కిందట బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ గుత్తేదారు వచ్చినా.. అదే పరిస్థితి నెలకొనడం ప్రజలకు శాపంగా మారింది.
అధికారి ఏమన్నారంటే..
ఈ విషయమై ప్రజారోగ్య విభాగం ఏఈ హరి భువన్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ.. త్వరితగతిన పనులు పూర్తిచేస్తామన్నారు. నిర్మల్ సబ్డివిజన్ పరిధిలోని నిర్మల్, ఆదిలాబాద్, భైంసా, ఖానాపూర్ బల్దియాల్లోని పనుల పర్యవేక్షణకు ముగ్గురు ఏఈలు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉండడంతోనే కొంత వరకు జాప్యమవుతోందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!