ఒక్కో సీటుకు రూ. లక్షపైనే వసూలు!
అభ్యర్థుల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు బీఎడ్ కళాశాలల యాజమాన్యాలు తమ కోటా సీట్లను రూ.లక్షల్లో కట్టబెడుతూ కొత్తరకం దోపిడీకి తెరలేపాయి.
బీఎడ్ కళాశాల యాజమాన్యాల తీరిది
న్యూస్టుడే, పాలనాప్రాంగణం
అభ్యర్థుల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు బీఎడ్ కళాశాలల యాజమాన్యాలు తమ కోటా సీట్లను రూ.లక్షల్లో కట్టబెడుతూ కొత్తరకం దోపిడీకి తెరలేపాయి. పొరుగు జిల్లాల్లో రూ.వేలు వెచ్చిస్తేనే సీటు లభిస్తుంటే ఇక్కడ మాత్రం అభ్యర్థుల జేబులను గుల్లచేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. డబ్బులు చెల్లించి ప్రవేశం పొందాక అసలు విషయం తెలిసి అవాక్కవడం అభ్యర్థుల వంతవుతోంది.
మంచిర్యాల జిల్లాలో బీఎడ్ కళాశాలలు లేవు. ఆదిలాబాద్ జిల్లాలో మూడు ఉండగా ఇందులో ఒకటి ఉట్నూరులోని ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వ గిరిజన బీఎడ్ కళాశాల.. నిర్మల్ జిల్లాలో ఒకటి, కుమురం భీం జిల్లాలో రెండు కలుపుకొని మొత్తం ఆరు బీఎడ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఉట్నూరులోని గిరిజన బీఎడ్ కళాశాల మినహాయిస్తే మిగిలిన అయిదు కళాశాలలు ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో కొనసాగుతున్నాయి. ఇందులో 75 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయాల్సి ఉండగా.. మిగిలిన 25 శాతం మేర సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీ చేయాల్సి ఉంది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ విషయంలో అంతగా ఇబ్బందులు లేకపోయినా యాజమాన్య కోటా సీట్ల విషయంలోనే అసలైన చిక్కు నెలకొంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెల్లువలా వెలువడటం.. ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేయాలన్నా.. బీఎడ్ అర్హత తప్పనిసరి. దీనికితోడు బీఎడ్ అర్హత కలిగి ఉంటే సెకండరీ స్కూల్ టీచరు(ఎస్జీటీ)తో పాటు స్కూల్ అసిస్టెంటు(ఎస్ఏ) పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉండటంతో అంతా డీఎడ్కి బదులు బీఎడ్ కోర్సు వైపు మొగ్గుచూపుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండటం, సీట్లు పరిమితంగా ఉండటంతో యాజమాన్యాలు తమను సంప్రదిస్తున్న వారికి ఒక్కో సీటుకు రూ.లక్షపైనే చెబుతూ సీట్లు లేవని, మీరు కాదంటే మరొకరు సిద్ధంగా ఉన్నారంటూ బురిడీ కొట్టిస్తున్నారు. తరగతులకు హాజరుకావద్దని, ఇతర ప్రాంతాలకు వెళ్తే సెమిస్టర్ లెక్కన అధిక డబ్బులు వసూలు చేస్తారని, తమ కళాశాలలో చేరాలంటూ ఏజెంట్లను పెట్టుకుని మరీ ప్రచారం చేయిస్తున్నారు. మెరుగైన బోధనలో పోటీపడాల్సిన యాజమాన్యాలు జట్టు కట్టి అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా విద్యావ్యాపారం కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే సీటు ఉంది మరి!
జిల్లాలో ఏ బీఎడ్ కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించినా వారి నోట ఒకే సీటు ఉందనే మాట వినిపిస్తోంది. ఆలస్యం చేస్తే అదికూడా పోతుందని నమ్మబలుకుతున్నారు. చేసేదేమి లేక వారడిగినట్లు సబ్జెక్టు ఏదైనా రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు ఇచ్చుకుంటున్నారు. మరీ బతిమాలితే నాలుగైదు విడతల్లో డబ్బులు కట్టొచ్చని ఒప్పుకొంటున్నారు.
అక్కడ రూ.25 వేలే..!
నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో యాజమాన్య సీటును కేవలం రూ.25 వేలకే ఇస్తున్నారు. తరగతులకు హాజరుకాకున్నా ఫర్వాలేదని, అంతా తామే చూసుకుంటామని చెబుతుండటం విశేషం. అక్కడి యాజమాన్యాల ప్రతిపాదన తమకు అనుకూలంగా ఉండటంతో పొరుగు జిల్లాలకు వెళ్లి అక్కడి కళాశాలల్లో చేరుతున్నారు. ఆ నోట.. ఈ నోట విషయం జిల్లాలో ఆయా కళాశాలల్లో చేరిన అభ్యర్థుల చెవిన పడటంతో ఇక్కడి యాజమాన్యాల తీరుతో మోసపోయామని లబోదిబోమంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.