ఏజెన్సీలో ఇంకా అందని రేషన్
జిల్లాలో సంకేతాల సమస్యలతో ఆన్లైన్లో కాకుండా పాతవిధానంలో కొనసాగుతున్న చౌకధరల దుకాణాల్లో ఇంకా బియ్యం పంపిణీ మొదలు కాలేదు.
కొన్ని దుకాణాల్లో మొదలుకాని పంపిణీ
ఆసిఫాబాద్, తిర్యాణి, న్యూస్టుడే
జిల్లాలో సంకేతాల సమస్యలతో ఆన్లైన్లో కాకుండా పాతవిధానంలో కొనసాగుతున్న చౌకధరల దుకాణాల్లో ఇంకా బియ్యం పంపిణీ మొదలు కాలేదు. నెలాఖరు సమీపిస్తున్నా బియ్యం అందక లబ్ధిదారులు నిత్యం దుకాణాలకు వచ్చిపోతున్నారు. ఈ-పోస్ ఆన్లైన్ విధానంలో కొనసాగుతున్న దుకాణాల్లో దాదాపు ఇప్పటికే బియ్యం పంపిణీ పూర్తయ్యింది. మరి తమకు ఎప్పుడిస్తారంటూ ఎదురుచూస్తున్నారు.
ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలో రెండు మూడు నెలలుగా పంపిణీ సక్రమంగా జరగడం లేదు. కేంద్రం ఉచిత బియ్యాన్ని మరో ఏడాదికి పెంచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాము అందించే కోటాపై తర్జనభర్జనల అనంతరం వారం క్రితం ఒక్కో యూనిట్కు అయిదు కేజీల చొప్పున పంపిణీకి ఆదేశించింది. దీంతో ఆలస్యంగా పంపిణీ మొదలైంది. ఈ-పోస్ విధానంలో కొనసాగుతున్న 269 దుకాణాల్లో దాదాపుగా ఇప్పటికే బియ్యం పంపిణీ పూర్తి చేశారు. కానీ మాన్యువల్గా పాతవిధానంలో పంపిణీ చేస్తున్న 31 దుకాణాలకు ఇంకా పూర్తి స్థాయిలో బియ్యం సరఫరా కాలేదు. దీంతో ప్రధానంగా ఏజెన్సీ మండలాల్లోని లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
బియ్యం సరఫరా కాక తెరచుకోని గుండాల రేషన్ దుకాణం
సంకేతాల సమస్యతో ఇబ్బంది..
జిల్లాలో తొమ్మిది మండలాల్లోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ సంకేతాలు రావడంలేదు. దీంతో వీటి పరిధిలోని 31 రేషన్ దుకాణాల్లో డీలర్లు మాన్యువల్గా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ దుకాణాల పరిధిలో 8594 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో 29,912 మంది లబ్ధిదారులున్నారు. వీరి కోసం నెల కోటా 1698.25 క్వింటాళ్ల బియ్యం అవసరం అవుతాయి. ఈ దుకాణాలకు బియ్యం కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి ఆర్వోలు సకాలంలో జిల్లా కార్యాలయానికి రాకపోవడంతో బియ్యం సరఫరా కాలేదు. రెండు రోజులుగా సరఫరా మొదలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఇంకా దుకాణాలు తెరవలేదు. దీంతో లబ్ధిదారులు నిత్యం దుకాణాల చుట్టూ తిరుగుతూ నిరాశపడుతున్నారు. ఈ నెల 30 వరకే పంపిణీకి గడువు ఉంది.
డీలర్లకు సూచనలు చేశాం..
- తారామణి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి
జిల్లాలో 31 రేషన్ దుకాణాల్లో మాన్యువల్గా బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఈ నెల ఆ రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరాలో ఆర్వోలు రావడంలో కాస్త ఆలస్యం జరిగింది. రెండు రోజులుగా సరఫరా మొదలైంది. డీలర్లు వెంటనే బియ్యం పంపిణీ చేయాలని సూచించాం.
బియ్యం ఇంకా రాలేదు
- సిడాం రాజేశ్వర్, రోంపల్లి
మాది తిర్యాణి మండలం రోంపల్లి. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఈ నెల రేషన్ బియ్యం ఇప్పటి వరకు మాకు అందలేదు. నిత్యం డీఆర్ డిపో వద్దకు వెళ్లి తిరిగి వస్తున్నా. ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పడంలేదు. ప్రతినెలా మాకు ఇదే పరిస్థితి. ఎప్పుడు బియ్యం వస్తున్నాయో తెలియడంలేదు. బయట బియ్యం ధరలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు స్పందించి త్వరగా ఇప్పించేలా చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడా ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 24-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పల్లెల్లో ప్లాట్లు.. కొన్నవారికి పాట్లు
[ 24-04-2024]
అనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినా.. ‘రియల్’ దందా చేసే వ్యక్తులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీ అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలోని 396 పంచాయతీల్లో అధికారులు గుర్తించిన లేఅవుట్లు 419 ఉండగా.. ఇందులో కేవలం ఎనిమిదింటికి మాత్రమే అనుమతులున్నాయి. -
ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
[ 24-04-2024]
వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. -
25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
[ 24-04-2024]
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. -
ఏడుసార్లు ఎంపీ.. రెండుసార్లు ఎమ్మెల్యే
[ 24-04-2024]
గుడిసెల వెంకటస్వామిగా, కాకాగా గుర్తింపు పొందిన గడ్డం వెంకటస్వామి తెలంగాణ నుంచి అత్యధికంగా ఏడుసార్లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి సుదీర్ఘకాలం చట్టసభలకు ఎన్నికైన నేతగా పేరు గడించారు. -
ఉక్కపోత.. చిన్నారుల వెత
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
రక్షణ తీగలే.. యమపాశాలు
[ 24-04-2024]
రేయింబవళ్లు కష్టపడి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అడవి జంతువుల కారణంగా చేజారుతున్నాయి. -
తునికాకు సేకరణకు వేళాయె..
[ 24-04-2024]
ఈ ఏడాది తునికి ఆకు సేకరణకు అటవీశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో ఆకు నాణ్యత బాగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు -
అక్రమ దందా.. అధికారుల అండ
[ 24-04-2024]
రాయితీ బియ్యం దందా చూడడానికి మామూలుగా అనిపిస్తుంది. దీనిపై లోతుగా తెలుసుకుంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
గొలుసుకట్టు.. అక్రమాలతో కనికట్టు
[ 24-04-2024]
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా పదేళ్ల కిందట ఓ జిల్లా అధికారి నేతృత్వంలో సాగిన గొలుసుకట్టు వ్యాపారంలో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. -
ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
[ 24-04-2024]
వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం నస్పూర్లోని కలెక్టరేట్లో ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్.శాంతారామ్, -
25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
[ 24-04-2024]
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల బాలలు పాఠశాల స్థాయిలో చదువును మానేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు