గైర్హాజరైన అధికారులపై చర్యలకు పట్టు
జిల్లా పరిషత్ సమావేశానికి గైర్హాజరైన వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులకు నోటీసులు జారీచేయడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేష్ నేత పాలనాధికారి భారతి హోళ్లికేరి, జడ్పీ ఛైర్పర్సన్ భాగ్యలక్ష్మిలకు సూచించారు.
సమావేశంలో మాట్లాడుతున్న పాలనాధికారి భారతి హోళ్లికేరి, చిత్రంలో జడ్పీ ఛైర్పర్సన్ భాగ్యలక్ష్మి, అధికారులు
మంచిర్యాల గ్రామీణం, న్యూస్టుడే: జిల్లా పరిషత్ సమావేశానికి గైర్హాజరైన వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులకు నోటీసులు జారీచేయడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేష్ నేత పాలనాధికారి భారతి హోళ్లికేరి, జడ్పీ ఛైర్పర్సన్ భాగ్యలక్ష్మిలకు సూచించారు. బుధవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి అధికారుల పనితీరు మచ్చలాగా మారుతుందని మండిపడ్డారు. సమావేశాలను నామమాత్రంగా నిర్వహించడం బాధాకరమన్నారు. గూడెం గుట్ట వద్ద భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న మద్యం దుకాణాలను సత్వరమే మూసివేయాలని ఎక్సైజు శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. రైతులకు కరెంటు కోతలు లేకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. రైస్ మిల్లుల నుంచి రేషన్ బియ్యం సన్నబియ్యంగా మారుస్తున్నారంటూ సభ్యులు అడగగా.. పౌరసరఫరాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్య్స, నీటి పారుదల శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా సమావేశాలను నిర్వహించాలని సూచించారు.
* సమావేశానికి అధ్యక్షత వహించిన ఛైర్పర్సన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తాండూరు కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగిస్తున్నారని డీఈవో వెంకటేశ్వర్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో పనులు చేయించడమేమిటని నిలదీశారు. సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు.
* పాలనాధికారి భారతి హోళ్లికేరి మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగి పింఛన్లు అందని దివ్యాంగులు ఉన్నట్లయితే అధికారులను సంప్రదిస్తే వారికి పింఛన్లు మంజూరు చేసేలా కృషిచేస్తామన్నారు. పడకల సంఖ్యను పెంచినందున బెల్లంపల్లి ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గూడెం ఎత్తిపోతల పథకం పైపులైను పనుల్లో నిర్లక్ష్యంపై జడ్పీటీసీ సభ్యుడు సత్తయ్య, ఎంపీపీ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించి పనులపై పర్యవేక్షణ చేసేలా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలిస్తామన్నారు.
* సమావేశంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. వేమనపల్లి, నెన్నెల మండలాల్లోని రహదారుల నిర్మాణం పనుల్లో జాప్యంపై సంబంధిత శాఖల అధికారులపై మండిపడ్డారు. మూడేళ్లుగా నీల్వాయి వంతెన నిర్మాణం పనులు కొనసాగుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. పలు శాఖల అధికారులు వారి నివేదికలను చదివి వినిపించగా సభ్యులు అడిగిన సమస్యలను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
* డీసీసీబీ ఛైర్మన్ భోజారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని కోరారు. రహదారుల పనుల్లో జాప్యంపై, అర్హులకు పింఛన్ల అందజేత విషయంలో, విద్యార్థులకు సరిపడా ఏకరూప దుస్తుల గురించి తదితర సమస్యలపై సభ్యులు ప్రశ్నించారు. అదనపు పాలనాధికారి రాహుల్, జడ్పీ సీఈవో నరేందర్, డీసీఎంఎస్ ఛైర్మన్ తిప్పని లింగయ్య, డీసీసీబీ ఛైర్మన్ భోజారెడ్డి, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ ప్రవీణ్కుమార్, వివిధ మండలాల జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రోటోకాల్ అంశంపై ఎంపీ ఆగ్రహం
జడ్పీ సీఈవో నరేందర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎంపీ వెంకటేష్ నేతను తీసుకెళ్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య
ప్రోటోకాల్ అంశంపై మంచిర్యాల జిల్లా పరిషత్ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్పై పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన ఎంపీ వెంకటేష్ నేత.. వచ్చీ రాగానే తనకు ముందువరుసలో చివరకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఈ క్రమంలో ‘సర్ మీరు ఎమ్మెల్యేలు కూర్చునే వైపునకు రావాలి’ అని జడ్పీ సీఈవో నరేందర్ ఎంపీకి సూచించారు. దీంతో ఎంపీ నాకు ఇదే సీటు కేటాయించారుగా.. దీనికి బాధ్యులెవరంటూ ఆయనను ప్రశ్నించారు. సదరు అధికారి వివరణ ఇస్తుండగానే ఎంపీ వెంకటేష్ తన సీటులోంచి లేచి ప్రోటోకాల్ అంశంపై జడ్పీ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎంపీని శాంతింపచేసి సీటులోకి తీసుకుని వచ్చారు. అధికారులు జడ్పీ సమావేశానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు తొలుత వేర్వేరుగా ప్రత్యేకంగా సీట్లను కేటాయించినప్పటికీ.. ఎంపీకి సంబంధించిన సీటుపై ఉంచిన నామఫలకం బోర్డును చివరి సీటుకు మార్చారు. దీన్ని ఎవరూ గ్రహించకుండా ఉన్న క్రమంలోనే ఎంపీ వెంకటేష్ నేత సమావేశానికి వచ్చారు. వచ్చీ రాగానే సీటు కేటాయింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!