పాత వాహనాలు పనికిరావు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నడిచే వాహనాలకు నిర్ణయించిన కాలపరిమితిని ఇక నుంచి పక్కాగా అమలు చేయాలని రవాణా శాఖ పట్టుదలతో ఉంది. దీంతో జిల్లాలో పాత వాహనాలు తక్కులోకి చేరే అవకాశముంది.
ఏప్రిల్ 1 నుంచి అమలుచేసేలా చర్యలు
విక్రయానికి సిద్ధంగా పాత ద్విచక్రవాహనాలు
మంచిర్యాల గ్రామీణం, న్యూస్టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నడిచే వాహనాలకు నిర్ణయించిన కాలపరిమితిని ఇక నుంచి పక్కాగా అమలు చేయాలని రవాణా శాఖ పట్టుదలతో ఉంది. దీంతో జిల్లాలో పాత వాహనాలు తక్కులోకి చేరే అవకాశముంది. పాత వాహనాలు కొనుగోలు చేసేవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో ఈ నిబంధనలు ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంతో నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించి ఆ దిశగా నిర్ధేశిత కాలపరిమితి ముగిసిన వాహనాలు రోడ్డుపై నడవకుండా చర్యలు తీసుకునేలా రంగం సిద్ధం చేస్తోంది.
తుక్కు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు...
ప్రభుత్వం నిర్దేశిత గడువు నిండిన వాహనాలు రోడ్డుపై నడపకుండా ఉండేందుకు రవాణా శాఖ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. తొలుత ప్రభుత్వ వాహనాలు గుర్తించేందుకు ఇప్పటికే జిల్లా రవాణాశాఖ అధికారులు ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు వాహనాల వివరాలు అందించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ వాహనాలకు 15 ఏళ్లు, వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల పాటు నిర్ధేశిత కాలపరిమితి ఉంది. ఇది ముగిసిన వెంటనే ఆయా వాహనాల సామర్థ్య పరీక్షలు విధిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనేక వాహనాలు సామర్థ్య పరీక్షలు చేయకుండా రహదారులపై తిరుగుతుండడంతో వాహన కాలుష్యం భారీగా పెరుగుతోంది. దీన్ని నివారించేందుకు పాతవాహనాలను గుర్తించి తుక్కుకేంద్రాలకు తరలించనున్నారు. దీనికోసం ప్రభుత్వం తుక్కు కేంద్రాలను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గడువు మీరిన పాత వాహనాలను తుక్కుగా మార్చి కొత్త వాహనాలను కొనుగోలు చేసే వాహనదారులకు రాయితీలు అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాయితీలు ఇచ్చినట్లయితే వాహనదారులు పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ చర్యల ద్వారా కాలుష్యం తగ్గించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది.
ప్రభుత్వ శాఖల వివరాలు సేకరిస్తున్నాం..
- కిష్టయ్య, జిల్లా రవాణాశాఖ అధికారి, మంచిర్యాల
జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్నటువంటి వాహనాల వివరాలను సేకరించే ప్రక్రియ చేపట్టాం. ఏప్రిల్ 1 నుంచి పాతవాహనాలను తుక్కుగా మార్చాలనే ఆదేశాలు ఇంతవరకు అధికారికంగా అందలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఆ రకమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండేలా పాతవాహనాల వివరాలు సేకరించే పనులు చేస్తున్నాం. ఇప్పటికే హరితపన్ను వసూలు చేస్తున్నప్పటికీ గడువుమీరిన వాహనాలపై చర్యలు తీసుకుంటేనే సమాజానికి మేలు కలుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముఖ్య నేతల కోసం అభ్యర్ధుల యత్నం
[ 20-04-2024]
ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాలు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల తేదీలు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వు కాగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానం. -
బాలభవన్ కల సాకారమయ్యేనా?
[ 20-04-2024]
కళలకు నిలయంగా ఆదిలాబాద్లోని బాలకేంద్రం నిలుస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన బాలలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. -
నిర్మల్ నేతలదే ఆధిపత్యం
[ 20-04-2024]
ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్సభకు సంబంధించినవి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. -
పరిమళించిన పల్లె.. పరిశ్రమల ముల్లె
[ 20-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానంగా 62 ఏళ్ల కింద ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు 15 మంది ఎంపీ అభ్యర్థులుగా దిల్లీకి వెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలతో సమ్మిళితమై ఉంటుంది. -
రెండోరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరే!
[ 20-04-2024]
లోక్సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు. -
ఆత్రం సుగుణకు ఆభరణాలు లేవు..
[ 20-04-2024]
తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్ కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో పెండింగ్లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ వెల్లడించారు. -
సరిహద్దు గ్రామాల్లో.. ముగిసిన పోలింగ్
[ 20-04-2024]
తెలంగాణ - మహారాష్ట్ర వివాదాస్పద 12 గ్రామాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాలు ఈ గ్రామాలు మావే అంటుండగా, ఇక్కడి ప్రజలందకిరి ఓటర్లు కార్డులు ఉన్న విషయం విదితమే. -
నింగికెగసిన ఆడబిడ్డలకు సలాం
[ 20-04-2024]
జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది. -
ఎన్నికల హడావుడి.. ఇసుక దోపిడీ
[ 20-04-2024]
రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది. -
ఆడిట్లో అవకతవకలు గుర్తిస్తున్నా ఫలితం శూన్యం
[ 20-04-2024]
పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. -
నైపుణ్యం పెంచేలా.. సేవలు మెరుగయ్యేలా
[ 20-04-2024]
ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. -
అసౌకర్యాలు గుర్తించి.. దూరాభారం తగ్గించి
[ 20-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,850 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
గల్ఫ్ బాధితులకు భరోసా కలిగేనా?
[ 20-04-2024]
ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబునిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బెహరాన్, ఒమన్లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. -
విలువలతో కూడిన విద్య అందించాలి
[ 20-04-2024]
ఒకప్పుడు చదువులకు దూరంగా ఉన్న మారుమూల అల్లంపల్లి గిరిజన విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని త్రిదండి రామానుజ చినజీయరు స్వామి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?