కబడ్డీలో ఒకే ఒక్కడు..!
ఆయనకు కబడ్డీ ప్రాణం.. గురువు నడిపెల్లి సుధాకర్రావు(ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా యువజన క్రీడల అధికారి) వద్ద శిక్షణ పొందారు. అనతి కాలంలోనే మంచి ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నారు.
ఆలిండియా రెఫరీకి అర్హత
న్యూస్టుడే, ఆదిలాబాద్ క్రీడావిభాగం
ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో కబడ్డీలో శిక్షణ ఇస్తున్న విఠల్రెడ్డి
ఆయనకు కబడ్డీ ప్రాణం.. గురువు నడిపెల్లి సుధాకర్రావు(ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా యువజన క్రీడల అధికారి) వద్ద శిక్షణ పొందారు. అనతి కాలంలోనే మంచి ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటారు. తాజాగా ఆలిండియా కబడ్డీ రెఫరీకి అర్హత సాధించారు.. ఆయనే నిరటి విఠల్రెడ్డి. ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన వర్ధమాన క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆటలో మెరుపులు..
* సౌత్జోన్ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో మూడుసార్లు కాకతీయ విశ్వవిద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఘనతను సొంతం చేసుకున్నారు.
* 1997-2000 వరకు సంగారెడ్డిలోని కబడ్డీ స్పోర్ట్స్ హాస్టల్లో స్పోర్ట్స్ ఆఫీసర్గా పని చేశారు.
* 2010లో రాష్ట్రస్థాయి కబడ్డీ రెఫరీకి ఎంపికయ్యారు.
* 2013లో కబడ్డీలో ఎన్ఐఎస్(జాతీయ క్రీడా సంస్థ) ఏడాది కోర్సును గుంటూరులో పూర్తి చేశారు.
* 2023లో జాతీయస్థాయి కబడ్డీ రెఫరీకి అర్హత. రాబోయే కాలంలో ప్రో-కబడ్డీ పోటీలకు రెఫరీగా వ్యవహరించే అవకాశం.
అర్హత సాధించారిలా..
అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు గత డిసెంబరు 11న దిల్లీలో రెఫరీ అర్హత పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 382 మంది పరీక్ష రాస్తే.. 80 మంది ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ నుంచి ఒకే ఒక్కరుగా నిరటి విఠల్రెడ్డి అర్హత సాధించడం గమనార్హం. ఈయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మరికొందరు క్రీడా కోటా కింద ఆర్మీలో, వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. క్రీడా విభాగంలో ప్రభుత్వ కొలువు సాధించడమే తన లక్ష్యమంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలిన బరి.. గెలుపుపై గురి
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. -
ఇక విద్యుత్తు కోతలకు చెక్
[ 29-03-2024]
ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం... -
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?: ఏలేటి
[ 29-03-2024]
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా చెరబట్టారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మరోసారి ఆరోపించారు. -
పెన్గంగా.. ఇసుకదందా
[ 29-03-2024]
మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. -
గడువు ముందర సందిగ్ధం!
[ 29-03-2024]
ఏటా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ప్రభుత్వ పనులకు బడ్జెట్ కేటాయిస్తారు. దానిని ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తే.. వారు ఈ-కుబేర్లో నమోదు చేస్తారు. -
ఆన్లైన్ జూదంలో నష్టపోయి.. రైతుల డబ్బు కాజేత
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) మేనేజర్ విజయ్ జాదవ్ ఆన్లైన్ జూదానికి అలవాటు పడి అందులో నష్టపోయి రైతులకు చెందిన డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది. -
బహుజన, తెలంగాణవాదాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 29-03-2024]
రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. -
సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి ఆదేశించి
[ 29-03-2024]
గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం అదనపు పాలనాధికారి దీపక్ తివారీతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. -
ఉద్యానవనాలపై ఉదాసీనత..
[ 29-03-2024]
మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు. -
రూ.‘కోటి’.. చీకటి పాలు
[ 29-03-2024]
ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ చీకటి పాలవుతోంది. -
‘టీజీ’ కోడ్తో రిజిస్ట్రేషన్లు
[ 29-03-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’కి మార్పు చేస్తూ ఈ నెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. -
పట్టణ వనాలపై పట్టింపు శూన్యం
[ 29-03-2024]
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. -
ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో విషాదం
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో నిజామాబాద్ పట్టణానికి చెందిన యువతి, యువకుడు బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. -
సాగులో సాంకేతికత.. మహిళలకు సాధికారత
[ 29-03-2024]
వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్ నిర్వహణ, -
ఈత కారాదు గుండెకోత
[ 29-03-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. -
ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : సుగుణ
[ 29-03-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. దీంతో పార్టీకి ఆదివాసీలపై ఉన్న ప్రేమ నిరూపితమైందని తెలిపారు.