అమ్ముదామా.. ఆగుదామా!
ఈవానాకాలం సీజన్ జిల్లాలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు తెగుళ్ల బెడదతో సతమతమైన పత్తి రైతులకు వచ్చిన అరకొర దిగుబడులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో.. పెరుగుతుందనే ఆశతో పత్తిని ఇళ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు.
పత్తి రైతుల అయోమయం.. ఇళ్లల్లోనే నిల్వ..
లింగాపూర్, జైనూర్, న్యూస్టుడే
లింగాపూర్లో ఇంట్లో నిల్వ చేసిన పత్తి
ఈవానాకాలం సీజన్ జిల్లాలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు తెగుళ్ల బెడదతో సతమతమైన పత్తి రైతులకు వచ్చిన అరకొర దిగుబడులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో.. పెరుగుతుందనే ఆశతో పత్తిని ఇళ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. అయితే గత రెండు వారాలుగా మార్కెట్లో పత్తి ధర రూ.8 వేల వద్ద స్థిరంగా కొనసాగుతుండటంతో.. అయోమయ స్థితిలో ఉన్నారు.
దిగుబడులూ.. ధరా అంతమాత్రమే!
జిల్లావ్యాప్తంగా రైతులు పత్తిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ ఏడాది దాదాపు 3.55 లక్షల ఎకరాల్లో ఈ పంటను వేశారు. అయితే ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలో విత్తనాలు వేసినప్పటినుంచి కురిసిన భారీ వర్షాలతో చేన్లన్ని దెబ్బతిన్నాయి. పూత, కాయ దశలో రాలిపోయాయి. ప్రతికూల వాతావరణంతో పంటపై తెగుళ్ల దాడి ఎక్కువైంది. నివారించే ప్రయత్నంలో రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న రైతులు పండించిన కాస్త పత్తి పంటకు మంచి గిట్టుబాటు ధరలు ఆదుకుంటుందనుకుంటుదని ఆశించారు. అయితే భారత పత్తి సంస్థ (సీసీఐ) ఇప్పటి వరకు రూ.6380 వరకు మించి ధరలు లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రైవేటులోనూ అంతంత మాత్రంగానే ఉంది. దిగుబడి సైతం అంతంత మాత్రమే రావడంతోపాటు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతు ఇంట్లో సుమారు 15 క్వింటాళ్ల నుంచి 40 క్వింటాళ్లకు పైగా నిల్వ ఉన్నట్లు సమాచారం.
ధరలు పెరుగుతాయనే ఆశతో..
ఆత్రం పరమేశ్వర్, రైతు, జామ్ని
ఎనిమిదెకరాలు రూ.15 వేలతో కౌలుకు తీసుకుని ఆరు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. ఈ సీజన్లో వర్షాలకు పంట నాశనమైంది. మూడు క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. ఆరెకరాల్లోని పత్తిని ఏరితే 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ప్రస్తుత ధరలకు పత్తి అమ్ముకుంటే నష్టపోయే పరిస్థితి ఉంది. పత్తి ధరలు పెరుగుతాయనే ఆశతో 15 క్వింటాళ్ల ఇంట్లోనే నిల్వ చేసుకున్నా.
పెట్టుబడులు కూడా రావు
జాదవ్ కైలాష్, రైతు, లింగాపూర్
నాకున్న మూడెకరాలతోపాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. కౌలు చెల్లింపులు, పెట్టుబడులు కలిపి రూ.2.80 లక్షలు ఖర్చయింది. 30 క్వింటాళ్లు పత్తి దిగుబడి వచ్చింది. సీసీఐ మాత్రం రూ.7 వేలు మించి ధర పెట్టడం లేదు. బయట క్వింటాలుకు రూ.8 వేలు పలుకుతోంది. ఆ ధరలు చూస్తే పెట్టుబడులు రాని పరిస్థితి ఉంది. పత్తికి ఇంకా ధర పెరుగుతుందనే ఆశతో ఇళ్లల్లో పత్తి నిల్వ చేశాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదిలాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి నగేష్పై కోడ్ ఉల్లంఘన కేసు
[ 19-04-2024]
అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, ఆ లోక్సభ భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్పై ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీసులు శుక్రవారం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. -
చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ
[ 19-04-2024]
మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులోని మూడు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
శనివారం హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం
[ 19-04-2024]
ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళటానికి ఎంపికైన వారికి ఒకరోజు శిక్షణ శిబిరాన్ని శనివారం స్థానిక సెంట్రల్ గార్డెన్లో నిర్వహించనున్నట్లు హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షాహిద్, మహమ్మద్ తవక్కల్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్