రూ. 2000 కోట్లు అవసరం
ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రకటించిన ప్రాజెక్టులతోపాటు నిర్మాణంలో ఉన్న, అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసి సాగు నీటిని అందించేందుకు వీలుగా అవసరమయ్యే నిధులను జలవనరుల శాఖ అంచనా వేసింది.
సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆశలు..
ఆదిలాబాద్ వ్యవసాయం, న్యూస్టుడే
ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రకటించిన ప్రాజెక్టులతోపాటు నిర్మాణంలో ఉన్న, అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసి సాగు నీటిని అందించేందుకు వీలుగా అవసరమయ్యే నిధులను జలవనరుల శాఖ అంచనా వేసింది. ప్రభుత్వం ప్రకటించనున్న బడ్జెట్లో నిధుల అవసరంపై ప్రతిపాదనలు పంపించింది. జిల్లాలో 15 ప్రాజెక్టులు ఉండగా మరికొన్ని ప్రతిపాదనలో ఉన్నాయి. గతేడాది బడ్జెట్లో రూ.473 కోట్లు మంజూరు చేయగా.. వాటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. అయితే నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా అంచనా వ్యయం పెరుగుతోంది. ఈ బడ్జెట్లోనైనా.. కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారని రైతులు ఆశతో ఉన్నారు.
ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నా.. సకాలంలో పనులు చేయకపోవడం, అవసరం మేరకు విడుదల కాకపోవడంతో అసంపూర్తిగానే ఉంటున్నాయి. రెండేళ్లుగా కుప్టి, చెన్నూర్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపిస్తున్నా.. నిధులు కేటాయించలేదు. ఈ ఏడాది అధిక వర్షాలతో కడెం, సదర్మాట్ ప్రాజెక్టులు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు నిధులు అవసరం. ఈ ఏడాది ఎస్సారెస్పీ పరిధిలోని సరస్వతి కాలువ, సదర్మాట్, తదితర పనుల పూర్తికి రూ.476 కోట్లు అవసరం.
ప్రతిపాదనలో కుప్టి ప్రాజెక్టు
* ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నిర్మాణంలో ఉన్న లోయర్ పెన్గంగ ప్రాజెక్టును (చనాఖా-కొరాట) పూర్తి చేయాలంటే రూ.289.62 కోట్లు అవసరం. పనుల జాప్యంతో అంచనా వ్యయం పెరిగింది. ఇప్పటికే రూ.వంద కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కాలువల నిర్మాణం, వాటికి సంబంధించి 1200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. జైనథ్, బేల మండలాల్లో డి-14 నుంచి డి-19 వరకు నిర్మాణాలు జరగాల్సి ఉంది. అరకొర కేటాయింపులతో మరో ఏడాది వరకు పనులు కొనసాగేలా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల పరిధిలో కొన్ని కాలువలు, ఇతర మరమ్మతులకు రూ.12 కోట్లకు పైగా అవసరమని అంచనా వేశారు.
* ఆసిఫాబాద్ మండలం అడ సమీపంలో కుమురంభీం ప్రాజెక్టుకు గతేడాది రూ.26 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు పరిధిలో 46 డిస్ట్రిబ్యూటర్లు నిర్మించాల్సి ఉండగా.. 23 పూర్తి చేశారు. భూసేకరణ అడ్డంకిగా ఉంది. ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. కాగజ్నగర్ మండలంలోని పెద్దవాగుపై నిర్మించిన జగన్నాథ్పూర్ ప్రాజెక్టుకు గతేడాది బడ్జెట్లో రూ.6 కోట్లు కేటాయించారు. పనులు చేయకపోవడంతో నిధులు విడుదల చేయలేదు. మరో 101 ఎకరాలు భూసేకరణ చేయాలి. డి-15తోపాటు పిల్ల కాలువలు, వంతెనలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది రూ.12 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు.
* మంచిర్యాల జిల్లా పరిధిలో ప్రాణహిత, చెన్నూర్ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు అవసరం. నీల్వాయి, ర్యాలీవాగు, గొల్లవాగు తదితర ప్రాజెక్టుల్లో చిన్నచిన్న పనులు, కాలువలకు లైనింగ్ చేయాల్సి ఉంది. డ్రిప్ తదితర సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పథకం కింద ఆయకట్టు అభివృద్ధికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
* నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు తదితర ప్రాజెక్టుల్లో కాలువల మరమ్మతులు చేయాల్సి ఉంది. కడెం ప్రాజెక్టు కింద కాలువలు శిథిలం కావడంతో సరిగా నీరందడం లేదు. వాటి మరమ్మతులతోపాటు ప్రధాన డ్యాం పనులకు నిధుల అవసరంపై ప్రతిపాదనలు పంపించారు.
నిర్మాణంలో ఉన్న చనాఖా కోరాట..
కొత్త ప్రాజెక్టులపై ఆశలు
ఉమ్మడి జిల్లాలో కుప్టి, చెన్నూర్ ఎత్తిపోతల పథకాలు మంజూరు కావడంతో నిధులు కేటాయిస్తారని రైతులు ఆశిస్తున్నారు. కుప్టి సమీపంలో ప్రాజెక్టు నిర్మిస్తే సాగు, తాగునీటితో పాటు విద్యుత్తు అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ ప్రాజెక్టును నిర్మించి, ఎత్తిపోతల ద్వారా ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ మండలాల్లో 68వేల ఎకరాలకు సాగు నీరందించే వీలుంది. కడెం జలాశయానికి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు నీరు సరఫరా చేయడానికి వీలుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,020 కోట్లు, భూ సేకరణకు రూ.302.90 కోట్లు అవసరం. సదర్మాట్ ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినడంతో నిర్మాణం పనులకు రూ.231.25 కోట్లు అవసరమని ప్రతిపాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముఖ్య నేతల కోసం అభ్యర్ధుల యత్నం
[ 20-04-2024]
ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాలు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల తేదీలు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వు కాగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానం. -
బాలభవన్ కల సాకారమయ్యేనా?
[ 20-04-2024]
కళలకు నిలయంగా ఆదిలాబాద్లోని బాలకేంద్రం నిలుస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన బాలలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. -
నిర్మల్ నేతలదే ఆధిపత్యం
[ 20-04-2024]
ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్సభకు సంబంధించినవి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. -
పరిమళించిన పల్లె.. పరిశ్రమల ముల్లె
[ 20-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానంగా 62 ఏళ్ల కింద ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు 15 మంది ఎంపీ అభ్యర్థులుగా దిల్లీకి వెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలతో సమ్మిళితమై ఉంటుంది. -
రెండోరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరే!
[ 20-04-2024]
లోక్సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు. -
ఆత్రం సుగుణకు ఆభరణాలు లేవు..
[ 20-04-2024]
తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్ కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో పెండింగ్లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ వెల్లడించారు. -
సరిహద్దు గ్రామాల్లో.. ముగిసిన పోలింగ్
[ 20-04-2024]
తెలంగాణ - మహారాష్ట్ర వివాదాస్పద 12 గ్రామాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాలు ఈ గ్రామాలు మావే అంటుండగా, ఇక్కడి ప్రజలందకిరి ఓటర్లు కార్డులు ఉన్న విషయం విదితమే. -
నింగికెగసిన ఆడబిడ్డలకు సలాం
[ 20-04-2024]
జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది. -
ఎన్నికల హడావుడి.. ఇసుక దోపిడీ
[ 20-04-2024]
రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది. -
రూ.కోట్లలో అక్రమాలు.. కానరాని చర్యలు
[ 20-04-2024]
పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. -
నైపుణ్యం పెంచేలా.. సేవలు మెరుగయ్యేలా
[ 20-04-2024]
ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. -
అసౌకర్యాలు గుర్తించి.. దూరాభారం తగ్గించి
[ 20-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,850 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
గల్ఫ్ బాధితులకు భరోసా కలిగేనా?
[ 20-04-2024]
ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబునిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బెహరాన్, ఒమన్లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. -
విలువలతో కూడిన విద్య అందించాలి
[ 20-04-2024]
ఒకప్పుడు చదువులకు దూరంగా ఉన్న మారుమూల అల్లంపల్లి గిరిజన విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని త్రిదండి రామానుజ చినజీయరు స్వామి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి