అక్రమాల జోరు.. పేర్లు తారుమారు
జిల్లా ఉన్నతాధికారుల ప్రేక్షక పాత్ర కిందిస్థాయి అధికార, సిబ్బందికి కలిసొస్తోంది. పట్టా భూములతోపాటు ప్రభుత్వ, అసైన్డ్, లావుణి భూముల క్రయవిక్రయాల్లో కొంతమంది అధికారులు కాసులకు కక్కుర్తిపడి దళారులతో చేతులు కలపడం అర్హులైన లబ్ధిదారులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.
భూముల రిజిస్ట్రేషన్లలో రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం
ఈటీవీ - ఆదిలాబాద్
జిల్లా ఉన్నతాధికారుల ప్రేక్షక పాత్ర కిందిస్థాయి అధికార, సిబ్బందికి కలిసొస్తోంది. పట్టా భూములతోపాటు ప్రభుత్వ, అసైన్డ్, లావుణి భూముల క్రయవిక్రయాల్లో కొంతమంది అధికారులు కాసులకు కక్కుర్తిపడి దళారులతో చేతులు కలపడం అర్హులైన లబ్ధిదారులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఆదిలాబాద్, మావల, బట్టిసావర్గాం, రాంనగర్, బెల్లూరి, భీంసరి శివారుతోపాటు తలమడుగు, బజార్హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో బినామీ పత్రాలతో భూములను రిజిస్ట్రేషన్ల చేసే దందా హద్దు మీరుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల లెక్కతీయడంలో ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదు. ఆదిలాబాద్ మున్సిపాల్టీ పరిధిలోనే రూ.కోట్ల విలువ చేసే 52 లీజు స్థలాలుంటే, మావల, బట్టిసావర్గాం, కేఆర్కేకాలనీని ఆనుకొని వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. ఇప్పుడు వాటి లెక్కలపై సమగ్రత కొరవడింది. స్థిరాస్తి వ్యాపారుల భూకబ్జాల దందా శాంతిభద్రతలకు సైతం విఘాతం కలిగిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు చొరవచూపితే తప్ప అక్రమాలు ఆగేలా లేవు.
ప్రైవేటు సైన్యం
ఆదిలాబాద్లో కొత్త తరహా సంస్కృతి పురుడు పోసుకుంటోంది. సిండికేట్గా మారిన కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు తమకు అడ్డొచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం కోసం ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఓ స్థిరాస్తి వ్యాపారిని హత్యచేయడం, ప్రస్తుతం మావల పరిధిలో ఉండే ఓ కౌన్సిలర్ రౌడీ ముఠాతో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే చేయిచేసుకోవడం అప్పట్లో సంచలనాలకు దారితీశాయి. అప్రమత్తమైన అప్పటి ఎస్పీ ఆ కౌన్సిలర్ సహా స్థిరాస్తి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో తిరిగి ప్రశాంతత నెలకొంది. తాజాగా మళ్లీ అలాంటి దందానే తెరపైకి రావడం కలకలం సృష్టిస్తోంది. స్థిరాస్తి వ్యాపారులకు రాజకీయ నాయకుల తోడ్పాటు ఉండటంతో దాడుల ఘటనలు పోలీసు రికార్డులకు ఎక్కడం లేదు. మావల, బట్టిసావర్గాం, నేరడిగొండ, ఇచ్చోడ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ దందా జోరుగా సాగుతోంది. ఇటీవల 346 ప్రభుత్వ సర్వే నెంబరులో జరిగిన దాడి ఇలాంటి కోవకు చెందినదే.
సమ్మతి లేకుండానే సర్దేశారు
ఇది బజార్హత్నూర్ రెవెన్యూ అధికారులు జారీ చేసిన కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం. మండలంలోని టెంబికి చెందిన సంత్యా పేరిట అదే శివారులో 25 ఎకరాల లావుణి భూమి ఉంది. సంత్యా సహా ఆయన ముగ్గురు సంతానం ఏళ్ల కిందటే చనిపోయారు. ఆ ముగ్గురు కొడుకులకు మొత్తం 16 మంది సంతానం. వారందరికీ భూమిపై హక్కు ఉంటుంది. కానీ అందులో ఒక వారసుడి పేరుపైనే 6.17 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసేశారు. భూమి ఒకరి పేరిట మార్పిడి చేయాలంటే మిగిలిన అందరి సమ్మతి తప్పనిసరి. రెవెన్యూ అధికారులు అలా చేయలేదు. ఒక్కరే బతికి ఉన్నట్లు వెల్లడించేలా గతేడాది జులై 29న కుటుంబ సభ్యుల ధ్రువపత్రం జారీ చేశారు. అంటే ఇప్పటికీ బతికున్న 16 మందిని అధికారిక రాతల్లో చంపేశారన్నమాట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు