ఐటీడీఏ కొత్త పీవో ఎవరో?
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ల బదిలీలలో ఉట్నూరు ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డికి కేవలం ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వం స్థానచలనం కలిగించింది.
8 నెలల్లోనే వరుణ్రెడ్డికి స్థానచలనం..
స్వల్ప వ్యవధిలోనే తనదైన ముద్ర
గిరిజన దివ్యాంగురాలి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న పీవో వరుణ్రెడ్డి
ఉట్నూరు, న్యూస్టుడే : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ల బదిలీలలో ఉట్నూరు ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డికి కేవలం ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. నిర్మల్ జిల్లా పాలనాధికారిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. కొత్తగా ఎవరికీ పోస్టింగ్ ఇస్తారో ఇంకా తెలియలేదు. ఆయన ఇక్కడ పీవోగా పని చేసింది తక్కువ కాలమైనా.. పాలనలో తనదైన ముద్ర వేశారు. తన కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది మధ్య సమన్వయం చేసుకుంటూ.. సమష్టిగా గిరిజనాభివృద్ధికి కృషి చేశారు.
గిరిజన విద్యకు అధిక ప్రాధాన్యం..
గతేడాది జూన్-12న ఉట్నూరు ఐటీడీఏలో పీవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన ఎక్కువగా క్షేత్రపర్యటనకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆదివాసీ గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో అర్జీదారులకు ఊరట కలిగించేలా వారి సమస్యలను ఆలకించేవారు. గిరిజన విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అక్షరజ్యోతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేశారు. కనీస స్థాయిని పెంచేందుకు చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు మార్పులు చేయడానికి కృషి చేశారు. విద్యార్థుల్లో సృజనను పెంపొందించేందుకు డివిజన్ స్థాయి నుంచి మొదలు కొని జిల్లా స్థాయి వరకు విద్యా, విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని గిరిజన ఉద్యానవనాల మహర్దశ కోసం గట్టిగా ప్రయత్నం చేశారు. గ్రామాలలో నెలకొన్న మౌలిక సమస్యల పరిష్కారానికి ఆదివాసీ గిరిజనులతో మమేకమై తనవంతు కృషి చేశారు. గిరిజన విద్యాభివృద్ధికి సమష్టిగా కృషి చేయడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి ‘న్యూస్టుడే’తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
కొత్త పీవోను నియమించే వరకు వరుణ్రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముఖ్య నేతల కోసం అభ్యర్ధుల యత్నం
[ 20-04-2024]
ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాలు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల తేదీలు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వు కాగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానం. -
బాలభవన్ కల సాకారమయ్యేనా?
[ 20-04-2024]
కళలకు నిలయంగా ఆదిలాబాద్లోని బాలకేంద్రం నిలుస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన బాలలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. -
నిర్మల్ నేతలదే ఆధిపత్యం
[ 20-04-2024]
ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్సభకు సంబంధించినవి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. -
పరిమళించిన పల్లె.. పరిశ్రమల ముల్లె
[ 20-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానంగా 62 ఏళ్ల కింద ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు 15 మంది ఎంపీ అభ్యర్థులుగా దిల్లీకి వెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలతో సమ్మిళితమై ఉంటుంది. -
రెండోరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరే!
[ 20-04-2024]
లోక్సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు. -
ఆత్రం సుగుణకు ఆభరణాలు లేవు..
[ 20-04-2024]
తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్ కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో పెండింగ్లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ వెల్లడించారు. -
సరిహద్దు గ్రామాల్లో.. ముగిసిన పోలింగ్
[ 20-04-2024]
తెలంగాణ - మహారాష్ట్ర వివాదాస్పద 12 గ్రామాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాలు ఈ గ్రామాలు మావే అంటుండగా, ఇక్కడి ప్రజలందకిరి ఓటర్లు కార్డులు ఉన్న విషయం విదితమే. -
నింగికెగసిన ఆడబిడ్డలకు సలాం
[ 20-04-2024]
జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది. -
ఎన్నికల హడావుడి.. ఇసుక దోపిడీ
[ 20-04-2024]
రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది. -
రూ.కోట్లలో అక్రమాలు.. కానరాని చర్యలు
[ 20-04-2024]
పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. -
నైపుణ్యం పెంచేలా.. సేవలు మెరుగయ్యేలా
[ 20-04-2024]
ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. -
అసౌకర్యాలు గుర్తించి.. దూరాభారం తగ్గించి
[ 20-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,850 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
గల్ఫ్ బాధితులకు భరోసా కలిగేనా?
[ 20-04-2024]
ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబునిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బెహరాన్, ఒమన్లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. -
విలువలతో కూడిన విద్య అందించాలి
[ 20-04-2024]
ఒకప్పుడు చదువులకు దూరంగా ఉన్న మారుమూల అల్లంపల్లి గిరిజన విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని త్రిదండి రామానుజ చినజీయరు స్వామి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి