పడకేసిన పప్పు యంత్రాలు..!
మహిళా సంఘాలను వ్యాపార పరంగా ప్రోత్సహించి ఆర్థికంగా అభివృద్ధి బాట పట్టించాలనే లక్ష్యంతో గతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో రెండు మండలాల్లో మినీ పప్పు మిల్లులు ఏర్పాటు చేశారు.
పాతవి పక్కనపెట్టి కొత్తచోట ప్రారంభం
ఆసిఫాబాద్, వాంకిడి, న్యూస్టుడే
వాంకిడిలోని దాల్ మిల్లులో నిరుపయోగంగా యంత్రాలు
మహిళా సంఘాలను వ్యాపార పరంగా ప్రోత్సహించి ఆర్థికంగా అభివృద్ధి బాట పట్టించాలనే లక్ష్యంతో గతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో రెండు మండలాల్లో మినీ పప్పు మిల్లులు ఏర్పాటు చేశారు. అధికారుల చొరవతో ప్రారంభంలో రెండేళ్లపాటు సాఫీగా సాగిన వ్యాపారం.. పర్యవేక్షణ కొరవడి తర్వాత పడకేసింది. దీంతో రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు తుప్పుపట్టి పనికిరాకుండా మారాయి. పాతవాటి నిర్వహణను మరిచిన అధికారులు మళ్లీ కొత్తగా జైనూర్లో యంత్రం కొనుగోలుచేసి మిల్లు ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో పాతవాటి నిర్వహణపైనా అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో పత్తి, వరి తరువాత ఎక్కువగా సాగయ్యేది కంది పంట. గ్రామీణ ప్రాంత గిరిజన రైతులకు ప్రయోజనం కల్పించడంతో పాటు కందిపప్పు ఉత్పత్తి చేసేలా 2017లో వనబంధు కల్యాణయోజన కింద ఐటీడీఏ ఆధ్వర్యంలో వాంకిడి, తిర్యాణి మండలాల్లో ఒక్కో యంత్రానికి రూ.7.80 లక్షల చొప్పున వెచ్చించి రెండుచోట్ల మినీ దాల్ మిల్లులను ఏర్పాటు చేశారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సభ్యులు కందులు కొనుగోలు చేసి పప్పు తయారు చేసేవారు. అప్పటి ఐటీడీఏ పీఓ కర్ణన్ ప్రత్యేక చొరవతో గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని గురుకులాలు, వసతి గృహాలకు ఈ పప్పును సరఫరా చేసేవారు. విపణిలోనూ విక్రయించేవారు.
జిల్లా కేంద్రంలో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన కందులు
ఉడకడం లేదని నిర్లక్ష్యం చేశారు..
వాంకిడిలో 2017లో కందులు కొని పప్పుగా మలిచి విక్రయించడంతో ఖర్చులు పోనూ రూ.రెండు లక్షల ఆదాయం వచ్చింది. 2018లో 118 క్వింటాళ్ల కందులు కొని పప్పుగా మార్చి గురుకులాలకు సరఫరా చేసినా.. బకాయిలు రాక నష్టాలతో మూతపడింది. తిర్యాణిలోనూ 2018, 2019లలో కందులు కొనుగోలు చేసి పప్పుగా మార్చి విక్రయించడంతో రూ.2.50 లక్షల వరకు ఆదాయం వచ్చింది. కొన్ని గురుకులాల వార్డెన్లు ఈ పప్పు ఉడకడంలేదంటూ తీసుకోవడం మానేశారు. బయట గుత్తేదారు నుంచి పప్పు సరఫరా అయితే తృణమో ఫలమో వారికి దక్కేది. కానీ మహిళ సంఘాల నుంచి సరఫరా అయితే తమకేమి లాభం? అన్న ఉద్దేశంతో పప్పు తీసుకోవడం మానేశారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి.
విపణిలో జోరుగా విక్రయాలు
జిల్లాలో వానాకాలంలో 34,200 ఎకరాల్లో కంది సాగైంది. సుమారు 1.70- 1.80 లక్షల క్వింటాళ్ల కంది దిగుబడి రావొచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. క్వింటా ప్రభుత్వ మద్దతు ధర రూ.6600 ఉంది. విపణిలో నాణ్యతను బట్టి క్వింటా రూ.6600 నుంచి 6800 వరకు కొనుగోలు చేస్తున్నారు. జైనూర్లో ఆరు నెలల క్రితం రూ.10 లక్షల ఐడీడీఏ నిధులతో మినీ దాల్ మిల్లు యంత్రాలు కొని బిగించారు. జైనూర్, వాంకిడి, కెరమెరి, సిర్పూర్(యు) మండలాల్లో ఆయా మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఈ సారి సుమారు 8-10 క్వింటాళ్ల కందులు కొని పప్పుగా మార్చి విక్రయించాలన్న ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు.
పునరుద్ధరణపై దృష్టి పెడితే మేలు..
వాంకిడి, తిర్యాణిలో ఏర్పాటు చేసిన పప్పు మిల్లులు రెండేళ్లు నడిచి తరువాత మూలన చేరాయి. యంత్రాలు తుప్పు పట్టాయి. ప్రస్తుతం కంది సీజన్ మొదలైంది. జైనూర్లో కొత్త దాల్ మిల్లు ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత మిల్లులను సైతం పునరుద్ధరిస్తే మళ్లీ ఉత్పత్తి మొదలై సంఘాలు వ్యాపారపరంగా వృద్ధి సాధించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా