మూడేళ్లు దాటినా.. ముడిపడని ప్రగతి
మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు గడుస్తున్నాయి. ఈ సందర్భంలో ఆయా పురాల్లో సౌకర్యాలు,పనులను బేరీజు వేసుకుంటే అనుకున్నంత ప్రగతి చేకూరలేదని స్పష్టమవుతోంది.
బల్దియాల్లో పనులు వేగవంతం చేస్తేనే ఫలితం
లక్షెట్టిపేట, న్యూస్టుడే
ఇది లక్షెట్టిపేటలో పోలీస్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన పిల్లల పార్కు.
రూ. 5 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పార్కు పిల్లలకు ఆహ్లాదాన్ని పంచుతోంది.
మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు గడుస్తున్నాయి. ఈ సందర్భంలో ఆయా పురాల్లో సౌకర్యాలు,పనులను బేరీజు వేసుకుంటే అనుకున్నంత ప్రగతి చేకూరలేదని స్పష్టమవుతోంది. కొన్నిచోట్ల ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా చేపడుతున్న పనులతో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. స్థలాభావం, ఏజెన్సీలాంటి స్థానికంగా వివాదాలు, కోర్టు కేసుల లాంటి సమస్యలు ఉన్న మున్సిపాలిటీల్లో లక్ష్యానికి అనుగుణంగా పనులు జరగడం లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు మరింత చొరవ తీసుకుని ప్రజలతో సమన్వయంగా సాగి మరింత అభివృద్ధికి బాటలు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ‘న్యూస్టుడే’ కథనం.
స్థల ఎంపిక దశలోనే..
క్యాతన్పల్లిలో వర్షం కురిసిందంటే రహదారుల దుస్థితి ఇది.
క్యాతన్పల్లిలో సమీకృత మార్కెట్ పనులు కొనసాగుతున్నాయి. డంపింగ్ యార్డు కోసం ఇప్పటి వరకు స్థల ఎంపిక జరగలేదు. ప్రస్తుతం చెత్తను గతంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యార్డులోనే వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. వర్షాకాలంలో నీరు నిలుస్తోంది.
కొత్త పురాల్లో ఆదాయ వనరులే అసలు సమస్య
జిల్లాలోని పాత మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు, అద్దెలు, ఇతర వనరుల ద్వారా నిధులకు అంతగా సమస్య లేకపోయినా... కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలకు వస్తున్న నిధులు ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదు. సాధారణ నిధి, పట్టణ ప్రగతి, ఆర్థిక సంఘం నిధులు సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపు, ఇతర నిర్వహణ ఖర్చులకు సరిపోతున్నాయి. సొంత నిధులతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఏమాత్రం లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు.
ముందుకు సాగని పనులు
జిల్లా ప్రధాన పట్టణమైన మంచిర్యాలలో అభివృద్ధి పనుల కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారాయి. బైపాస్ రహదారి నిర్మాణానికి రెండు విడతల్లో రూ. 14 కోట్లతో నిర్మించతలపెట్టినా ఇంకా మొదటి దశ దాటలేదు. ఇక రూ. 4 కోట్లు వెచ్చించి పార్కుల నిర్మాణం చేపట్టినా అవి ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదు. ఓపెన్ జిమ్ల పరికరాలు చోరీకి గురవుతున్నాయి.
డంపింగ్ యార్డు ప్రారంభమెప్పుడో..
బెల్లంపల్లి రడగం బాల బస్తీలో డంపింగ్ యార్డు నిర్మాణానికి 5 ఎకరాలు కేటాయించినా పనులు ప్రారంభం కాలేదు. రూ. కోటి వెచ్చించి నిర్మించినా రెండు పార్కులు అందుబాటులోకి వచ్చాయి. క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితమయ్యాయి. శ్మశాన వాటికల్లో ఒకటి అన్ని హంగులతో అందుబాటులోకి రాగా మరో రెండింటిలో పనులు సాగుతున్నాయి.
మందమర్రిలో..
ఏజెన్సీ చట్టం వివాదం కారణంగా మందమర్రిలో ఎన్నికలకు అవకాశం లేకపోవడం అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఇక్కడ సమీకృత మార్కెట్ నిర్మాణం పనులు, శ్మశాన వాటిక పనులు కొనసాగుతున్నాయి. సింగరేణి పార్కు అందుబాటులో ఉండగా మరో పార్కు నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
కొనసాగుతున్న దారుల విస్తరణ
చెన్నూరు పట్టణంలో నిర్మించిన డివైడర్లు, వాటికి ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్
పట్టణంలో రహదారుల విస్తరణ, సుందరీకణ, సెంట్రల్ లైటింగ్, పార్కుల నిర్మాణం, సమీకృత మార్కెట్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఇక శివారు కాలనీల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీల సమస్య వేధిస్తోంది. వైకుంఠధామం, డంపింగ్ యార్డు పనులు సాగడం లేదు.
అంతర్గత రహదారులు లేక ఇబ్బందులు
లక్షెట్టిపేటలోని గోదావరి రోడ్డులో నిరుపయోగంగా క్రీడా ప్రాంగణం
లక్షెట్టిపేటలో పురపాలికగా ఏర్పాటుకు ముందే దాతల సహకారంతో అన్ని హంగులతో శ్మశాన వాటిక ఏర్పాటు జరిగింది. ఇక ప్రకృతి వనం ఏర్పాటు కూడా బాగానే ఉంది. సమీకృత మార్కెటÆ్, డంపింగ్ యార్డు నిర్మాణం జరుగుతున్నాయి. వాహనాలు సరిపోయినన్ని ఉన్నా సిబ్బంది కొరత కారణంగా కాలనీల్లో చెత్త సేకరణ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. విలీన గ్రామాల్లో అంతర్గత రహదారులు, మురుగునీటి కాల్వలు, విద్యుత్ దీపాల ఏర్పాటు జరగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గణపతి గుడిలో హుండీ చోరీ
[ 25-04-2024]
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్రనగర్ ఓంసాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున చోరీ వెలుగు చూసింది. -
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం