గిరిజన కోటకు.. నిర్మలమ్మ బాసట..
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గిరిజన జిల్లా అవసరాలకు పెద్దపీట వేశారు.
బడ్జెట్లో వ్యవసాయ, ఆరోగ్య, విద్యా రంగాలకు పెద్దపీట
ఈనాడు డిజిటల్, ఆసిఫాబాద్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గిరిజన జిల్లా అవసరాలకు పెద్దపీట వేశారు. ఆదాయపన్ను మినహాయింపులు, సొంతింటి కల నెరవేరేలా చర్యలు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం, యువత ఉపాధికి చేసిన కేటాయింపులు ఆయా వర్గాలకు ఊరటనిచ్చాయి. సికిల్సెల్, తలసీమియా వ్యాధులను 2047 వరకు దేశం నుంచి తరిమివేసేలా ప్రత్యేక మిషన్ను అమలు చేయనున్నట్లు విత్త మంత్రి ప్రకటించారు. దీనివల్ల జిల్లాలోని బాధితులకు లబ్ధి చేకూరనుంది.
వ్యవసాయ రంగానికి జవసత్వాలు అందేలా పంట రుణాల పంపిణీ లక్ష్యాన్ని పెంచుతూ అనుబంధ రంగాలకు మరింతగా నిధులు విడుదల చేస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి పార్లమెంట్ వేదికగా భరోసానిచ్చారు. యువతకు మూడేళ్ల పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకానికి నిధులు పెంచింది. జిల్లా విద్యాశిక్షణా సంస్థలను ఎక్స్లెన్సు కేంద్రాలుగా తీర్చిదిద్దడంతోపాటు మోడల్ ఏకలవ్య పాఠశాలల్లో పెద్దఎత్తున బోధన, బోదనేతర సిబ్బంది పోస్టుల భర్తీ చేస్తుండటంతో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నిరుద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
వ్యవసాయ అనుబంధ రంగాలకు చేయూత
తృణధాన్యాల సాగు పెంచడం, వ్యవసాయానికి ఆధునిక హంగులు అద్దడం, అనుబంధ రంగాలకు కేటాయింపులతో సాగు రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు ఆర్థిక మంత్రి. పంటలు సాగు చేసే సమయం నుంచి మార్కెటింగ్ సౌకర్యం వరకు డిజిటలైజేషన్ చేయనున్నారు. రైతులు అధిక ధర ఉన్నప్పుడు పంటలను విక్రయించుకునేలా నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు. రైతు సొసైటీలను కంప్యూటీకరణ చేయనున్నారు. మత్స్యరంగానికి రూ.6 వేల కోట్లు కేటాయింపుల వల్ల పెండింగ్లో ఉన్న వారికి రాయితీ యూనిట్ల నిధులు విడుదల కానున్నాయి.
జిల్లాలోని రైతులు: 1,19,978
మత్స్యకార సంఘాలు: 47
తృణధాన్యాలు సాగు చేసే రైతులు: 7,468
మూడేళ్లపాటు నీతి ఆయోగ్ కొనసాగింపు..
రైతులకు ఉచితంగా చిరుధాన్యాల విత్తనాల పంపిణీ
దేశంలోనే వెనుకబడిన జిల్లాలను నీతి ఆయోగ్ కింద ఎంపిక చేసింది. ఇందులో కుమురం భీం జిల్లా ఉండగా, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, కార్యచరణ అమలు కోసం ఏటా నీతి ఆయోగ్ నిధులు విడుదల చేయనుంది. 2020లో రూ.4.6 కోట్లు, 2021లో రూ.2.15 కోట్లు నిధులు జిల్లాకు వచ్చాయి. వాటితో అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణ, ఆట వస్తువుల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలల ఏర్పాట్లు, చిరుధాన్యాలతో పోషకాహరం తయారీ, జిల్లా వాసుల్లో రక్తహీనత నివారణ చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో నీతి ఆయోగ్ పథకాన్ని మరో మూడేళ్లు కొనసాగిస్తున్నట్లుగా బడ్జెట్లో నిధులు కేటాయించడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు.
మెరుగుపడనున్న విద్యాబోధన
కాగజ్నగర్ పట్టణంలో ఏకలవ్య పాఠశాల భవనాన్ని రూ.32 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 38 వేల మంది ఉపాధ్యాయులను ఈ పాఠశాలల్లో నియమిస్తామని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ తరుణంలో కాగజ్నగర్ ఏకలవ్య పాఠశాలల్లో సరిపడా సిబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఇందులో 500 మంది విద్యార్థులు ఆరు నుంచి ఇంటర్ వరకు ఇక్కడ చదువుకోవచ్చు.
పొదుపు ద్వారా ఆర్థిక స్వావలంబన
మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పేరుతో కొత్త పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టారు. రెండు సంవత్సరాల కాల వ్యవధికి సంబంధించిన ఈ పథకంలో మహిళలు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. వాటికి 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ జీవనోపాధి మిషన్ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు కేటాయింపులు ప్రకటించారు.
జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు: 86251
పొదుపు సంఘాలు: 7923
మహిళలు: 2,13,861
ఆవాస్ యోజనకు అదనపు కేటాయింపులు
పీఎం ఆవాస్ యోజనలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.79 వేల కోట్లు కేటాయించారు. గత సంవత్సరం కంటే 60 శాతం అదనమని ఆర్థికమంత్రి అన్నారు. తెలంగాణలో సైతం ఇళ్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం చేయాలనే తలంపుతో ఉన్నందున ఈ పథకానికి పీఎం ఆవాస్ యోజనలో అందించే ఆర్థిక సాయం (రూ.2.50 లక్షలు) జతచేసి నిలువ నీడ లేని బడుగులు సొంతింటి కల సాకారం చేసుకునే అవకాశం ఉంది.
జిల్లాలో నిర్మిస్తున్న రెండు పడకగదుల ఇళ్లు: 1285
ఇళ్లు లేని నిరుపేదలు: 45,245
సికిల్సెల్, తలసీమియా నిర్మూలన
జిల్లాలో సికిల్సెల్, తలసీమియా వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. గతేడాది ఆగస్టు నెలలో గిరిజన వసతిగృహాల్లోని 13 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 550 మందికి పైగా సికిల్సెల్ వ్యాధిగ్రస్థులు బయటపడ్డారు. అవగాహన లేకపోవడం, పోష్టికాహారలోపం వల్ల ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ తరుణంలో 2047 వరకు సికిల్సెల్ వ్యాధిని నిర్మూలించేందుకు 40 సంవత్సరాలోపు ప్రతిగిరిజనుడికి వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధికి తగిన చికిత్స అందించేలా బడ్జెట్ కేటాయింపులతోపాటు కార్యాచరణ రూపొందించారు. గిరిజన మిషన్కు రూ.10 వేల కోట్ల కేటాయింపులతో రహదారులు, మౌలిక వసతులు ఈ ప్రాంతాల్లో కల్పించనున్నారు.
జిల్లాలో గిరిజన జనాభా: 1.33 లక్షలు
పీవీటీజీల సంఖ్య: 45 వేలు
గిరిజన గ్రామాలు: 246
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గణపతి గుడిలో హుండీ చోరీ
[ 25-04-2024]
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్రనగర్ ఓంసాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున చోరీ వెలుగు చూసింది. -
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?