బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
బడిలో ఉండాల్సిన బాలలతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర్రావు పేర్కొన్నారు.
వివరాలు వెల్లడిస్తున్న అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర్రావు, చిత్రంలో వివిధ శాఖల అధికారులు
ఆసిఫాబాద్, న్యూస్టుడే: బడిలో ఉండాల్సిన బాలలతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర్రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్ వద్ద ఆపరేషన్ స్మైల్-09పై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక బృందాలు జనవరి 1 నుంచి 31 వరకు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 43 మంది బాల కార్మికులను గుర్తించామన్నారు. ఆసిఫాబాద్ డివిజన్లో 21 మంది, కాగజ్నగర్ డివిజన్లో 22 మంది బాలబాలికలను గుర్తించి వారి తల్లిదండ్రులు, పనులకు కుదుర్చుకున్న యజమానులకు అవగాహన కల్పించామన్నారు. పోలీసులు, విద్యా, రెవెన్యూ, కార్మిక శాఖలు, బాలల రక్షణ విభాగం అధికారుల సంయుక్తంగా తనిఖీలు చేపట్టి బాల కార్మికులను గుర్తించారని వివరించారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల కార్మికులను ఎవరైనా గుర్తిస్తే డయల్-100 లేదా 1098లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ బృంద సభ్యులను అదనపు ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్, టాస్క్ఫోర్స్ సీఐ సుధాకర్, ఆపరేషన్ స్మైల్ ఆసిఫాబాద్ డివిజన్ ఇన్ఛార్జి ఎస్సై రామన్కుమార్, కాగజ్నగర్ డివిజన్ ఇన్ఛార్జి ఎస్సై ఎం.సర్కార్, జిల్లా సంక్షేమ అధికారిణి సావిత్రి, జిల్లా జెండర్ సమన్వయకర్త సత్యనారాయణ, జిల్లా లీగల్ సర్వీస్ సభ్యురాలు సూర్యకళ, షీ టీం ఇన్ఛార్జి ఎస్సై రాజేశ్వర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ-సేవ కేంద్రం సేవలు ప్రారంభం
[ 28-03-2024]
జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్లోని న్యాయస్థానాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ-సేవ కేంద్రం సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. -
గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలి
[ 28-03-2024]
ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 60 ప్రకారం రిమ్స్ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా, ఈపీఎఫ్ వారి ఖాతాలో జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రిమ్స్ గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. -
వైభవంగా రమా సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
[ 28-03-2024]
కొత్త హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ రమా సత్యనారాయణ, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. -
ఎంపీగా సుగుణక్కను గెలిపించుకుంటాం
[ 28-03-2024]
ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించిన సుగుణక్కను పార్టీ కార్యకర్తలు అందరూ ఐక్యంగా కృషిచేసి గెలిపించుకుంటామని పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ అన్నారు. -
శివాజీ విగ్రహ నిర్మాణానికి విరాళం
[ 28-03-2024]
తాంసీ మండల కేంద్రంలో హిందూ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి భాజపా జిల్లా నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి విరాళంగా అందజేశారు. -
విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు
[ 28-03-2024]
జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో గురువారం వరంగల్ మ్యాక్సీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. -
ఆదిలాబాద్లో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు
[ 28-03-2024]
ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం ఉదయం న్యాయస్థానం ఆవరణలో ప్రారంభమయ్యాయి. -
లక్ష్యానికి మించి ‘ఉపాధి’ పనులు
[ 28-03-2024]
మండుటెండల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్్ ప్రణాళికలు మించి పనులు చేశారు. 2023-24లో మొత్తం 36.58 లక్షల పని దినాలు అంచనాతో ప్రణాళికలు రూపొందించారు. -
కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ..
[ 28-03-2024]
అనూహ్య మలుపులు తిరిగిన ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఆత్రం సుగుణకే ఖరారైంది. ఉట్నూరుకు చెందిన టీచర్, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సుగుణ పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) ఆమోదించింది. -
‘పది’ మూల్యాంకనానికి ఏర్పాట్లు
[ 28-03-2024]
పదోతరగతి పరీక్షలు ఈనెల 30తో ముగియనున్నాయి. ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. పరీక్షపత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇతర జిల్లాల నుంచి పత్రాలు చేరాయి. -
గొంతు తడవదు.. గోస తీరదు
[ 28-03-2024]
ఆసిఫాబాద్ మండలం సుద్దాఘాట్ గ్రామానికి చెందిన ప్రజలు నిత్యం కిలోమీటరు దూరంలోని వాగు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. పక్కనే చెలమ తీసి నీటిని పట్టుకెళ్తున్నారు. వాగు అవతల ఉన్న పదుల సంఖ్యల్లో గ్రామాలదీ ఇదే పరిస్థితి. -
నిప్పు.. నిర్లక్ష్యం చేస్తే పెను ముప్పు
[ 28-03-2024]
వేసవి వచ్చిందంటే సహజంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ప్రధానంగా అడవుల్లో కార్చిచ్చులు మొదలవుతాయి. అటవీప్రాంతంలో జరిగితే మనకొచ్చిన ఇబ్బందేంటని నిర్లక్ష్య వైఖరి చాలా మందిలో కనిపిస్తుంటుంది. -
10,489 మందికి ఎన్నికల విధులు
[ 28-03-2024]
లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార యంత్రాంగం పోలింగ్ కోసం అంతా సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే ఉద్యోగ, ఉపాధ్యాయ సమాచార సేకరణ, కంప్యూటర్లో వారి వివరాల నిక్షిప్తం చేసే ప్రక్రియను పూర్తి చేశారు. -
అరచేతిలో అతివకు భద్రత
[ 28-03-2024]
ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా అతివలపై జరుగుతున్న నేరాలు ఆగడం లేదు. ఇప్పటికే మహిళలు, యువతుల, విద్యార్థినుల భద్రతకు అనేక మొబైల్ యాప్లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోలీసుశాఖ తాజాగా టీ-సేఫ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. -
భానుడి భగభగ
[ 28-03-2024]
వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పది ప్రాంతాల్లో ఆరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో జైనథ్లో మధ్యాహ్న సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలుగా నమోదు అయింది. -
పల్లెలు భళా.. పట్టణాల్లో డీలా
[ 28-03-2024]
స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రధానమైన ఆర్థిక వనరులు ఆస్తి పన్నులే. ఆర్థిక సంఘం, ప్రత్యేకాభివృద్ధి నిధులతో పంచాయతీలు, పురపాలక సంఘాల్లో సీసీ రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, మరమ్మతు పనులు చేపడుతున్నారు. -
ముదురుతున్న వివాదం!
[ 28-03-2024]
ప్రభుత్వస్థలం కబ్జాకు గురవుతోంది. అక్రమమార్గంలో పట్టాలు చేసుకుంటున్నారు. విచారణ జరపండి. బాధ్యులపై చర్యలు తీసుకోండి.. అంటూ ఏకంగా శాసనసభ్యుడు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. -
రోడ్లు నిర్మానుష్యం.. అవస్థల్లో జనం
[ 28-03-2024]
ఆదిలాబాద్లో రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో మూడ్రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. -
ప్రభుత్వ బడులకు ఉచిత వెలుగులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు ఛార్జీలు గుదిబండగా మారాయి. సర్కారు అందించే నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో చాలా పాఠశాలల్లో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. -
రెండు పడక గదుల ఇళ్లపై నీలినీడలు
[ 28-03-2024]
భారాస హయాంలో చేపట్టిన రెండు పడకల ఇళ్ల నిర్మాణాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వీటి విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
హలో.. హలోకు అనుమతి
[ 28-03-2024]
మారుమూల గ్రామాల్లో సంకేతాల (సిగ్నల్స్) సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రత్యేకంగా సెల్టవర్లు మంజూరు చేసింది. స్థలసమస్య కారణంగా పలు పనులు నిలిచి పోయాయి. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 28-03-2024]
పట్టణంలోని శివాజీచౌక్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న లక్ష్మణ్ (25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు పట్టణ సీఐ అనిల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే