logo

అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి కృషి

అభివృద్ధికి చిరునామాగా జిల్లాను అన్నిరంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మంచిర్యాల జిల్లా నూతన పాలనాధికారి బాదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు.

Published : 02 Feb 2023 02:22 IST

పాలనాధికారిగా బాధ్యతలు చేపడుతున్న బాదావత్‌ సంతోష్‌

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: అభివృద్ధికి చిరునామాగా జిల్లాను అన్నిరంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మంచిర్యాల జిల్లా నూతన పాలనాధికారి బాదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహించిన ఆయన బదిలీల్లో భాగంగా మంచిర్యాలకు పాలనాధికారిగా నియమితులై బుధవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో విద్య, వైద్య రంగాల సేవలు మెరుగుపడేలా ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. బాధ్యతల స్వీకరణకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు జిల్లా శాఖల అధికారులు స్వాగతం పలికారు. కలెక్టరేట్‌ కార్యాలయంలోని ఛాంబర్‌లో పాలనా బాధ్యత పత్రాలపై సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు. మంచిర్యాలతో పాటు కుమురంభీం జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని