ఒకే నెలకు స్లాట్లు.. దివ్యాంగులకు ఇక్కట్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సదరం శిబిరం స్లాట్లు లభించక వేలాది మంది దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
భైంసాలో మీ సేవా కేంద్రం వద్ద స్లాట్ కోసం నిరీక్షిస్తున్న దివ్యాంగుడు మాధవరావు, దివ్యాంగులు
భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన మాధవరావుకు ఏడాది క్రితం పక్షవాతం వచ్చింది. ఈ కారణంగా ఆయన ఓ కాలు తొలగించారు. దివ్యాంగుడైన ఆయన కృత్రిమ అవయవంతో కాలం వెళ్లదీస్తున్నారు. నేటికి సదరం స్లాట్, ధ్రువీకరణ పత్రం లభించడం లేదని వాపోతున్నారు. బైంసాలో స్లాట్ కోసం రాగా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
స్లాట్ లభించక వెనుదిరిగిన సంజయ్
భైంసా పట్టణంలోని భట్టిగల్లీకి చెందిన సంజయ్(32) పోలియో సోకి పుట్టుకతో వైకల్యంతో బాధపడుతున్నారు. సదరం ధ్రువీకరణ పత్రం పొందలేక పింఛను అందడం లేదు. మరి కొందరు ధ్రువీకరణ పత్రం పొందినప్పటికి గడువు తీరి కొన్ని నెలల నుంచి పింఛను నిలిచిపోయి ఆర్థికసాయానికి దూరమయ్యారు.
భైంసా పట్టణం, న్యూస్టుడే: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సదరం శిబిరం స్లాట్లు లభించక వేలాది మంది దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే మూడు నెలలకు ఇవ్వాల్సినవి ఒకే నెలలో ఆరు శిబిరాలకే అందించడంతో చాలామందికి స్లాట్లు లభించలేదు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడునెలలకోసారి నెలలో నిర్ణీత రోజుల్లో సదరం శిబిరాలు నిర్వహించి వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆన్లైన్లో పరిమిత సంఖ్యలో జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ మాసాల మొదటి రోజున స్లాట్లు జారీ చేస్తుంది. ఈ మేరకు దివ్యాంగులు తమ సమీప ఈ/మీసేవా కేంద్రాలకు వెళ్లి కొత్తవారు, ఇది వరకే ధ్రువీకరణ పత్రాలు పొంది గడువు తీరిన వారు పునరుద్ధరణ కోసం స్లాట్లు బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ లభించిన తేదీన వారు జిల్లా, ప్రాంతీయాసుపత్రుల్లో సంబంధిత వైకల్య నిర్ధారణ వైద్యుల వద్ద పరీక్షించుకోవాలి. ఈ సంవత్సరం జనవరిలో మొదటి విడత మూడు నెలలకు ప్రభుత్వం స్లాట్లు విడుదల చేయలేదు. దీంతో జిల్లాలో దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు కొన్ని రోజుల పాటు వాటి కోసం కేంద్రాల చుట్టూ తిరిగి విసిగిపోయారు. చివరకు జనవరిలో అవి విడుదల చేయలేదని తెలుసుకున్న బాధితులు ఫిబ్రవరి నెల కోసం ఎదురు చూడగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ స్లాట్ల విడుదలపై ముందస్తుగా ప్రకటన చేయలేదు. అయినప్పటికి ఉమ్మడి జిల్లాలోని సుమారు 300 మీసేవ/ఈసేవా కేంద్రాల్లో ఒక్కో కేంద్రానికి పదుల సంఖ్యలో దివ్యాంగులు చేరుకుని నిరీక్షించారు. ఎట్టకేలకు బుధవారం సుమారు ఉదయం 10.45 గంటలకు ఆన్లైన్లో స్లాట్లు విడుదల కాగా పది నిమిషాల్లో ఒకరిద్దరికి అవి లభించాయి. మూడు నెలల కోసం స్లాట్లు ఇవ్వాల్సి ఉండగా అధికారులు ఫిబ్రవరిలో ఆరు రోజుల శిబిరాలకు మాత్రమే విభాగాల వారిగా (3,7,13,18,23,28 తేదీలకు) ఇచ్చారు. భైంసాలోని మూడు మీసేవా కేంద్రాల్లో కొత్త, పునరుద్ధరణ స్లాట్లు ఎనిమిది మందికి మాత్రమే లభించడంతో మిగతా వారు వెనుదిరిగారు.
సెర్ప్ నుంచే విడుదల
- విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి
దివ్యాంగుల సదరం శిబిరాల తేదీల నిర్వహణ, స్లాట్లు సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు ఆన్లైన్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా విడుదల చేస్తారు. ఆయా విభాగాల దివ్యాంగులకు ఒక్కో రోజు 60 (కొత్తవారికి 30, పునరుద్ధరణకు 30) చొప్పున ఫిబ్రవరి నెలలో ఆరు రోజుల శిబిరాలకు స్లాట్లు విడుదల చేశారు. ఆ ప్రకారమే స్లాట్లు లభించిన వారు శిబిరాలకు హాజరై ధ్రువీకరణ పత్రాలు పొందాలి.
భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన మాధవరావుకు ఏడాది క్రితం పక్షవాతం వచ్చింది. ఈ కారణంగా ఆయన ఓ కాలు తొలగించారు. దివ్యాంగుడైన ఆయన కృత్రిమ అవయవంతో కాలం వెళ్లదీస్తున్నారు. నేటికి సదరం స్లాట్, ధ్రువీకరణ పత్రం లభించడం లేదని వాపోతున్నారు. బైంసాలో స్లాట్ కోసం రాగా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణోత్సవం
[ 18-04-2024]
పల్లెపట్టణం, ఊరూవాడల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. ఆలయాల్లో శ్రీరామచంద్రుడు, సీతాదేవీల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తుండగా తలంబ్రాలు, -
గౌతమ్.. నన్ను మన్నించురా...
[ 18-04-2024]
మరికొద్ది గంటల్లో సంతోషంగా పండగ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ కుటుంబంలో విద్యుత్తు ప్రమాదం విషాదం నింపింది. కాసిపేట ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. -
ఎన్నికల సమర శంఖారావం..
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. ఈ పోరులో పాల్గొనే వివిధపార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల నామపత్రాల దాఖలుకు రంగం సిద్ధం అయ్యింది. -
ఉపాధి కూలి.. నిరీక్షణతో సరి
[ 18-04-2024]
పేద కూలీలతోపాటు ఇటీవల వ్యవసాయ పనుల సీజన్ ముగియడంతో రైతు కుటుంబాలు అధిక సంఖ్యలో ఉపాధి హామీ పనుల బాట పట్టాయి. సకాలంలో డబ్బులు చేతికందక పూట గడవడం కోసం ఇతరుల వద్ద వారు చేతులు చాచాల్సి వస్తోంది. -
ముగిసిన 27 ఏళ్ల విప్లవ ప్రస్థానం
[ 18-04-2024]
ఆదివాసీ మహిళ రెండు దశాబ్దాల విప్లవ ప్రస్థానం ముగిసిపోయింది. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో బజార్హత్నూర్ మండలం డెడ్రాకు చెందిన దాసరివార్ సుమన్బాయి అలియాస్ రజిత మృతి చెందారు. -
విద్యార్థి మరణం పాఠం నేర్పేనా?
[ 18-04-2024]
ఆర్జీయూకేటీలో వరుస విద్యార్థి మరణాలు.. ప్రాంగణంలో తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలు విశ్వవిద్యాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు విద్యార్థులకు, ఇటు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. -
బాధలు చెప్పుకొనేదెలా?
[ 18-04-2024]
జిల్లాలో 2015లో ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న ఈ స్టేషన్లో ప్రస్తుతం అధికారులెవరూ లేరు. -
నిధుల ప్రవాహం.. తీరాలి దాహం
[ 18-04-2024]
చెన్నూరు పట్టణంలోని శివారు కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటికోసం నిధులు అందుబాటులో ఉండటంతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు. -
వలసల జోరు.. కారు బేజారు!
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నామపర్వానికి ముందు జిల్లాలో అనూహ్య పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టున్న నాయకులందరూ కాంగ్రెస్, భాజపా పార్టీలోకి చేరుతున్నారు. -
రాయితీ.. పక్కదారి!
[ 18-04-2024]
జిల్లాలోని రెండు పురపాలికలు, పలు మండలాలు వ్యాపార, వాణిజ్యపరంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామికంగా కాగజ్నగర్తోపాటు పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు గ్యాస్తో నడిచే ఆటోలు, కార్లు ఎక్కువగా ఉన్నాయి. -
ఈదురు గాలుల బీభత్సం.. క్షణాల్లో అతలాకుతలం..
[ 18-04-2024]
మండలంలోని బూరుగూడలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్షణాల వ్యవధిలోనే పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిత్యావసర సామగ్రి చెల్లాచెదురయ్యాయి. -
అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
[ 18-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అపారమైన చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. అద్భుతమైన ఆలయాలు, జాలువారే జలపాతాలకు నిలయంగా ఉంది. ఊహకందని రీతిలో వందల సంవత్సరాల కిందటే నిర్మించిన అబ్బురపరిచే శిల్పసంపద, గత వైభవానికి చిహ్నంగా కోటలు దర్శనమిస్తాయి. -
సంపూర్ణ అక్షరాస్యతకు.. నవభారత!
[ 18-04-2024]
నిరక్షరాస్యులైన వయోజనులందరినీ వచ్చే అయిదేళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భారత ప్రభుత్వం నూతనంగా నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఎండలతో ఉక్కిరిబిక్కిరి
[ 18-04-2024]
జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడిందని సంతోషిస్తున్న సమయంలోనే భానుడు తిరిగి భగ్గమంటున్నాడు. రెండు రోజుల్లోనే ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు పైగా పెరిగింది. -
అభ్యర్థులకు కీలకం.. నామపత్రాల ఘట్టం
[ 18-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో లోక్సభ ఎన్నికల పోరు క్రమేణా జోరందుకుంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!