ఐటీ టవర్కు రూ. 40 కోట్లు మంజూరు
ఆదిలాబాద్ పట్టణంలో ఐటీ టవర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే స్థల ఎంపిక పూర్తికాగా తాజాగా భవన సముదాయానికి నిధులు కేటాయించారు.
ఐటీ టవర్ భవనం నమూనా చిత్రం
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం: ఆదిలాబాద్ పట్టణంలో ఐటీ టవర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే స్థల ఎంపిక పూర్తికాగా తాజాగా భవన సముదాయానికి నిధులు కేటాయించారు. నిర్మాణ బాధ్యతను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)కి అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
స్థానికంగానే ఉద్యోగ కల్పన కోసం ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ సేవలు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న తరుణంలో ఉమ్మడి జిల్లాలోనే ఆదిలాబాద్లో మొదటగా ఈ ఐటీ టవర్ మంజూరైంది. ఇది స్థానిక నిరుద్యోగులకు ఊరటనివ్వనుంది. ఇప్పటికే బీడీఎన్టీ, ఎన్టీటీ రెండు ప్రైవేటు ఐటీ సంస్థల ఆధ్వర్యంలో పట్టణంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో 150 మంది ఇంజినీరింగ్ పట్టభద్రులతో కార్యాలయం కొనసాగుతోంది. స్థానికంగా ఉన్నవారికే ఇందులో ఉద్యోగాలు కల్పించారు. గతంలో ఐటీ మంత్రి కేటీఆర్ ఈ భవనాన్ని సందర్శించిన సమయంలో విద్యుత్తు, మరమ్మతులు, ఇతర సౌకర్యాల కోసం రూ.1.50 కోట్లు విడుదల చేశారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు తాజాగా కొత్త భవన నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి.
మూడెకరాల స్థలంలో..
జిల్లా కేంద్రంలోని బట్టిసావర్గాం శివారు పరిధిలోకి వచ్చే సర్వే నెం.72లో ఐటీ టవర్ నిర్మాణానికి మూడెకరాల స్థలం కేటాయించారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విక్రయించిన ప్లాట్లకు ఆనుకొనే ఈ స్థలం ఉంటుంది. మూడెకరాల విశాలమైన స్థలంలో 48,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. జి+5 తరహాలో రూ.40 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఈ భవనం రూపుదిద్దుకోనుంది.
స్థానికంగానే ఉపాధి
మూడు షిఫ్టుల వారీగా దాదాపు 2 వేల మంది వరకు పనిచేసే సామర్థ్యం ఉండేలా భవనం నిర్మించనున్నారు. వివిధ కంపెనీలను ఇక్కడ ఆహ్వానించేందుకు ఇది వరకే పట్టణంలో ఓ సమావేశాన్ని సైతం ఏర్పాటు చేశారు. స్థానికంగా పుట్టి పెరిగి ఇతర ఇతర దేశాల్లో ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్న వారిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. సామర్థ్యం ఆధారంగా ఒక కంపెనీ 50 మందికి ఉద్యోగావకాశం కల్పిస్తే మరో కంపెనీ 100 వరకు ఉద్యోగాలు ఇస్తుంది. పది నుంచి 20 వరకు కంపెనీలు వస్తేనే లక్ష్యం పూర్తవుతుందని అంచనా. తద్వారా స్థానికంగా ఉన్న ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఇక్కడే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
యువతకు ఉజ్వల భవిత
- జోగు రామన్న, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పన కోసం కోరిన వెంటనే ఐటీ టవర్ మంజూరు చేసినందుకు మంత్రి కేటీఆర్కు ఎప్పటికి రుణపడి ఉంటాం. టవర్ నిర్మాణం ద్వారా ఐటీ రంగంలో యువతకు ఉజ్వల భవిష్యత్తు అందుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
[ 29-03-2024]
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
జిల్లాలో శుక్రవారం క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
తాంసి సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
అదిలాబాద్ జిల్లా తాంసిలోని సీఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడేను నిర్వహించారు. ఏసుక్రీస్తు ప్రార్థన మందిరంలో క్రైస్తవులంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న సీఎస్ఐ చర్చిలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. -
మతతత్వంతో లబ్ధి పొందే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 29-03-2024]
మతతత్వం రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే పార్టీలకు రానున్న లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. -
అక్రమ మద్యం విక్రయిస్తే కేసులు తప్పవు
[ 29-03-2024]
అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ స్టేషన్ ఎక్సైజ్ సీఐ విజేందర్ హెచ్చరించారు. -
తేలిన బరి.. గెలుపుపై గురి
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. -
ఇక విద్యుత్తు కోతలకు చెక్
[ 29-03-2024]
ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం... -
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?: ఏలేటి
[ 29-03-2024]
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా చెరబట్టారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మరోసారి ఆరోపించారు. -
పెన్గంగా.. ఇసుకదందా
[ 29-03-2024]
మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. -
గడువు ముందర సందిగ్ధం!
[ 29-03-2024]
ఏటా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ప్రభుత్వ పనులకు బడ్జెట్ కేటాయిస్తారు. దానిని ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తే.. వారు ఈ-కుబేర్లో నమోదు చేస్తారు. -
ఆన్లైన్ జూదంలో నష్టపోయి.. రైతుల డబ్బు కాజేత
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) మేనేజర్ విజయ్ జాదవ్ ఆన్లైన్ జూదానికి అలవాటు పడి అందులో నష్టపోయి రైతులకు చెందిన డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది. -
బహుజన, తెలంగాణవాదాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 29-03-2024]
రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. -
సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి ఆదేశించి
[ 29-03-2024]
గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం అదనపు పాలనాధికారి దీపక్ తివారీతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. -
ఉద్యానవనాలపై ఉదాసీనత..
[ 29-03-2024]
మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు. -
రూ.‘కోటి’.. చీకటి పాలు
[ 29-03-2024]
ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ చీకటి పాలవుతోంది. -
‘టీజీ’ కోడ్తో రిజిస్ట్రేషన్లు
[ 29-03-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’కి మార్పు చేస్తూ ఈ నెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. -
పట్టణ వనాలపై పట్టింపు శూన్యం
[ 29-03-2024]
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. -
ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో విషాదం
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో నిజామాబాద్ పట్టణానికి చెందిన యువతి, యువకుడు బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. -
సాగులో సాంకేతికత.. మహిళలకు సాధికారత
[ 29-03-2024]
వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్ నిర్వహణ, -
ఈత కారాదు గుండెకోత
[ 29-03-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. -
ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : సుగుణ
[ 29-03-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. దీంతో పార్టీకి ఆదివాసీలపై ఉన్న ప్రేమ నిరూపితమైందని తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!