పుడమి.. తల్లడిల్లి..!
నీటి వనరులు ఉన్న జిల్లాలో మిగులు జలాలు పుష్కలంగా ఉన్నాయని అవసరానికి మించి వాడుతుండటం భవిష్యత్తు ప్రమాదాన్ని సూచిస్తోంది. పొదుపు చర్యలు చేపట్టక.. అను‘మతి’లేకుండా ఇష్టారీతిన బోర్ల తవ్వకాలు చేపడ్తున్నారు.
అనుమతి లేకుండా ఇష్టారీతిన బోర్ల తవ్వకాలు
నిర్మల్ సమీపంలో బోరు తవ్వకం
నిర్మల్, న్యూస్టుడే : నీటి వనరులు ఉన్న జిల్లాలో మిగులు జలాలు పుష్కలంగా ఉన్నాయని అవసరానికి మించి వాడుతుండటం భవిష్యత్తు ప్రమాదాన్ని సూచిస్తోంది. పొదుపు చర్యలు చేపట్టక.. అను‘మతి’లేకుండా ఇష్టారీతిన బోర్ల తవ్వకాలు చేపడ్తున్నారు. సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.. పరుగెత్తే నీటిని ఆపడానికి అవసరమైన కృషి చేస్తున్నాం.. నీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం.. వాల్టాచట్టాన్ని అమలు చేస్తున్నామంటూ పాలకులు, అధికారులు ప్రచారం చేస్తున్నా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. జిల్లాలో 47 శాతం నీటిని వినియోగిస్తుండగా.. 53 శాతం మిగులు జలాలు ఉండటం సంతోషకరమైనా.. రోజురోజుకు వినియోగం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఆర్నెళ్ల నుంచి ఒక్క బోరు తవ్వడానికి అనుమతి తీసుకోకుండా ప్రతి నిత్యం పదుల సంఖ్యలో బోర్ల తవ్వకాలతో పుడమి తల్లఢిల్లుతోంది.
నిబంధనలు గాలికి..
పంట పొలాల్లో వేసే బోర్ల తవ్వకాలకు కచ్చితంగా అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉన్నా.. ఎక్కడా పాటించడం లేదు. ఒక బోరు తవ్వాలంటే ముందుగా సంబంధిత మండలాల తహసీల్దార్ల వద్ద అనుమతి తీసుకోవాలి. బోరు తవ్వకం ప్రాంతంలో నీరుందో లేదో తెలుసుకోవడానికి భూగర్భజల శాఖ అధికారులను సంప్రదించాలి. ఈ రెండు శాఖల అధికారుల అనుమతులు తీసుకున్న తర్వాత బోరు తవ్వాలి. జిల్లాలో ఇదెక్కడా అమలు కావడం లేదు. బోరు తవ్వకం కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఆ శాఖల అధికారులు తేల్చిచెప్పారు.
నాలుగు మండలాల్లో పొంచి ఉన్న ప్రమాదం
జిల్లాలోని ముథోల్, భైంసా, లోకేశ్వరం, నిర్మల్ గ్రామీణ మండలాల్లో నీటి వినియోగం ఎక్కువగా జరుగుతున్నట్లు భూగర్భజలశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 70 శాతం కంటేె తక్కువగా నీటిని వినియోగిస్తే సురక్షితమైనా ఈ నాలుగు మండలాల్లో 90 శాతం వరకు నీటిని వాడతుండటం భవిష్యత్తు ప్రమాదాన్ని సూచిస్తోంది. భూగర్భ జలాలు ఎక్కువగా వినియోగం అవుతున్న ఈ మండలాల్లో రానున్న రోజుల్లో నీటి పొదుపు చర్యలు పాటించడంతోపాటు వృథా నీటిని భూమిలోకి ఇంకించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
బోరుబావులపై 55 వేల ఎకరాల్లో సాగు..
యాసంగిలో జిల్లాలో 1.70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగుచేస్తున్నారు. ఇందులో 55 వేల ఎకరాల్లో బోరుబావులపై ఆధారపడి పండిస్తున్నారు. నిరంతర విద్యుత్తు సరఫరా జరుగుతుండటంతో నీటి వినియోగం ఎక్కువ అవుతోంది. చాలా ప్రాంతాల్లో రైతులు అవసరం లేకుండా పంపుసెట్లు నడిపిస్తున్నారు. ఒకవేళ అవసరం లేకుండా మోటారు నిలిపివేస్తే ఇక్కడి నీటి ఊటలు పక్కనున్న బావిలోకి వెళ్లిపోయే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరంతర ఉచిత విద్యుత్తు అందుతుండటంతో రాత్రి సమయాల్లో నీటి వినియోగం ఎక్కువగా జరుగుతుండటంతో భవిష్యత్లో నీటి ముప్పును సూచిస్తోంది. జిల్లాలో 53 వేల ఆటోస్టార్టర్లు ఉండగా.. 20 వేల మంది రైతులు ఆ స్టార్టర్ల స్వచ్ఛందగా తొలగించినా.. ఇంకా 33 వేల వరకు ఉండటంతో అవసరం లేకున్నా నీటిని ఉపయోగిస్తున్నారు. దీంతో భూగర్భజలాలు అడుగంటుపోతున్నాయి. నీరుందని వృథా నీటిని భూమిలోకి ఇంకించని కారణంగా మండుతున్న ఎండల కారణంగా ఆవిరి రూపంలో 30 శాతం నీరు కనుమరుగవుతోంది. ప్రస్తుతం ప్రస్తుతం 6.95 ఉన్న భూగర్భజలం మేనెలాఖరు వరకు 10 నుంచి 12 మీటర్లకు పడిపోయే ప్రమాదం ఉందని భూగర్భజలశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకుంటే కొంతవరకైనా నీటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
కొత్తగా బోరుబావులు తవ్వొద్దు
ఓ వైపు ఎండలు మండుతుండటంతో పంటలకు నీరు ఎక్కువ అవసరం పడుతుంది. ఈ క్రమంలో భూగర్భజలాలు పడిపోవడం సహజం. వానాకాలంలో వర్షంనీటిని ఇంకించని కారణంగా భూగర్భంలోని నీటి పొరల్లో నీటి లభ్యత తగ్గిపోవడంతో బోర్లలో నీరు రావడం నిలిచిపోతుంది. జిల్లాలో పడిపోయిన భూగర్భ జలమట్టంతో వ్యవసాయ బోరుబావులు ఏకధాటిగా నడిపితే 50 శాతానికిపైగా బోరుబావులు ఖాళీ అవుతాయి. రైతులు ఎవరూ కొత్తగా బోరుబావులు తవ్వించి ఆర్థికంగా నష్టపోవద్దు. ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ తమ పంట పొలాల్లో నీటి గుంటలు నిర్మించుకుంటే రానున్న వానాకాలంలో వర్షం నీరు నిల్వ చేసుకునే వీలుండటంతో భూగర్భజలాలు సమృద్ధిగా పెరిగి సాగునీటికి ఇబ్బందులు ఉండవు.
శ్రీనివాసబాబు, ఉప సంచాలకుడు, భూగర్భజలశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంగమఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని మంగ మఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. -
ఊరూరా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మండలంలోని పొన్నారి, తాంసి, హస్నాపూర్, కప్పలరా, బండల నాగపూర్, వడ్డాడి, గిరిగాం తదితర గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ... -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. -
సంక్షేమ మంత్రం.. ప్రత్యర్థులపై విమర్శల బాణం
[ 23-04-2024]
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న భారాస, భాజపా అభ్యర్థులు ఆత్రం సక్కు, గోడం నగేష్ వ్యవహారశైలి మీకు తెలుసు. వారి పనితనం మీకు తెలిసిందే. మంచోడు మంచోడని మంచం ఎక్కిస్తే మంచమంతా పాడు చేసినట్లు ఆత్రం సక్కు వ్యవహారం ఉంటే, బుద్ధిమంతుడని సద్ది కట్టిస్తే బొడ్రాయి దగ్గర భోంచేసి మళ్లీ ఇంటికొచ్చి బోర్లాపడుకున్నట్లు నగేష్ వ్యవహారముంది. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 23-04-2024]
విద్యాసంవత్సరం నేటితో ముగియనుంది. విద్యార్థులకు సంగ్రహణాత్మక(ఎస్ఏ2) పరీక్షలు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. -
శుద్ధజలంపై శ్రద్ధ
[ 23-04-2024]
పంచాయతీల్లో కలుషిత నీటి సరఫరాను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతిరోజు తాగు నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
పారిశ్రామిక ప్రాంతం.. ప్రచారానికి లేదు వేసవి తాపం
[ 23-04-2024]
అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే. -
ఆదిలాబాద్ లోక్సభ బరిలో..
[ 23-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బరిలో నిలిచారు. 1952లో ఆదిలాబాద్ లోక్సభ స్థానంగా ఏర్పడింది. -
మళ్లీ.. ఏనుగు గండం!
[ 23-04-2024]
గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది. -
పట్టణానికి దూరం.. కావాలి ప్రత్యామ్నాయం
[ 23-04-2024]
మంచిర్యాల ఎంసీహెచ్(మాతా, శిశు ఆరోగ్య కేంద్రం).. పట్టణానికి దూరంగా ఉండటంతో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అత్యవసరమైనవి.. ముఖ్యమైనవి.. ఆసుపత్రిలో చల్లదనం, సరిపడా నీటి సౌకర్యం. -
నకిలీ వేలిముద్రలతో పీఎంకేకే పథకంలో మోసం
[ 23-04-2024]
నకిలీ వేలిముద్రలతో హాజరు శాతం ఎక్కువగా చూపించి బిల్లులు కాజేసిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర పథకం నిర్వాహకులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఇసుక దోచేస్తున్నారు..
[ 23-04-2024]
జిల్లాలోని నదులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
సాయంత్రం ఈదురుగాలులతో అతలాకుతలం
[ 23-04-2024]
భైంసా, కుభీరు, కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రగాలులతో రేకుల ఇళ్లు, షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్