logo

గుండెపోటుతో విద్యుత్తు శాఖ ఏఈ మృతి

విధి నిర్వహణలో భాగంగా విద్యుత్తు శాఖలో విజిలెన్స్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆ శాఖ ఏఈ షేక్‌ కరీమొద్దీన్‌(55) గుండె పోటుతో మృతి చెందాడు.

Updated : 03 Feb 2023 19:45 IST

ఉట్నూరు గ్రామీణం: విధి నిర్వహణలో భాగంగా విద్యుత్తు శాఖలో విజిలెన్స్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆ శాఖ ఏఈ షేక్‌ కరీమొద్దీన్‌(55) గుండె పోటుతో మృతి చెందాడు. బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి విధుల్లో భాగంగా ఉట్నూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. ఉట్నూరు మండల కేంద్రంలో స్తంభాలు, ఇళ్లలోని మీటర్లను పరిశీలించారు. అనంతరం మండలంలోని కుమ్మరి తండాకు చేరుకొని ఓ ఇంట్లో విద్యుత్తు మీటర్‌ను తనిఖీ చేస్తుండగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. స్థానికులు, విద్యుత్తు శాఖ అధికారులు వెంటనే ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారులు ఆయన్ని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని