సమాజ హితులు.. సమాచార వారధులు
ఆసక్తితో నేర్చుకున్న కళ ఒకరికి.. సామాజిక సేవ ద్వారా మరొకరికి ఉపాధిని తెచ్చి పెడుతున్నాయి.
చెన్నూరు పట్టణం, భీమారం, న్యూస్టుడే: ఆసక్తితో నేర్చుకున్న కళ ఒకరికి.. సామాజిక సేవ ద్వారా మరొకరికి ఉపాధిని తెచ్చి పెడుతున్నాయి. వారిద్దరూ జనానికి ఉపయోగపడే వీడియోలను రూపొందిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. యూట్యూబ్లో వాటిని పొందుపర్చి శబాష్ అనిపించుకుంటున్నారు చెన్నూరు, భీమారానికి చెందిన యువకులు పెండ్యాల సతీష్, రాపెల్లి రాజన్న యాదవ్. వారిపై కథనం.
యూట్యూబ్ ఛానల్లో సతీష్ వీడియోలను వివరించే దృశ్యం
యూట్యూబ్లో వీడియోలు పొందుపర్చి..
సతీష్ మిమిక్రీ నేర్చుకొని ప్రావీణ్యం పొందాడు. తనకెంతో ఆసక్తి ఉన్న ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగాలపై పరిజ్ఞానాన్ని పెంచుకొని అందులో రాణిస్తున్నాడు. లాక్డౌన్ సమయంలో తాను నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మరికొందరు సులువుగా నేర్చుకునేలా వీడియోలను తయారు చేశాడు. యూట్యూబ్లో స్వయంగా ఎస్ఎం-6టీవీ ఛానల్ను రూపొందించి జనానికి ఉపయోగపడే అనేక చిట్కాలతో కూడిన వీడియోలను తయారుచేసి యూట్యూబ్లో పొందుపరిచాడు. లాక్డౌన్లో ప్రభుత్వం సూచించిన నిబంధనల వీడియో, ఆడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ఏర్పాటుచేసి సామాజిక బాధ్యతను నిర్వర్తించాడు. కరోనా వ్యాప్తిని అరికట్టే శానిటైజర్ తయారు, నీరు, విద్యుత్తు పొదుపు కోసం వాటర్ట్యాంకు ఓవర్ఫ్లో అలారమ్, చెడిపోయిన ఎల్ఈడీ బల్బుల మరమ్మతులు, చరవాణి సిగ్నల్ సమస్యను అధిగమించడంతో పాటు ఇంటిలో విద్యుత్తుకు సంబంధించిన కనీస పరిజ్ఞానాన్ని కల్పించే వీడియోలను తయారుచేసి తన ఛానల్లో ఉంచాడు. అతడు యూట్యూబ్లో పొందుపర్చిన అనేక వీడియోలను ఇప్పటివరకు లక్షలాదిమంది వీక్షించారు. నేర్చిన కళను పదిమందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఛానల్ ఆదాయవనరులా మారింది.
సామాజిక బాధ్యత ధ్యేయంగా...
జానపద కళాకారుల కార్యక్రమాన్ని వీడియో తీస్తున్న రాజన్న యాదవ్
గ్రామ యువతను చైతన్యం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువకుడు రాపెల్లి రాజన్న యాదవ్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడు. తెలంగాణలోని మారుమూల ప్రాంతాల వింతలు-విశేషాలు, యువకుల ప్రతిభను తన యూట్యుబ్ ఛానల్, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి చాటుతున్నారు. 2018 సంవత్సరంలో కొందరు మిత్రులతో కలిసి ‘గ్రామీణ చైతన్య సేవా సమితి’ని ప్రారంభించారు. దాని ద్వారా గ్రామాల్లోని యువతను సంఘటితం చేసి సమస్యలపై పోరాడేందుకు అండగా నిలిచారు. నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించడం, వినాయకచవితి సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ, వేసవిలో చలివేంద్రం, మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలను సేవా సమితి ద్వారా చేపట్టాడు. రూరల్ రియలిస్టిక్ యంగిష్ యూత్(ఆర్ఆర్వై) టాక్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణలో మరుగునపడిన కళలు, సంప్రదాయాలను వీడియో రూపంలో తెలుపుతున్నారు. యువతకు అవసరమైన ఉద్యోగావకాశాల విషయాలను, పోటీ పరీక్షకు సిద్ధం కావడానికి అవసరమైన వీడియోలను అందుబాటులో ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శనివారం హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం
[ 19-04-2024]
ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళటానికి ఎంపికైన వారికి ఒకరోజు శిక్షణ శిబిరాన్ని శనివారం స్థానిక సెంట్రల్ గార్డెన్లో నిర్వహించనున్నట్లు హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షాహిద్, మహమ్మద్ తవక్కల్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు