నిధులు కేటాయించి.. మరింత భరోసా కల్పించి
పురపాలికల్లో వీధి వ్యాపారుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. అద్దెలు చెల్లించలేక రహదారుల వెంట వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికంగా మరింత చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.
బడ్జెట్లో వీధివ్యాపారుల అభ్యున్నతికి కేంద్రం పెద్దపీట
చెన్నూరు, న్యూస్టుడే: పురపాలికల్లో వీధి వ్యాపారుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. అద్దెలు చెల్లించలేక రహదారుల వెంట వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికంగా మరింత చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. కొవిడ్ కారణంగా వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్ల కిందట కరోనా కష్టకాలంలో లాక్డౌన్ విధించడంతో వ్యాపారుల బతుకులు ఆగమయ్యాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం వారికి అండగా నిలిచి పీఎం స్వనిధి(ఆత్మనిర్భర్) పథకాన్ని ప్రారంభించి ఆర్థికంగా చేయూతనందించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో పట్టణాల్లో సర్వే నిర్వహించి అర్హులైన చిరు వ్యాపారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులనిచ్చింది. ఎంపిక చేసిన వారికి మొదటి, రెండు, మూడు విడతల్లో రుణసాయం అందించి ఆదుకుంది. గత రెండేళ్లలో వివిధ బ్యాంకుల ద్వారా దాదాపు రూ.50 కోట్ల మేర రుణాలిచ్చారు. ఈ సారి బడ్జెట్లో రూ.468 కోట్లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు ఆర్థికంగా మరింత భరోసా కల్పించింది.
ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో 47,156 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. వీరంతా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్ల వెంట వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఉపాధి మెరుగుపర్చేందుకు మొదట ఆత్మనిర్భర్ పథకంలో మొదటి విడతగా రూ.10 వేలు రుణంగా అందించారు. తిరిగి చెల్లించిన వారికి రెండో విడతగా రూ.20 వేలు అందజేశారు. అవి సక్రమంగా చెల్లించిన వారికి కేంద్రం రుణ పరిమితి పెంచి రూ.50 వేలు అందజేసింది. వీటితో రోడ్ల వెంట వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వీరి జీవన పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు కేంద్రం రుణ పరిమితిని పెంచడంతో పాటు నిధులు భారీగా కేటాయించడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత వృద్ధిలోకి వస్తే ప్రభుత్వ ఆశయం నెరవేరనుంది.
చెన్నూరులోని ప్రధాన రహదారులపై రోడ్లవెంట తోపుడు బండ్లపై వ్యాపారాలు సాగిస్తున్న చిరు వ్యాపారులు
పెరగనున్న రుణ సాయం
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులతో రుణసాయం మరింతగా పెరిగే అవకాశముంది. రూ. 10 వేల నుంచి రూ.50 వేల వరకు పెరిగిన సాయం ఇప్పుడు రూ.లక్ష వరకు పెరిగే అవకాశముంది. వ్యాపార విస్తరణ పెరగడంతో పాటు ఆదాయం మరింత వృద్ధికానుంది. దీంతో వ్యాపారులు ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నారు.
దుకాణాల ఏర్పాటుకు ఇబ్బందులు దూరం
కొవిడ్ సమయంలో నిర్మించిన కొన్ని దుకాణాలను వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. కేంద్రం ప్రకటించిన నిధులతో పురపాలికల్లో దుకాణాలు నిర్మించనున్నారు. నిధుల కేటాయింపుతో వ్యాపారులకు రోడ్ల వెంట ఏర్పాటు చేసుకున్న తోపుడు బండ్లు, రేకుల షెడ్లకు స్వస్తి పలికే అవకాశముంది.
సద్వినియోగం చేసుకోవాలి
- రాజు, మెప్మా జిల్లా సమన్వయకర్త, మంచిర్యాల
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సారి బడ్జెట్లో వీధి వ్యాపారులకు భారీగా నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. అర్హులైన వ్యాపారులు రుణాలు అందించి వ్యాపార నిర్వహణకు సహకరిస్తాం. వ్యాపారులు రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించి మరిన్ని ప్రోత్సహకాలు పొందాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడా ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 24-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పల్లెల్లో ప్లాట్లు.. కొన్నవారికి పాట్లు
[ 24-04-2024]
అనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినా.. ‘రియల్’ దందా చేసే వ్యక్తులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీ అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలోని 396 పంచాయతీల్లో అధికారులు గుర్తించిన లేఅవుట్లు 419 ఉండగా.. ఇందులో కేవలం ఎనిమిదింటికి మాత్రమే అనుమతులున్నాయి. -
ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
[ 24-04-2024]
వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. -
25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
[ 24-04-2024]
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. -
ఏడుసార్లు ఎంపీ.. రెండుసార్లు ఎమ్మెల్యే
[ 24-04-2024]
గుడిసెల వెంకటస్వామిగా, కాకాగా గుర్తింపు పొందిన గడ్డం వెంకటస్వామి తెలంగాణ నుంచి అత్యధికంగా ఏడుసార్లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి సుదీర్ఘకాలం చట్టసభలకు ఎన్నికైన నేతగా పేరు గడించారు. -
ఉక్కపోత.. చిన్నారుల వెత
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
రక్షణ తీగలే.. యమపాశాలు
[ 24-04-2024]
రేయింబవళ్లు కష్టపడి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అడవి జంతువుల కారణంగా చేజారుతున్నాయి. -
తునికాకు సేకరణకు వేళాయె..
[ 24-04-2024]
ఈ ఏడాది తునికి ఆకు సేకరణకు అటవీశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో ఆకు నాణ్యత బాగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు -
అక్రమ దందా.. అధికారుల అండ
[ 24-04-2024]
రాయితీ బియ్యం దందా చూడడానికి మామూలుగా అనిపిస్తుంది. దీనిపై లోతుగా తెలుసుకుంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
గొలుసుకట్టు.. అక్రమాలతో కనికట్టు
[ 24-04-2024]
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా పదేళ్ల కిందట ఓ జిల్లా అధికారి నేతృత్వంలో సాగిన గొలుసుకట్టు వ్యాపారంలో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. -
ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
[ 24-04-2024]
వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం నస్పూర్లోని కలెక్టరేట్లో ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్.శాంతారామ్, -
25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
[ 24-04-2024]
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల బాలలు పాఠశాల స్థాయిలో చదువును మానేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?