డ్రైవర్కు ఛాతీలో నొప్పి.. ఆర్టీసీ బస్సు బోల్తా.
జిల్లా కేంద్రంలోని చెక్ పోస్టు సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
ఆసిఫాబాద్: కుమురం భీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్లో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. డ్రైవర్కు ఛాతీలో నొప్పి రావడంతో చెక్పోస్టు వద్ద హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం ఆసిఫాబాద్ డిపో నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బయల్దేరింది. బస్సు కిలోమీటర్ దూరం వెళ్లగానే డ్రైవర్ సతీశ్కు ఛాతీలో నొప్పి రావడంతో స్టీరింగ్ను వదిలి ఆయన కిందపడిపోయారు. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్తో పాటు మరో ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది, మరో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సు బోల్తా పడటంతో కండర్ శ్రీనివాస్ సహా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్, కండక్టర్లను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మంచిర్యాల తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులోని ఓ ప్రయాణికురాలికి స్వల్ప గాయమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. -
విక్రయదారులు లైసెన్స్ తీసుకోకపోతే చర్యలు
[ 23-04-2024]
ఇండియాస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నమోదు లేదా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. -
25న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. -
25న విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఈనెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. -
హోటల్లో ఆకస్మిక తనిఖీ.. రూ.25వేలు జరిమానా
[ 23-04-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని బావర్చి బిర్యానీ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. -
వ్యాధి తీవ్రత అధికంగా ఉంటేనే రిఫర్ చేయాలి..
[ 23-04-2024]
మహిళల వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేయాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. -
హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు
[ 23-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి, గుట్ట హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మహిళల హక్కుల పై ఉపాధి కూలీలకు అవగాహన
[ 23-04-2024]
సఖీ కేంద్రం, మహిళా సాధికారత కేంద్రం అధ్వర్యంలో మంగళవారం అదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకొలి, లోకారి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు సఖీ కేంద్రం అందించే సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. -
ఆదిత్య ఖండేష్కర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
[ 23-04-2024]
ఆదిత్య ఖండేష్కర్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
భారాస అభ్యర్థి నామినేషన్ దాఖలు
[ 23-04-2024]
ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు చేశారు. -
మంగమఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని మంగ మఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. -
ఊరూరా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మండలంలోని పొన్నారి, తాంసి, హస్నాపూర్, కప్పలరా, బండల నాగపూర్, వడ్డాడి, గిరిగాం తదితర గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ... -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. -
సంక్షేమ మంత్రం.. ప్రత్యర్థులపై విమర్శల బాణం
[ 23-04-2024]
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న భారాస, భాజపా అభ్యర్థులు ఆత్రం సక్కు, గోడం నగేష్ వ్యవహారశైలి మీకు తెలుసు. వారి పనితనం మీకు తెలిసిందే. మంచోడు మంచోడని మంచం ఎక్కిస్తే మంచమంతా పాడు చేసినట్లు ఆత్రం సక్కు వ్యవహారం ఉంటే, బుద్ధిమంతుడని సద్ది కట్టిస్తే బొడ్రాయి దగ్గర భోంచేసి మళ్లీ ఇంటికొచ్చి బోర్లాపడుకున్నట్లు నగేష్ వ్యవహారముంది. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 23-04-2024]
విద్యాసంవత్సరం నేటితో ముగియనుంది. విద్యార్థులకు సంగ్రహణాత్మక(ఎస్ఏ2) పరీక్షలు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. -
శుద్ధజలంపై శ్రద్ధ
[ 23-04-2024]
పంచాయతీల్లో కలుషిత నీటి సరఫరాను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతిరోజు తాగు నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
పారిశ్రామిక ప్రాంతం.. ప్రచారానికి లేదు వేసవి తాపం
[ 23-04-2024]
అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే. -
ఆదిలాబాద్ లోక్సభ బరిలో..
[ 23-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బరిలో నిలిచారు. 1952లో ఆదిలాబాద్ లోక్సభ స్థానంగా ఏర్పడింది. -
మళ్లీ.. ఏనుగు గండం!
[ 23-04-2024]
గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది. -
పట్టణానికి దూరం.. కావాలి ప్రత్యామ్నాయం
[ 23-04-2024]
మంచిర్యాల ఎంసీహెచ్(మాతా, శిశు ఆరోగ్య కేంద్రం).. పట్టణానికి దూరంగా ఉండటంతో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అత్యవసరమైనవి.. ముఖ్యమైనవి.. ఆసుపత్రిలో చల్లదనం, సరిపడా నీటి సౌకర్యం. -
నకిలీ వేలిముద్రలతో పీఎంకేకే పథకంలో మోసం
[ 23-04-2024]
నకిలీ వేలిముద్రలతో హాజరు శాతం ఎక్కువగా చూపించి బిల్లులు కాజేసిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర పథకం నిర్వాహకులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఇసుక దోచేస్తున్నారు..
[ 23-04-2024]
జిల్లాలోని నదులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
సాయంత్రం ఈదురుగాలులతో అతలాకుతలం
[ 23-04-2024]
భైంసా, కుభీరు, కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రగాలులతో రేకుల ఇళ్లు, షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!