ఎల్ఏడీసీసీ సేవలతో పేదలకు ప్రయోజనం
న్యాయ సహాయ మండలి(ఎల్ఏడీసీసీ) ద్వారా పేదలకెంతో ప్రయోజనం కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత పేర్కొన్నారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వింటున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి
ఎంఆర్ సునీత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, ఇతర న్యాయమూర్తులు
ఎదులాపురం, న్యూస్టుడే: న్యాయ సహాయ మండలి(ఎల్ఏడీసీసీ) ద్వారా పేదలకెంతో ప్రయోజనం కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత పేర్కొన్నారు. హైకోర్టు నూతనంగా ప్రవేశ పెట్టిన ఈ విధానంలో సోమవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ రాష్ట్రంలోని పదహారు చోట్ల వర్చువల్ విధానంలో ఈ భవనాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కోర్టు ఆవరణలో నిర్మించిన ఎల్ఏడీసీసీ భవనానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత రిబ్బను కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయ సహాయ మండలి న్యాయవాదులుగా దాసరి గంగారాం, అరుగుల అశోక్, ఉమేష్ డోలే బాధ్యతలు చేపట్టారు. పేదరికం కారణంగా ఇబ్బందులు పడేవారికి న్యాయ సహాయం, సలహాలు ఈ మండలి న్యాయవాదులు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రమీల జైన్, క్షమా దేశ్పాండె(డీఎల్ఎస్ఏ కార్యదర్శి), మంజుల సూర్యవార్, యశ్వంత్సింగ్ చౌహాన్, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు జాబేజ్ శామ్యుల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గౌతమ్.. నన్ను మన్నించురా...
[ 18-04-2024]
మరికొద్ది గంటల్లో సంతోషంగా పండగ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ కుటుంబంలో విద్యుత్తు ప్రమాదం విషాదం నింపింది. కాసిపేట ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. -
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణోత్సవం
[ 18-04-2024]
పల్లెపట్టణం, ఊరూవాడల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. ఆలయాల్లో శ్రీరామచంద్రుడు, సీతాదేవీల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. మంగళ వాయిద్యాలు ప్రతిధ్వనిస్తుండగా తలంబ్రాలు, -
ఎన్నికల సమర శంఖారావం..
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. ఈ పోరులో పాల్గొనే వివిధపార్టీల అభ్యర్థులు, స్వతంత్రుల నామపత్రాల దాఖలుకు రంగం సిద్ధం అయ్యింది. -
ఉపాధి కూలి.. నిరీక్షణతో సరి
[ 18-04-2024]
పేద కూలీలతోపాటు ఇటీవల వ్యవసాయ పనుల సీజన్ ముగియడంతో రైతు కుటుంబాలు అధిక సంఖ్యలో ఉపాధి హామీ పనుల బాట పట్టాయి. సకాలంలో డబ్బులు చేతికందక పూట గడవడం కోసం ఇతరుల వద్ద వారు చేతులు చాచాల్సి వస్తోంది. -
ముగిసిన 27 ఏళ్ల విప్లవ ప్రస్థానం
[ 18-04-2024]
ఆదివాసీ మహిళ రెండు దశాబ్దాల విప్లవ ప్రస్థానం ముగిసిపోయింది. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో బజార్హత్నూర్ మండలం డెడ్రాకు చెందిన దాసరివార్ సుమన్బాయి అలియాస్ రజిత మృతి చెందారు. -
విద్యార్థి మరణం పాఠం నేర్పేనా?
[ 18-04-2024]
ఆర్జీయూకేటీలో వరుస విద్యార్థి మరణాలు.. ప్రాంగణంలో తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలు విశ్వవిద్యాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు విద్యార్థులకు, ఇటు తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. -
బాధలు చెప్పుకొనేదెలా?
[ 18-04-2024]
జిల్లాలో 2015లో ప్రత్యేక మహిళా పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. నిత్యం పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న ఈ స్టేషన్లో ప్రస్తుతం అధికారులెవరూ లేరు. -
నిధుల ప్రవాహం.. తీరాలి దాహం
[ 18-04-2024]
చెన్నూరు పట్టణంలోని శివారు కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటికోసం నిధులు అందుబాటులో ఉండటంతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు. -
వలసల జోరు.. కారు బేజారు!
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నామపర్వానికి ముందు జిల్లాలో అనూహ్య పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టున్న నాయకులందరూ కాంగ్రెస్, భాజపా పార్టీలోకి చేరుతున్నారు. -
రాయితీ.. పక్కదారి!
[ 18-04-2024]
జిల్లాలోని రెండు పురపాలికలు, పలు మండలాలు వ్యాపార, వాణిజ్యపరంగా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామికంగా కాగజ్నగర్తోపాటు పరిసర ప్రాంతాల్లో హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు గ్యాస్తో నడిచే ఆటోలు, కార్లు ఎక్కువగా ఉన్నాయి. -
ఈదురు గాలుల బీభత్సం.. క్షణాల్లో అతలాకుతలం..
[ 18-04-2024]
మండలంలోని బూరుగూడలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. క్షణాల వ్యవధిలోనే పలువురి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిత్యావసర సామగ్రి చెల్లాచెదురయ్యాయి. -
అపురూపం.. చరిత్రకు సాక్ష్యం
[ 18-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అపారమైన చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. అద్భుతమైన ఆలయాలు, జాలువారే జలపాతాలకు నిలయంగా ఉంది. ఊహకందని రీతిలో వందల సంవత్సరాల కిందటే నిర్మించిన అబ్బురపరిచే శిల్పసంపద, గత వైభవానికి చిహ్నంగా కోటలు దర్శనమిస్తాయి. -
సంపూర్ణ అక్షరాస్యతకు.. నవభారత!
[ 18-04-2024]
నిరక్షరాస్యులైన వయోజనులందరినీ వచ్చే అయిదేళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భారత ప్రభుత్వం నూతనంగా నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఎండలతో ఉక్కిరిబిక్కిరి
[ 18-04-2024]
జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడిందని సంతోషిస్తున్న సమయంలోనే భానుడు తిరిగి భగ్గమంటున్నాడు. రెండు రోజుల్లోనే ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు పైగా పెరిగింది. -
అభ్యర్థులకు కీలకం.. నామపత్రాల ఘట్టం
[ 18-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో లోక్సభ ఎన్నికల పోరు క్రమేణా జోరందుకుంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు, కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?