ఇష్టారాజ్యం.. తనిఖీలు పూజ్యం
జిల్లాలో మెడికల్ దుకాణాల నిర్వహణపై పర్యవేక్షణ కరవైంది. ఔషధ నియంత్రణ అధికారులెవరు, ఎక్కడుంటారు.. ఫిర్యాదు చేయాలంటే ఎలా అనే విషయంలో స్థానికులకు తగిన సమాచారం అందుబాటులో ఉండటం లేదు.
నిబంధనలు పాటించని మందుల దుకాణాల యాజమాన్యం
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే
దుకాణంలోని మందులు
జిల్లాలో మెడికల్ దుకాణాల నిర్వహణపై పర్యవేక్షణ కరవైంది. ఔషధ నియంత్రణ అధికారులెవరు, ఎక్కడుంటారు.. ఫిర్యాదు చేయాలంటే ఎలా అనే విషయంలో స్థానికులకు తగిన సమాచారం అందుబాటులో ఉండటం లేదు. ఉన్నతాధికారులు ఆదేశిస్తే తప్ప మందుల దుకాణాల తనిఖీలు జరిగిన ఘటనలు మచ్చుకైనా కనిపించకపోవడం దీనికి నిదర్శనంగా మారింది.
కొందరు మెడికల్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు విస్మరిస్తున్నారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని రకాల మందులు విక్రయించడం నిషిద్ధం. కానీ, కొన్నిచోట్ల దీన్ని పాటించడం లేదు. ఎవరు, ఎలాంటి మందులు కావాలని అడిగినా ఇచ్చేస్తున్నారు. వైద్యుడు రాసిచ్చినవి కాకుండా తమకు అనుకూలంగా ఉన్నవాటిని (లాభం ఎక్కువ వస్తుందన్న ఆశతో) విక్రయిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. ఫార్ములా ఒకటే అంటూ కొనుగోలుదారులకు నచ్చజెప్తున్నారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో రోగి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. విక్రయించిన మందులకు తగిన రసీదులు ఇవ్వాలి. కానీ, చాలాచోట్ల ఇవ్వడం లేదు. దీంతో వారడగినంత చెల్లించాల్సి వస్తోంది. కావాల్సినన్ని మందుబిళ్లలు ఇవ్వకుండా మొత్తం స్ట్రిప్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు రోగికి ఇది అనవసరమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఆర్థికంగా అదనపు భారం పడుతోంది.
అవగాహన లేకపోయినా..
మెడికల్ దుకాణాలు నిర్వహించాలంటే బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ పట్టభద్రులై ఉండాలి. మందులపై కనీస అవగాహన ఉండాలి. కానీ, కొందరు సరైన అవగాహన లేకుండానే కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. పట్టభద్రుల ధ్రువపత్రాలను అద్దెకు తీసుకొని వీటిని నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తగిన అనుమతుల్లేకపోయినా మందుల దుకాణాలు కొనసాగిస్తున్నారు. కొందరు కిరాణ, ఇతర దుకాణాల్లో అంతర్లీనంగా వీటిని నిర్వహిస్తున్నారు. కొన్ని మందులను విధిగా ఫ్రిజ్లో భద్రపర్చాలి. మందులు నిల్వచేసే ప్రాంతంలో పరిశుభ్రత పాటించాలి. దుమ్ము, ధూళి లేకుండా చూడాలి. రిజిస్టర్లు, బిల్ బుక్కులు నిర్వహించాలి. చాలామంది వీటి విషయంలో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
కనిపించని తనిఖీలు..
మార్కెట్ విస్తరణలో భాగంగా మెడికల్ రెప్రజెంటేటివ్స్ ఇచ్చే శాంపిల్ మందులను, ప్రభుత్వం ఆసుపత్రులకు సరఫరా చేసేవాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించొద్దు. దుకాణంలోని మందుల తయారీ గడువుకు ఆరునెలల ముందు నుంచే వాటిని విడిగా ఉంచాలి. కొందరు తయారీ గడువుకు కొద్దిరోజుల ముందువరకూ విక్రయిస్తున్న సంఘటనలు అప్పుడప్పుడు బయటపడ్తున్నాయి. జిల్లాకేంద్రంలో కొద్దిరోజుల క్రితం ఓ మందుల దుకాణంలో గడువు తేదీ ముగిసిన మందులు విక్రయించిన విషయం వెలుగుచూసింది. వీటన్నింటి నివారణకు ఔషధ నియంత్రణ అధికారులు తరచూ పర్యవేక్షణ చేపట్టడం, దుకాణాల్లో తనిఖీలు చేయడం చేపట్టాలి. కానీ, ఇదంతా ఎప్పుడోగాని జరగడం లేదు. గతంలో నిర్మల్ జిల్లాకేంద్రంలోని ఓ ఇంట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నిర్వహించేవారు. మందుల దుకాణదారులకు మినహా దీని చిరునామా చాలామందికి తెలిసేది కాదు. ప్రస్తుతం ఆదిలాబాద్ డీఐకి నిర్మల్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఫలితంగా తనిఖీల ప్రస్తావనే కనిపించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత