ఇంటి నెంబర్ల కథ ఇంతింత కాదయా!
ప్రభుత్వం సూచించిన విధంగా దరఖాస్తు చేసుకుంటే చేపట్టే నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. ఆ తర్వాత వాటికి ఇంటి నెంబర్లను కేటాయిస్తారు. ఇది అంతటా జరిగేది.
చెన్నూరు పట్టణం, న్యూస్టుడే
ప్రభుత్వం సూచించిన విధంగా దరఖాస్తు చేసుకుంటే చేపట్టే నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. ఆ తర్వాత వాటికి ఇంటి నెంబర్లను కేటాయిస్తారు. ఇది అంతటా జరిగేది. కానీ చెన్నూరు పురపాలికలో అందుకు విరుద్ధంగా చేస్తున్నారు. లేనిది ఉన్నట్లు కనికట్టు చేస్తున్నారు. ఖాళీ స్థలాలతోపాటు అక్రమంగా నిర్మించిన ఇళ్లకు ఇంటి నెంబర్లు కేటాయిస్తూ అక్రమాలకు తెరలేపుతున్నారు. గతకొంత కాలంగా పురపాలికలో ఇంటినెంబర్ల దందా సాగుతోంది. ఒక్కో ఇంటినెంబర్కు వేలల్లో వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఒక్కరిద్దరూ ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
అక్రమ నిర్మాణాలకు అధికారిక ముద్ర..
ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ చెన్నూరులో అసైన్డు భూముల దందాను సాగిస్తున్నారు. పట్టణంలోని గెర్రెకాలనీ, లంబడిపల్లికి వెళ్లే మార్గంలో 858, 859, 869, 1046, 1047, 1048, తదితర సర్వేనెంబర్లలో ఉన్న అసైన్డు భూములను గతంలోనే గుంటలుగా మార్చి విక్రయించడంతో పలువురు కొనుగోలు చేశారు. చెన్నూరు పురపాలికగా రూపాంతరం చెందిన తర్వాత భూముల ధరలు పెరగడంతో కొందరు దొడ్డిదారిన ఖాళీస్థలాలకు ఇంటినెంబర్లు పొందారు. ఇంటిపన్ను రషీదు, అసెస్మెంట్ కాపీ, టౌన్ప్లానర్ ఇచ్చిన మ్యాప్ ఆధారంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరికొందరు వాటిల్లో షెడ్ల నిర్మాణాలను చేపట్టారు. గెర్రెకాలనీలోని 63వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అసైన్డు భూముల్లో పదులసంఖ్యలో అక్రమ షెడ్ల నిర్మాణాలను చేపట్టారు. కొందరు ఇంటినెంబర్లను పొందగా.. మరికొందరు ఖాళీ స్థలాలకు ఇంటినెంబర్లను దొడ్డిదారిన తీసుకొని ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఈవ్యవహారంలో వేలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ప్రస్తుతం అసైన్డు భూముల్లో చేపట్టిన నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా ఇంటినెంబర్లను పొందుతున్నట్లు తెలిసింది.. వాటి ఆధారంగానే విద్యుత్తు మీటర్లకు దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం.. గెర్రెకాలనీతో పాటు లంబడిపల్లికి వెళ్లే మార్గంలో కేటాయించిన ఇంటినెంబర్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయి..
ఈ విషయమై పురపాలిక కమీషనర్ గంగాధర్ను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుంటానన్నారు.
తన సతీమణి పేరున పొందిన ఇంటినెంబరు పత్రం
చెన్నూరు పురపాలికకు చెందిన ఓ ప్రజాప్రతినిధి వేలాది రూపాయలు దండుకొని అవసరమున్న వారికి అక్రమ షెడ్ల నిర్మాణాలతోపాటు ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు ఇప్పించాడు. ప్రజా సమస్యలను అంతగా పట్టించుకోని సదరు ప్రజాప్రతినిధి భూముల సెటిల్మెంట్లు చేయడంలో దిట్ట. ఇతడు గెర్రెకాలనీలో తన సతీమణి పేరున రెండు ఇంటి నెంబర్లు పొందారు.. వివాదంలో ఉన్న భూమిలో షెడ్డు నిర్మాణం చేపట్టి ఇంటినెంబర్ పొందగా ప్రత్యర్థి దానిని కూల్చివేయించాడు.. ఒక ఇంటినెంబర్ అధారంగా వివాదంలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం.
ఖాళీ స్థలానికి ఓవ్యక్తి పొందిన ఇంటినెంబరు వివరాలు
గెర్రెకాలనీలో ఏఎంసీ ముందున్న 63వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అసైన్డు భూమిని పలువురు వ్యక్తులు గుంటల చొప్పున కొనుగోలు చేసి షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. వాటిని పురపాలిక అధికారులు కూల్చివేశారు. అందులోని కొందరు ఇంటి నెంబర్ల ఆధారంగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆన్లైన్లో వారి వివరాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.