ద్విచక్ర వాహనం ఉన్నా అనర్హులే
ద్విచక్ర వాహనం ఉంటే రెండు పడక గదుల ఇళ్లకు అనర్హులే అని అధికారులు ప్రకటించారు. ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలోని ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల దరఖాస్తుల విచారణ పూర్తికావడంతో అర్హుల జాబితా సిద్ధం చేశారు.
రెండు పడక గదుల అర్హుల జాబితా తయారు
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం
కేఆర్కే కాలనీలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు
ద్విచక్ర వాహనం ఉంటే రెండు పడక గదుల ఇళ్లకు అనర్హులే అని అధికారులు ప్రకటించారు. ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలోని ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల దరఖాస్తుల విచారణ పూర్తికావడంతో అర్హుల జాబితా సిద్ధం చేశారు. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో లబ్ధిదారులను లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వారి పేర్లు పుర కార్యాలయంలో బహిరంగంగా ప్రదర్శించనున్నారు. అందులోనూ ఎవరైనా అనర్హులుంటే అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.
ఆరేళ్లుగా పట్టణంలోని రెండు పడక గదుల ఇళ్లు లబ్ధిదారులను ఊరిస్తూనే ఉన్నాయి. కలెక్టర్ ఫిర్యాదుల విభాగంలో, ఎమ్మెల్యేకు వచ్చిన దరఖాస్తులు, తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయాల్లో వచ్చిన దరఖాస్తులను ఒకచోట చేర్చారు. అలా 2016 నుంచి వస్తున్న దరఖాస్తులను భద్రపరిచారు. ఈ విషయంపై 2022 ఏప్రిల్ 4 నుంచి 6 వరకు పట్టణంలో వార్డుల వారీగా గ్రామసభలు నిర్వహించి దరఖాస్తుదారుల పేర్లు చదివి వారు ఉన్నారా? లేరా అనేది ఆరా తీశారు. ఇదే సమయంలో కొత్త దరఖాస్తులు సైతం స్వీకరించారు.
‘ఈనాడు’ కథనంతో విచారణ
గ్రామ సభలు నిర్వహించి పది నెలలు కావొస్తున్నా ప్రక్రియ స్తబ్ధుగా ఉండటంతో 2023 ఫిబ్రవరి 12వ తేదిన ‘ఈనాడు’లో ‘అవి ఉత్తుత్తి సభలేనా?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ఎట్టకేలకు దరఖాస్తులన్నింటిపై ఇంటింటి విచారణ చేపట్టారు. రెవెన్యూ అధికారులు అందించిన జాబితాను వార్డుల వారీగా పుర సిబ్బంది జల్లెడ పట్టారు. కారుందా, సొంతిళ్లు ఉందా? ఆదాయమెంత? తదితర వివరాలన్నీ సేకరించారు. దీంతోపాటు ద్విచక్ర వాహనం ఉన్నా ఆ వివరాలను చేర్చారు. దీంతో చాలా వరకు దరఖాస్తులను తొలగించారు. వేలాది మందికి ద్విచక్ర వాహనాలు ఉండటంతో వారందరి పేర్లు అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఎట్టకేలకు నిరుపేదలకు సంబంధించి అర్హుల జాబితాను రూపొందించారు.
982 ఇళ్లు సిద్ధం
పట్టణంలో లబ్ధిదారుల కోసం అపార్ట్మెంట్ తరహాలో ఇళ్లు నిర్మించారు. ఇందులో కేఆర్కే కాలనీలో 760, మావల గ్రామ సమీపంలో సర్వే నెం.170 పరిధిలో నాలుగు వరుసల జాతీయ రహదారికి ఆనుకొని మరో 222 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. మొత్తం 982 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి.
ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో అర్హులు, అనర్హుల దరఖాస్తులు వేరు చేస్తున్న అధికారులు
లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక?
ఎంపిక చేసిన జాబితాలో పేర్లు, చిరునామాల వారీగా పుర కార్యాలయంలో ప్రదర్శిస్తారు. అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. ఒకవేళ అందులోనూ అనర్హులున్నట్లు ఆధారాలు సమర్పిస్తే వారి పేర్లు తొలగిస్తారు. ఇదే విషయంపై ఆదిలాబాద్ తహసీల్దార్ కార్యాలయం నుంచి పుర కార్యాలయానికి జాబితాను పంపించారు. నిర్మించిన ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడం, అర్హుల జాబితా ఎక్కువగా ఉండడంతో లక్కీడ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే వేరే జిల్లాలోనూ లక్కీడ్రా పద్ధతి నిర్వహించడంతో ఇక్కడా అదే విధానం అమలు చేయనున్నట్లు భావిస్తున్నారు.
దరఖాస్తుల వివరాలు
మొత్తం దరఖాస్తులు : 9,194
విచారణలో తేలిన అర్హులు : 2,960
అనర్హులు : 6,234
సిద్ధంగా ఉన్న ఇళ్లు : 982
అభ్యంతరాలు స్వీకరించాకే..
పూర్తి విచారణ చేపట్టాకే అర్హుల జాబితాను రూపొందించాం. ద్విచక్ర వాహనం ఉన్నా వారి పేర్లు తొలగించాం. అర్హుల జాబితాను పుర కార్యాలయానికి పంపించాం. అక్కడ ప్రదర్శించాక అభ్యంతరాలుంటే తీసుకుంటాం. ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉంటుందనేది ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు.
సతీష్కుమార్, తహసీల్దార్, ఆదిలాబాద్ అర్బన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. -
డీఎల్ఎస్ఏ కార్యదర్శి బదిలీ
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా 32 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. -
విక్రయదారులు లైసెన్స్ తీసుకోకపోతే చర్యలు
[ 23-04-2024]
ఇండియాస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నమోదు లేదా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. -
25న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. -
25న విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఈనెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. -
హోటల్లో ఆకస్మిక తనిఖీ.. రూ.25వేలు జరిమానా
[ 23-04-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని బావర్చి బిర్యానీ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. -
వ్యాధి తీవ్రత అధికంగా ఉంటేనే రిఫర్ చేయాలి..
[ 23-04-2024]
మహిళల వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేయాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. -
హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు
[ 23-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి, గుట్ట హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మహిళల హక్కుల పై ఉపాధి కూలీలకు అవగాహన
[ 23-04-2024]
సఖీ కేంద్రం, మహిళా సాధికారత కేంద్రం అధ్వర్యంలో మంగళవారం అదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకొలి, లోకారి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు సఖీ కేంద్రం అందించే సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. -
ఆదిత్య ఖండేష్కర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
[ 23-04-2024]
ఆదిత్య ఖండేష్కర్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
భారాస అభ్యర్థి నామినేషన్ దాఖలు
[ 23-04-2024]
ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు చేశారు. -
మంగమఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని మంగ మఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. -
ఊరూరా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మండలంలోని పొన్నారి, తాంసి, హస్నాపూర్, కప్పలరా, బండల నాగపూర్, వడ్డాడి, గిరిగాం తదితర గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ... -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. -
సంక్షేమ మంత్రం.. ప్రత్యర్థులపై విమర్శల బాణం
[ 23-04-2024]
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న భారాస, భాజపా అభ్యర్థులు ఆత్రం సక్కు, గోడం నగేష్ వ్యవహారశైలి మీకు తెలుసు. వారి పనితనం మీకు తెలిసిందే. మంచోడు మంచోడని మంచం ఎక్కిస్తే మంచమంతా పాడు చేసినట్లు ఆత్రం సక్కు వ్యవహారం ఉంటే, బుద్ధిమంతుడని సద్ది కట్టిస్తే బొడ్రాయి దగ్గర భోంచేసి మళ్లీ ఇంటికొచ్చి బోర్లాపడుకున్నట్లు నగేష్ వ్యవహారముంది. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 23-04-2024]
విద్యాసంవత్సరం నేటితో ముగియనుంది. విద్యార్థులకు సంగ్రహణాత్మక(ఎస్ఏ2) పరీక్షలు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. -
శుద్ధజలంపై శ్రద్ధ
[ 23-04-2024]
పంచాయతీల్లో కలుషిత నీటి సరఫరాను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతిరోజు తాగు నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
పారిశ్రామిక ప్రాంతం.. ప్రచారానికి లేదు వేసవి తాపం
[ 23-04-2024]
అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే. -
ఆదిలాబాద్ లోక్సభ బరిలో..
[ 23-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బరిలో నిలిచారు. 1952లో ఆదిలాబాద్ లోక్సభ స్థానంగా ఏర్పడింది. -
మళ్లీ.. ఏనుగు గండం!
[ 23-04-2024]
గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది. -
పట్టణానికి దూరం.. కావాలి ప్రత్యామ్నాయం
[ 23-04-2024]
మంచిర్యాల ఎంసీహెచ్(మాతా, శిశు ఆరోగ్య కేంద్రం).. పట్టణానికి దూరంగా ఉండటంతో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అత్యవసరమైనవి.. ముఖ్యమైనవి.. ఆసుపత్రిలో చల్లదనం, సరిపడా నీటి సౌకర్యం. -
నకిలీ వేలిముద్రలతో పీఎంకేకే పథకంలో మోసం
[ 23-04-2024]
నకిలీ వేలిముద్రలతో హాజరు శాతం ఎక్కువగా చూపించి బిల్లులు కాజేసిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర పథకం నిర్వాహకులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఇసుక దోచేస్తున్నారు..
[ 23-04-2024]
జిల్లాలోని నదులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
సాయంత్రం ఈదురుగాలులతో అతలాకుతలం
[ 23-04-2024]
భైంసా, కుభీరు, కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రగాలులతో రేకుల ఇళ్లు, షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు