ఇందిరమ్మ స్థలాలకు ఎసరు!
ఖాళీ జాగా కనిపిస్తే భూ బకాసురులు వాలిపోతున్నారు. ఇప్పటికే నిర్మల్తోపాటు మండల కేంద్రాల్లో, గ్రామాల్లోని చెరువు శిఖం, అసైన్డ్ భూములు, సాగునీటి కాలువ కట్టలు చదును చేసి ఆక్రమించుకున్నారు.
సర్కారు భూమి కబ్జా చేస్తున్న వైనం..
నిర్మల్, న్యూస్టుడే
ఆక్రమణలో ఉన్న భూమి
ఖాళీ జాగా కనిపిస్తే భూ బకాసురులు వాలిపోతున్నారు. ఇప్పటికే నిర్మల్తోపాటు మండల కేంద్రాల్లో, గ్రామాల్లోని చెరువు శిఖం, అసైన్డ్ భూములు, సాగునీటి కాలువ కట్టలు చదును చేసి ఆక్రమించుకున్నారు. తాజాగా నిర్మల్ పట్టణం బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయ సమీపంలోని జంగల్ హనుమాన్ ఆలయం ఎదురుగా గతంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో ఇతర అవసరాలకు ఉంచిన ఖాళీ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు. ఇదంతా సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలిసే జరుగుతున్నా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం చూస్తుంటే ఈ భూ ఆక్రమణ వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
నిర్మాణం మధ్యలోనే నిలిచిన ఫౌంటేన్
30 గుంటల భూమి స్వాహా..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అర్హులైన పేదలకు నిర్మల్ పట్టణ శివారులోని శాంతినగర్, బంగల్పేట్ మహాలక్ష్మి ప్రాంతం, వైఎస్సాఆర్ నగర్లలో స్థలాలు సేకరించి, మూడు విడతలుగా దాదాపు 6వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందులో మహాలక్ష్మి ఆలయ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమి సరిపోకపోవడంతో పక్కనే ఉన్న ఓ పట్టాదారుడి వద్ద దాదాపు రెండు ఎకరాల వరకు కొనుగోలు చేసింది. ఇందులో 30 గుంటల భూమి ఇతర అవసరాలకు (ఆలయ నిర్మాణం, పార్కు ఏర్పాటు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, తదితర వాటికి) వదిలేసి మిగతా దాంట్లో లబ్ధిదారులకు కేటాయించారు. అయితే 15ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఈ భూమిపై కొంతమంది కన్నేసి గుట్టుచప్పుడు కాకుండా క్రమక్రమంగా మొరం నింపుతూ చదును చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ భూమి కబ్జా వెనుక అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలతోపాటు స్థానికంగా ఓ ప్రజాప్రతినిధి, ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు ఉండటంతోనే అధికారులు మిన్నకుండిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని, ఆ భూమిని జంగల్ హనుమాన్ ఆలయానికి కేటాయించాలని కోరుతూ.. ఇటీవల బంగల్పేట్ శ్రీఆంజనేయ గణేశ్ మండలి యూత్, శ్రీజంగల్ హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పాలనాధికారి వరుణ్రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు.
వాకింగ్ ట్రాక్ దుస్థితి..
ఇళ్ల స్థలాలనూ..
పేదలకు కేటాయించిన ఇందిరమ్మ స్థలాల్లో కొంతమంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకొని జీవిస్తుండగా.. ఇంకొంత మంది పునాదుల వరకు నిర్మించుకుని వదిలేశారు. మరికొంతమంది ఆ స్థలాలను అలాగే వదిలేయడం ఆక్రమణదారులకు కలిసొచ్చింది. మొదట్లో ఈ స్థలాల చుట్టూ పునాదులు తవ్వి కొన్ని రోజుల తర్వాత అక్కడికి ఎవరూ రాకపోయేసరికి.. నకిలీ పట్టా సృష్టించి అమాయకులకు అంటగడుతున్నారు. ఒక్కోప్లాటు (20్ఠ27) రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే బంగల్పేట్ మహాలక్ష్మి, శాంతినగర్, వైఎస్సాఆర్ నగర్లలో పదుల సంఖ్యలో ఇళ్ల స్థలాలను విక్రయించారు. ఇల్లు కట్టుకునే స్థోమత లేని పేద లబ్ధిదారులకు తమ ఇంటి స్థలం ఎక్కడ ఉందో కూడా తెలియకపోవడంతో.. చేసేదేమీ లేక ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది అదే పనిగా ఇందిరమ్మ స్థలాలు ఆక్రమించి నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముతూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ దందాపై సమగ్ర విచారణ జరిపించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
అది ప్రభుత్వ భూమి
ప్రభాకర్, తహసీల్దార్, నిర్మల్ గ్రామీణం
బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయ సమీపంలోని జంగల్ హనుమాన్ ఆలయం ఎదురుగా ఉన్న భూమి ప్రభుత్వానికి సంబంధించింది. గతంలో ఇందిరమ్మ స్థలాల కోసం ఒకరి నుంచి భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో ఇతర అవసరాల కోసం కొంత ఖాళీగా వదిలిపెట్టారు. ఈ భూమి ఆక్రమణకు గురవుతోందని ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టాం. అది ప్రభుత్వ భూమి అని తేలింది. దీన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాం. ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత