బాబోయ్.. భాగ్యనగర్ రైలు
భాగ్యనగర్ రైలు సమయానికి రాక ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ, ఉపాధి, తదితర పనుల నిమిత్తం వేల మంది ప్రయాణికులు కాగజ్నగర్ నుంచి ఈ రైలులో రాకపోకలు సాగిస్తుంటారు.
సహాయకులకూ ఇబ్బందే..
కాగజ్నగర్, న్యూస్టుడే: భాగ్యనగర్ రైలు సమయానికి రాక ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ, ఉపాధి, తదితర పనుల నిమిత్తం వేల మంది ప్రయాణికులు కాగజ్నగర్ నుంచి ఈ రైలులో రాకపోకలు సాగిస్తుంటారు. కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు కొంత మేరకు ఫర్వాలేదు. కానీ సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ ప్రయాణం నరకం కనిపిస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న స్టేషన్లలో గంటల తరబడి నిలుపుతుండటంతో వ్యాధిగ్రస్థులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, క్యాంటీన్ సదుపాయం కూడా లేకపోవడంతో ఆకలితో అలమటించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు, ఇతర రైళ్లు లేకపోవడంతో గత్యంతరం లేక ఆ రైలునే ఆశ్రయించాల్సి వస్తోందని నిట్టూర్చుతున్నారు.
పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్కు రోజూ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు వేకువజామున 3.35 నిమిషాలకు ప్రారంభమై ఉదయం 10.40 నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ 296 కిలోమీటర్ల పరిధిలో 29 రైల్వేస్టేషన్లలో నిలుపుదల ఉంది. అదే రైలు మధ్యాహ్నం 3.35 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమై కాగజ్నగర్కు రాత్రి 10.05 నిమిషాలకు చేరుకోవాలి. కానీ తీవ్రమైన జాప్యం నెలకొంటుంది.
క్రాసింగ్ పేరిట కాలయాపన
సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ బయల్దేరిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఆసిఫాబాద్ రైల్వేస్టేషన్కు రాత్రి 9 గంటల వరకు చేరుకుంటుంది. ఆసిఫాబాద్ నుంచి కాగజ్నగర్కు 19 కి.మీ. దూరం. ఆ సమయంలో పలు ఎక్స్ప్రెస్లు, గూడ్స్ రైళ్లు బల్లార్ష నుంచి సికింద్రాబాద్కు వెళతాయి. దీంతో క్రాసింగ్ నిమిత్తం రైలును ఆ స్టేషన్లోనే నిలిపివేస్తారు. ఆ రైళ్లు వెళ్లిన తర్వాతే కాగజ్నగర్కు పంపిస్తుంటారు. క్రాసింగ్ పేరిట రైల్వే అధికారులు పలు సందర్భాల్లో రెబ్బెన, రాళ్లపేట రైల్వేస్టేషన్లలోనే భాగ్యనగర్ రైలు నిలుపుతారు. స్టేషన్ లేనిచోట, అటవీ ప్రాంతంలోనూ ఆపుతున్నారు.
* కాగజ్నగర్ నుంచి కాజీపేట వరకు ప్యాసింజర్ టిక్కెట్టు, కాజిపేట నుంచి సికింద్రాబాద్ వరకు ఎక్స్ప్రెస్ రైలుగా టిక్కెట్టు రుసుం వసూలు చేసేవారు. రెండేళ్ల క్రితం భాగ్యనగర్ ఎక్స్ప్రెస్గా మార్చారు. అయినప్పటికీ సమయపాలన ఏమాత్రం పాటించడం లేదు.
* అధికారులు ఏమన్నారంటే..: ప్రయాణికుల ఫిర్యాదు మేరకు జాప్యం విషయం పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు సికింద్రాబాద్- కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు కాగజ్నగర్ స్టేషన్కు చేరింది. ఆ రైలు మధ్యాహ్నం 3.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి కాగజ్నగర్కు రాత్రి 10.05 నిమిషాలకు చేరుకోవాలి. మూడు గంటలపైనే ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు, వారిని తీసుకెళ్లడానికి స్టేషన్కు వచ్చిన సహాయకులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఆలస్యం ఒక్కరోజు మాత్రమే కాదు. నిత్యం ఇదే సమస్య ఎదురవుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
మూడు గంటలకుపైగా నిలిపారు..
పి.జ్ఞానేశ్వర్, వ్యాపారి
రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి ఆసిఫాబాద్ రోడ్డు వరకు బాగానే వచ్చింది. ఆ స్టేషన్లో క్రాసింగ్ల పేరిట మూడు గంటలపైగా నిలిపివేశారు. మళ్లీ పెద్దవాగు వద్ద అరగంట నిలిపారు. తరచూ ఇదే సమస్య ఎదురవుతుంది. వివిధ రకాల వ్యాధిగ్రస్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి క్రాసింగ్ పేరిట జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముఖ్య నేతల కోసం అభ్యర్ధుల యత్నం
[ 20-04-2024]
ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాలు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల తేదీలు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వు కాగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానం. -
బాలభవన్ కల సాకారమయ్యేనా?
[ 20-04-2024]
కళలకు నిలయంగా ఆదిలాబాద్లోని బాలకేంద్రం నిలుస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన బాలలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. -
నిర్మల్ నేతలదే ఆధిపత్యం
[ 20-04-2024]
ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్సభకు సంబంధించినవి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. -
పరిమళించిన పల్లె.. పరిశ్రమల ముల్లె
[ 20-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానంగా 62 ఏళ్ల కింద ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు 15 మంది ఎంపీ అభ్యర్థులుగా దిల్లీకి వెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలతో సమ్మిళితమై ఉంటుంది. -
రెండోరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరే!
[ 20-04-2024]
లోక్సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు. -
ఆత్రం సుగుణకు ఆభరణాలు లేవు..
[ 20-04-2024]
తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్ కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో పెండింగ్లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ వెల్లడించారు. -
సరిహద్దు గ్రామాల్లో.. ముగిసిన పోలింగ్
[ 20-04-2024]
తెలంగాణ - మహారాష్ట్ర వివాదాస్పద 12 గ్రామాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాలు ఈ గ్రామాలు మావే అంటుండగా, ఇక్కడి ప్రజలందకిరి ఓటర్లు కార్డులు ఉన్న విషయం విదితమే. -
నింగికెగసిన ఆడబిడ్డలకు సలాం
[ 20-04-2024]
జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది. -
ఎన్నికల హడావుడి.. ఇసుక దోపిడీ
[ 20-04-2024]
రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది. -
ఆడిట్లో అవకతవకలు గుర్తిస్తున్నా ఫలితం శూన్యం
[ 20-04-2024]
పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. -
నైపుణ్యం పెంచేలా.. సేవలు మెరుగయ్యేలా
[ 20-04-2024]
ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. -
అసౌకర్యాలు గుర్తించి.. దూరాభారం తగ్గించి
[ 20-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,850 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
గల్ఫ్ బాధితులకు భరోసా కలిగేనా?
[ 20-04-2024]
ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబునిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బెహరాన్, ఒమన్లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. -
విలువలతో కూడిన విద్య అందించాలి
[ 20-04-2024]
ఒకప్పుడు చదువులకు దూరంగా ఉన్న మారుమూల అల్లంపల్లి గిరిజన విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని త్రిదండి రామానుజ చినజీయరు స్వామి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం