రిమ్స్ నిండా నిర్లక్ష్యం!
రాజీవ్గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్)లో కొందరు వైద్యుల తీరు ఏ మాత్రం మారటం లేదు. సొంత దవాఖానాలకు ప్రాధాన్యమిస్తూ రిమ్స్కు చికిత్స నిమిత్తం వచ్చే నిరుపేద రోగుల పట్ల వారు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఆ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోంది.
మారని వైద్యుల తీరు
న్యూస్టుడే, ఆదిలాబాద్ వైద్య విభాగం
రాజీవ్గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్)లో కొందరు వైద్యుల తీరు ఏ మాత్రం మారటం లేదు. సొంత దవాఖానాలకు ప్రాధాన్యమిస్తూ రిమ్స్కు చికిత్స నిమిత్తం వచ్చే నిరుపేద రోగుల పట్ల వారు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఆ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యులు ఒంటి గంట అనంతరం ఆసుపత్రిలో కనబడకుండా పోతున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే వైద్యులు అందుబాటులో లేకపోవటం రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. మధ్యాహ్నం అనంతరం ఆసుపత్రిలోని అన్ని వార్డులకు కేవలం హౌస్ సర్జన్లు(జూనియర్ వైద్యులు) మాత్రమే పెద్ద దిక్కు అవుతున్నారు. అత్యవసరమైనా తరచూ పలు శస్త్ర చికిత్సలను వాయిదా వేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఏదో ఒక సాంకేతిక కారణం చెప్పి చేతులెత్తేస్తున్నారు. కొన్ని యంత్రాలు ఏళ్ల తరబడి మూలనపడి ఉండటంతో నిర్ధారణ ఫలితాల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.
గడువు ముగిసిన మాత్రలు
ఈ చిత్రంలో కనిపిస్తున్నవి హృద్రోగులకు ఇచ్చే మాత్రలు. వీటి తయారీ తేది మార్చి-2021గా ముద్రితమై ఉంది. చివరి గడువు ఫిబ్రవరి-2023గా ఉంది. కాల పరిమితి కిందటి నెలలో అయిపోయినా సోమవారం ఈ మాత్రలను బాధితునికి సిబ్బంది అందజేశారు. ఇక్కడకు వచ్చేది చదువు రాని వారే. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ప్రాణాలకే ప్రమాదం.
వైద్యుల నిర్లక్ష్యం ఇలా..
జైనథ్ మండలం దీపాయిగూడకు చెందిన యువకుడు వినోద్ ఈ నెల 16న కిడ్నీ సమస్యతో రిమ్స్లో చేరాడు. చికిత్స పొందుతూ 17న మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నా తర్వాత వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సహాయకురాలిగా ఉన్న తల్లి సునీత స్టాఫ్నర్సు వద్దకు వెళ్లి విషయం వివరించింది. ఆ సమయంలో ఆ వార్డులో ఉండాల్సిన వైద్యులెవరూ అందుబాటులో లేరు. స్టాఫ్నర్సు ఆ వైద్యులను సంప్రదించటానికి ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదు. బాధితుడిని ఎంఐసీయూ వార్డుకు తరలించేలోపు దాదాపు ఒక గంట సమయం గడిచిపోయింది. అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు.
శస్త్ర చికిత్సలు వాయిదా
ఇటీవలి కాలంలో పలువురు మహిళలు గర్భసంచి ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఆర్థిక స్తోమత ఉన్న వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. నిరుపేద బాధితులు మాత్రం రిమ్స్ చుట్టూ తిరుగుతూ ఇబ్బందుల పాలవుతున్నారు. వీరికి శస్త్ర చికిత్సలను వైద్యులు రోజుల తరబడి వాయిదా వేస్తున్నారు. బేల మండలం సాంగిడి, సయీద్పూర్కు చెందిన ఇద్దరు మహిళలు 20 రోజుల కిందట ఇదే సమస్యతో రిమ్స్లో చేరారు. వారికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని, నమూనాలను నిర్ధారణ పరీక్షలకు పంపించారు. అనంతరం వారిని ఇంటికి పంపించేశారు. సేకరించిన నమూనాల ఫలితాలు వచ్చాక పిలిపిస్తామని చెప్పి పంపించేశారు.
అయిదేళ్లుగా మూలకే..
ఇది రిమ్స్లోని ‘టిష్యూ ప్రాసెసింగ్’ యంత్రం. అయిదేళ్లుగా పాడై మూలన పడి ఉంది. కడుపులో, ఇతర చోట్ల గడ్డలు ఉంటే నమూనాలను ఈ యంత్రంలో పరీక్షించి క్యాన్సర్ ఉందా? లేదా? అనేది నిర్ధారిస్తారు. రెండు, మూడు గంటల్లోనే ఫలితం వస్తుంది. ఈ యంత్రం మూలన పడి ఉండటంతో సాంకేతిక సిబ్బంది ఒక్కో నమూనాకు నిర్ధారణ పరీక్ష చేసి ఫలితం రాబట్టడానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లక్ష్యానికి మించి ‘ఉపాధి’ పనులు
[ 28-03-2024]
మండుటెండల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్్ ప్రణాళికలు మించి పనులు చేశారు. 2023-24లో మొత్తం 36.58 లక్షల పని దినాలు అంచనాతో ప్రణాళికలు రూపొందించారు. -
కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ..
[ 28-03-2024]
అనూహ్య మలుపులు తిరిగిన ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఆత్రం సుగుణకే ఖరారైంది. ఉట్నూరుకు చెందిన టీచర్, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సుగుణ పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) ఆమోదించింది. -
‘పది’ మూల్యాంకనానికి ఏర్పాట్లు
[ 28-03-2024]
పదోతరగతి పరీక్షలు ఈనెల 30తో ముగియనున్నాయి. ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. పరీక్షపత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు ఇతర జిల్లాల నుంచి పత్రాలు చేరాయి. -
గొంతు తడవదు.. గోస తీరదు
[ 28-03-2024]
ఆసిఫాబాద్ మండలం సుద్దాఘాట్ గ్రామానికి చెందిన ప్రజలు నిత్యం కిలోమీటరు దూరంలోని వాగు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. పక్కనే చెలమ తీసి నీటిని పట్టుకెళ్తున్నారు. వాగు అవతల ఉన్న పదుల సంఖ్యల్లో గ్రామాలదీ ఇదే పరిస్థితి. -
నిప్పు.. నిర్లక్ష్యం చేస్తే పెను ముప్పు
[ 28-03-2024]
వేసవి వచ్చిందంటే సహజంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ప్రధానంగా అడవుల్లో కార్చిచ్చులు మొదలవుతాయి. అటవీప్రాంతంలో జరిగితే మనకొచ్చిన ఇబ్బందేంటని నిర్లక్ష్య వైఖరి చాలా మందిలో కనిపిస్తుంటుంది. -
10,489 మందికి ఎన్నికల విధులు
[ 28-03-2024]
లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార యంత్రాంగం పోలింగ్ కోసం అంతా సిద్ధం చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే ఉద్యోగ, ఉపాధ్యాయ సమాచార సేకరణ, కంప్యూటర్లో వారి వివరాల నిక్షిప్తం చేసే ప్రక్రియను పూర్తి చేశారు. -
అరచేతిలో అతివకు భద్రత
[ 28-03-2024]
ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా అతివలపై జరుగుతున్న నేరాలు ఆగడం లేదు. ఇప్పటికే మహిళలు, యువతుల, విద్యార్థినుల భద్రతకు అనేక మొబైల్ యాప్లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోలీసుశాఖ తాజాగా టీ-సేఫ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. -
భానుడి భగభగ
[ 28-03-2024]
వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పది ప్రాంతాల్లో ఆరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో జైనథ్లో మధ్యాహ్న సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలుగా నమోదు అయింది. -
పల్లెలు భళా.. పట్టణాల్లో డీలా
[ 28-03-2024]
స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రధానమైన ఆర్థిక వనరులు ఆస్తి పన్నులే. ఆర్థిక సంఘం, ప్రత్యేకాభివృద్ధి నిధులతో పంచాయతీలు, పురపాలక సంఘాల్లో సీసీ రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, మరమ్మతు పనులు చేపడుతున్నారు. -
ముదురుతున్న వివాదం!
[ 28-03-2024]
ప్రభుత్వస్థలం కబ్జాకు గురవుతోంది. అక్రమమార్గంలో పట్టాలు చేసుకుంటున్నారు. విచారణ జరపండి. బాధ్యులపై చర్యలు తీసుకోండి.. అంటూ ఏకంగా శాసనసభ్యుడు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. -
రోడ్లు నిర్మానుష్యం.. అవస్థల్లో జనం
[ 28-03-2024]
ఆదిలాబాద్లో రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో మూడ్రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. -
ప్రభుత్వ బడులకు ఉచిత వెలుగులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు ఛార్జీలు గుదిబండగా మారాయి. సర్కారు అందించే నిర్వహణ నిధులు సరిపోకపోవడంతో చాలా పాఠశాలల్లో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. -
రెండు పడక గదుల ఇళ్లపై నీలినీడలు
[ 28-03-2024]
భారాస హయాంలో చేపట్టిన రెండు పడకల ఇళ్ల నిర్మాణాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వీటి విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
హలో.. హలోకు అనుమతి
[ 28-03-2024]
మారుమూల గ్రామాల్లో సంకేతాల (సిగ్నల్స్) సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రత్యేకంగా సెల్టవర్లు మంజూరు చేసింది. స్థలసమస్య కారణంగా పలు పనులు నిలిచి పోయాయి. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 28-03-2024]
పట్టణంలోని శివాజీచౌక్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న లక్ష్మణ్ (25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు పట్టణ సీఐ అనిల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నగదుంటేనే రైడ్ రైట్
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ