logo

వ్యాన్‌ను ఢీకొన్న లారీ

మావల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ ఎం.శ్రీధర్‌కు గాయాలయ్యాయి

Published : 23 Mar 2023 05:56 IST

ప్రమాదానికి కారణమై దెబ్బతిన్న లారీ క్యాబిన్‌

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : మావల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ ఎం.శ్రీధర్‌కు గాయాలయ్యాయి. ఆదిలాబాద్‌ వైపు వస్తున్న వ్యాన్‌ వేగ నిరోధకం కోసం ఏర్పాటు చేసిన స్ట్రంప్స్‌ వద్ద బ్రేకులు వేయటంతో వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి వ్యాన్‌ను ఢీకొంది. లారీ క్యాబిన్‌ దెబ్బతినటంతో పాటు డ్రైవర్‌కు గాయాలు కాగా రిమ్స్‌కు తరలించారు. వ్యాన్‌ వెనుక భాగం కొంత మేర ధ్వంసమైంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని