క్షయ అంతం వైపు అడుగులు..
క్షయ (టీబీ-ట్యూబర్ క్లోసిస్) అంటేనే పలువురు ఆమడదూరం పారిపోతుంటారు. ఇంతగా భయపెడుతున్న ఈ వ్యాధి నిరక్షరాస్యత, అవగాహన లోపం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది.
వ్యాధి గుర్తింపు, చికిత్సల్లో ఆదిలాబాద్ జిల్లాకు నాలుగో స్థానం
ఆదిలాబాద్ వైద్య విభాగం, న్యూస్టుడే
జిల్లా కేంద్రంలోని క్షయ నివారణ కార్యాలయం
క్షయ (టీబీ-ట్యూబర్ క్లోసిస్) అంటేనే పలువురు ఆమడదూరం పారిపోతుంటారు. ఇంతగా భయపెడుతున్న ఈ వ్యాధి నిరక్షరాస్యత, అవగాహన లోపం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. 2025 నాటికి దేశవ్యాప్తంగా క్షయను నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, వ్యాధిగ్రస్థుల గుర్తింపు, బాధితులకు చికిత్సలు అందించటం తదితర చర్యలు ముమ్మరం చేసింది. ఈ నెల 24న ‘ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం’ నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. క్షయ నుంచి రక్షణ, నివారణోపాయాల గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ గుర్తింపు, చికిత్సలు అందించటంలో ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. మెదక్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు వరుసగా.. 93.0, 61.8, 61.8 పాయింట్లు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఉమ్మడి జిల్లాలోని మిగతా జిల్లాలో మొదటి పది స్థానాల్లో లేకుండా పోయాయి.
క్షయను పూర్తిగా అంతం చేయటానికి, బాధితులు చికిత్స కోసం ముందుకొచ్చేలా ప్రోత్సహించటానికి వ్యాధిగ్రస్థులకు రవాణా ఛార్జీలు, పోషకాహారం కోసం ప్రతి నెలా రూ.500 నగదు అందజేస్తుంది. ప్రైవేటు వైద్యులు టీబీ రోగులను గుర్తిస్తే వారికి సైతం ప్రోత్సాహకంగా రూ.500 అందజేస్తోంది. గిరిజన ప్రాంత బాధితులకు చికిత్స అనంతరం అదనంగా రూ.750 చెల్లిస్తున్నారు. ఇన్ని చర్యలు తీసుకున్నా.. వ్యాధి విస్తరిస్తూనే ఉంది. గతంలో అనుమానితులు టీబీ నిర్ధారణ కోసం ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం గ్రామాల్లోనూ శిబిరాలు ఏర్పాటు చేసి రోగులను గుర్తిస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తెమడ పరీక్ష చేస్తున్నారు.
ఆరోగ్య మేళాలు
ప్రతి నెల 14వ తేదీన అన్ని ఆరోగ్య ఉపకేంద్రాలు, వెల్నెస్ సెంటర్లలో ఆరోగ్య మేళాలను నిర్వహిస్తున్నారు. వీటిలో టీబీ నివారణపై అవగాహన కల్పించటంతోపాటు అనుమానితులను గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నిర్ధారణ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, వారికి మందులను అందజేస్తున్నారు.
అందుబాటులో చికిత్సలు
మిట్పల్లివార్ శ్రీకాంత్, క్షయ నివారణ కార్యక్రమ అధికారి
క్షయ వ్యాధికి ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉంది. ఏ మాత్రం అనుమానం ఉన్నా పరీక్షలు చేయించుకోవాలి. ఆరు నెలలపాటు మందులు వాడితే పూర్తిగా నయమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్