సాంకేతిక వినియోగంలో వెనుకబాటు
కరోనా ప్రభావంతో నిత్య జీవితంలో సాంకేతిక వినియోగం బాగా పెరిగింది. కానీ జిల్లాలో అవగాహన లేక చాలామంది ఆ సౌకర్యాలు వాడుకోవడం లేదు.
ఇంటి వద్ద సెల్ఫ్ మీటర్ రీడింగ్ తీస్తున్న యువతి
విద్యుత్తు బిల్లులపై కరవైన అవగాహనఆసిఫాబాద్, న్యూస్టుడే: కరోనా ప్రభావంతో నిత్య జీవితంలో సాంకేతిక వినియోగం బాగా పెరిగింది. కానీ జిల్లాలో అవగాహన లేక చాలామంది ఆ సౌకర్యాలు వాడుకోవడం లేదు. దీంతో వ్యయప్రయాసలు తప్పడం లేదు. విద్యుత్తు బిల్లుల విషయంలో డిజిటల్ విధానంలో చెల్లింపులు జరుగుతున్నా.. సెల్ఫ్ మీటర్ రీడింగ్ తీసుకోవడంలో ఇంకా చాలామందికి అవగాహన కరవైంది.
ప్రతినెలా విద్యుత్తుబిల్లులను ఆ శాఖ ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు వెళ్లి బిల్లు చెల్లిస్తుంటారు. ఇంటినుంచే చరవాణి ద్వారా బిల్లు చెల్లించడం, మీటర్ రీడింగ్ సొంతంగా(సెల్ఫ్) తీయడం కోసం ఆ శాఖ ప్రత్యేక యాప్లను అమలులోకి తెచ్చింది. ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం వంటివే కాకుండా టీఎస్ఎన్పీడీసీఎల్ ప్రత్యేక యాప్ ద్వారాను డిజిటల్ విధానంలో బిల్లు చెల్లించవచ్చు. జిల్లాలో ఈ విధానంలో చెల్లింపులు పదుల సంఖ్యలో మాత్రమే జరుగుతున్నాయి.
ఆసిఫాబాద్లో ఆరుగురే..
జిల్లాలో గృహవిద్యుత్తు కనెక్షన్లు 86 వేల వరకు ఉండగా.. ఫిబ్రవరి నెల డిమాండ్ రూ.2.47 కోట్లు. వారిలో 10,071 మంది డిజిటల్ విధానంలో రూ.1.08 కోట్లు బిల్లు చెల్లించారు. మిగతా వారు కౌంటర్ల వద్దకు నేరుగా వెళ్లి చెల్లించారు. మార్చిలో ఇప్పటి వరకు కాగజ్నగర్ డివిజన్లో 30 మంది, ఆసిఫాబాద్ డివిజన్లో ఆరుగురు మాత్రమే సెల్ఫ్ మీటర్ రీడింగ్ తీసినట్లు విద్యుత్తు అధికారులు చెబుతున్నారు.
యాప్ డౌన్లోడ్ ఇలా..
గుగూల్ ప్లే స్టోర్ నుంచి టీఎస్ఎన్పీడీసీఎల్ ఐటీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానిని క్లిక్ చేస్తే డాష్బోర్డుపై కనిపించే వాటిలో ‘సెల్ఫ్ రీడింగ్’పై నొక్కాలి. నిర్ధారించుకోవడానికి మళ్లీ సబ్మిట్ చేసి.. ఎనిమిది సంఖ్యల యూనిక్ సర్వీస్ నంబర్(యూఎస్సీ)ను నమోదు చేయాలి. సర్వీస్ వివరాలు సరిచూసుకోవాలి. స్కాన్ కేడబ్ల్యూహెచ్పై క్లిక్ చేస్తే వెంటనే భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్లోకి వెళతారు. దీనిని ఇన్స్టాల్ చేసి స్వయంగా మీటర్ రీడింగ్ తీసుకోవచ్చు. రీడింగ్ తీసుకొని సబ్మిట్పై క్లిక్ చేసి చరవాణి సంఖ్య నమోదు చేయాలి. దానికి బిల్లు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. అనంతరం అంతర్జాలం ద్వారా బిల్లు చెల్లించవచ్చు.
సమయం ఆదా అవుతుంది..
వి.వాసుదేవ్, జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈ
డిజిటల్ విధానంతో అన్నివిధాలా మేలు జరుగుతోంది. విద్యుత్తు బిల్లుల చెల్లింపు, మీటర్ రీడింగ్ తీసుకోవడం వంటివి చరవాణి ద్వారానే చేయవచ్చు. సమయం ఆదా అవుతుంది.
స్లాబు మారకుండా చక్కని ఉపాయం..
మీటర్ రీడింగ్ తీసేందుకు విద్యుత్తు సిబ్బంది వచ్చే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి సిబ్బంది 5 నుంచి 10 రోజులు ఆలస్యంగా వస్తే యూనిట్లు పెరిగి స్లాబు మారి బిల్లు పెరుగుతుందని కొందరు ఆందోళన చెందుతుంటారు. అలాంటి వాటికి తావులేకుండా వినియోగదారులే చరవాణి ద్వారా స్వతహాగా (సెల్ఫ్) రీడింగ్ తీసుకోవచ్చు. ప్రతినెలా ఏ తేదీన తీస్తారో.. తదుపరి నెలలో ఆ తేదీకి రెండురోజుల ముందు, తరువాత రెండురోజుల వరకే సెల్ఫ్ రీడింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఉదా. ఫిబ్రవరిలో 5వ తేదీన సెల్ఫ్ రీడింగ్ తీశారు అనుకుందాం. మార్చిలో 3, 4, 6, 7 ఈ తేదీల్లోనే మళ్లీ తీయాల్సి ఉంటుంది.
మధ్యవర్తికి ఇచ్చి పరేషాన్..
తిర్యాణి మండలం గంభీరావుపేటలో గతేడాది ఓ విద్యుత్తు వినియోగదారుడు బిల్లు చెల్లించమని మధ్యవర్తికి రూ.2 వేలు ఇచ్చాడు. కానీ ఆయన చెల్లించకుండా సొంత పనులకు వాడుకున్నాడని ఆలస్యంగా తెలిసింది. కొన్నిరోజుల తర్వాత విద్యుత్తు సిబ్బంది వచ్చి బిల్లు చెల్లించాలని ఇంటికి రావడంతో సదరు వినియోగదారుడు ఆందోళన చెందాడు. వారం క్రితమే రూ.రెండు వేలు చెల్లించానని.. మళ్లీ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. అధికారులు ఆన్లైన్ వివరాలు చూపించడంతో తప్పు జరిగిందని గ్రహించాడు. అదే అంతర్జాలం ద్వారా చెల్లిస్తే.. ఇలాంటి ఇబ్బందులు ఉండవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముఖ్య నేతల కోసం అభ్యర్ధుల యత్నం
[ 20-04-2024]
ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాలు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల తేదీలు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వు కాగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ స్థానం. -
బాలభవన్ కల సాకారమయ్యేనా?
[ 20-04-2024]
కళలకు నిలయంగా ఆదిలాబాద్లోని బాలకేంద్రం నిలుస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన బాలలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. -
నిర్మల్ నేతలదే ఆధిపత్యం
[ 20-04-2024]
ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 18వ లోక్సభకు సంబంధించినవి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మాత్రం 19వ సారి జరుగుతున్నాయి. 2008లో అప్పటి ఎంపీ మధుసూదన్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. -
పరిమళించిన పల్లె.. పరిశ్రమల ముల్లె
[ 20-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానంగా 62 ఏళ్ల కింద ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు 15 మంది ఎంపీ అభ్యర్థులుగా దిల్లీకి వెళ్లారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాలతో సమ్మిళితమై ఉంటుంది. -
రెండోరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కరే!
[ 20-04-2024]
లోక్సభ నామపత్రాల స్వీకరణ పర్వంలో భాగంగా రెండో రోజు ఒకే ఒక్క నామపత్రం దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు శుక్రవారం రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామపత్రం అందజేశారు. -
ఆత్రం సుగుణకు ఆభరణాలు లేవు..
[ 20-04-2024]
తనకు బంగారు ఆభరణాలు ఏమి లేవని, తనపై 50 క్రిమినల్ కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో పెండింగ్లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ వెల్లడించారు. -
సరిహద్దు గ్రామాల్లో.. ముగిసిన పోలింగ్
[ 20-04-2024]
తెలంగాణ - మహారాష్ట్ర వివాదాస్పద 12 గ్రామాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాలు ఈ గ్రామాలు మావే అంటుండగా, ఇక్కడి ప్రజలందకిరి ఓటర్లు కార్డులు ఉన్న విషయం విదితమే. -
నింగికెగసిన ఆడబిడ్డలకు సలాం
[ 20-04-2024]
జల్.. జంగల్.. జమీన్ అనే నినాదంతో ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం 1981 ఏప్రిల్ 20న తుపాకీ ఎక్కుపెట్టింది. ఆదివాసీలపై తూటాల వర్షం కురిపించింది. -
ఎన్నికల హడావుడి.. ఇసుక దోపిడీ
[ 20-04-2024]
రెవెన్యూ, పోలీసు అధికారులు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉండగా.. ఇదే అదునుగా జిల్లాలోని ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెద్దవాగు ఇసుక స్మగ్లర్లకు సిరులు కురిపిస్తుంది. -
ఆడిట్లో అవకతవకలు గుర్తిస్తున్నా ఫలితం శూన్యం
[ 20-04-2024]
పంచాయతీలకు వస్తున్న నిధులను కొందరు ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు. రశీదులు లేకుండానే నిధులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ ధరకన్నా ఎక్కువ వెచ్చించి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. -
నైపుణ్యం పెంచేలా.. సేవలు మెరుగయ్యేలా
[ 20-04-2024]
ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. -
అసౌకర్యాలు గుర్తించి.. దూరాభారం తగ్గించి
[ 20-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,850 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
గల్ఫ్ బాధితులకు భరోసా కలిగేనా?
[ 20-04-2024]
ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరవైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబునిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 70 వేల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బెహరాన్, ఒమన్లకు వెళ్లగా తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాట పడుతోంది. -
విలువలతో కూడిన విద్య అందించాలి
[ 20-04-2024]
ఒకప్పుడు చదువులకు దూరంగా ఉన్న మారుమూల అల్లంపల్లి గిరిజన విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చామని త్రిదండి రామానుజ చినజీయరు స్వామి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు