సేవా సంకల్పం.. చైతన్యమే లక్ష్యం
బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల 1993లో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగూడెం, బెల్లంపల్లిలో మాత్రమే మైనింగ్ కోర్సులు ఉన్నాయి. మైనింగ్ కోర్సు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఓ వరంలా మారింది.
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
బెల్లంపల్లి పట్టణం, న్యూస్టుడే: బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల 1993లో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగూడెం, బెల్లంపల్లిలో మాత్రమే మైనింగ్ కోర్సులు ఉన్నాయి. మైనింగ్ కోర్సు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఓ వరంలా మారింది. 1996 నుంచి ఇప్పటివరకు 1010 మంది మైనింగ్ విద్య అభ్యసించారు. ఇందులో 500కు పైగా విద్యార్థులు 2016 సంవత్సరం వరకు మైనింగ్తో పాటు ఇతర విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు. పది మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు. ఈ కళాశాలలో 27 బ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులు కళాశాలను మరిచిపోకుండా ఇప్పటికీ సహకారం అందిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. సింగరేణి, నైవేలీ, కోల్ఇండియా, డీజీఎంఎస్, సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పేద విద్యార్థులకు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. సేవాభావంతో ముందుకుపోతున్న పాలిటెక్నిక్ కళాశాల, పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమాలపై కథనం.
నైవేలీలో అసిస్టెంట్ చీఫ్ మేనేజర్గా
వేల్పుల రాజ్కుమార్ బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలోనే మైనింగ్ డిప్లొమా పూర్తి చేశారు. తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్లో అడిషనల్ చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి చేస్తున్న సేవలకు గాను ఫిబ్రవరి 28, 2022లో అసోం గవర్నర్ జగదీష్ ముఖీ చేతుల మీదుగా గౌహతిలో అక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ పురస్కారం అందుకున్నారు. కరోనా సమయంలో ఐదుగురు విద్యార్థులకు చరవాణులు అందజేసి సాంకేతిక విద్యకు సహకారం అందించారు. కళాశాలలో ఏ కార్యక్రమం జరిగినా తన వంతు చేయూత అందిస్తున్నారు.
సేవలో ముందుంటున్న వేణుగోపాలస్వామి
వేణుగోపాలస్వామి 1996లో మైనింగ్ డిప్లొమాను బెల్లంపల్లిలో పూర్తి చేశారు. ఉత్తర్ప్రదేశ్లోని ఘాజియాబాద్లో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీలో పనిచేస్తున్నారు. 2013లో డీజీఎంస్లో ఉద్యోగం సాధించారు. అప్పటినుంచి కళాశాలలో ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతుంటారు. విద్యార్థులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అఖిల్ అనే విద్యార్థి డిప్లొమా పూర్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఇతన్ని వేణుగోపాలస్వామి ప్రభుత్వ ఫీజులు పోనూ మిగిలిన డబ్బులు చెల్లిస్తూ చదివిస్తున్నారు.
ఇక్కడే చదివి.. ఇక్కడే బోధిస్తూ
జగిత్యాల జిల్లాకు చెందిన పి.రాజమల్లు బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో 2007లో మైనింగ్ డిప్లొమా పూర్తి చేశారు. మైనింగ్ డిపార్ట్మెంట్లో ఎంటెక్ పూర్తి చేసి ఇక్కడే అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. 2013లో ఉద్యోగం సాధించి మైనింగ్ అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు. చదువుకున్న కళాశాలలోనే మైనింగ్ విభాగంలోనే బోధన చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
విద్యార్థులకు గైడెన్స్ అందిస్తున్న రమేష్
బెల్లంపల్లి మండలం చిన్నబూద గ్రామానికి చెందిన చీకటి రమేష్ మైనింగ్ డిప్లొమో 2002లో పూర్తి చేశారు. రమేష్ ప్రస్తుతం మందమర్రి ఏరియాలోని కేకే-1 రక్షణాధికారిగా పనిచేస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాల బోర్డు సభ్యుడిగా ఉన్నారు. కెరీర్ కమిటీలోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. విద్యార్థులకు అవసరమైనప్పుడు కళాశాలకు వచ్చి సలహాలు, సూచనలు అందజేస్తుంటారు. మైనింగ్కు సంబంధించిన అంశాలు చెబుతుంటారు.
అమ్మాయిలు మైనింగ్ కోర్సుల్లో చేరారు
- దేవేందర్, మైనింగ్ విభాగం అధిపతి
బెల్లంపల్లి కళాశాలలో 2021 సంవత్సరం నుంచి మైనింగ్ కోర్సులో ప్రవేశానికి అమ్మాయిలకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం 24 మంది అమ్మాయిలు చదువుతున్నారు. ఇప్పటికే శాంతిఖని భూగర్భ గనిలోకి ఎంతో సాహసంతో వెళ్లి బొగ్గు వెలికితీస్తున్న తీరును పరిశీలించారు. ఇక్కడ చదివిన మైనింగ్ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండడం సంతోషంగా ఉంది. 10 మంది వరకు ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
25న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. -
25న విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఈనెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. -
హోటల్లో ఆకస్మిక తనిఖీ.. రూ.25వేలు జరిమానా
[ 23-04-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని బావర్చి బిర్యానీ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. -
వ్యాధి తీవ్రత అధికంగా ఉంటేనే రిఫర్ చేయాలి..
[ 23-04-2024]
మహిళల వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేయాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. -
హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు
[ 23-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి, గుట్ట హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మహిళల హక్కుల పై ఉపాధి కూలీలకు అవగాహన
[ 23-04-2024]
సఖీ కేంద్రం, మహిళా సాధికారత కేంద్రం అధ్వర్యంలో మంగళవారం అదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకొలి, లోకారి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు సఖీ కేంద్రం అందించే సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. -
ఆదిత్య ఖండేష్కర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
[ 23-04-2024]
ఆదిత్య ఖండేష్కర్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
భారాస అభ్యర్థి నామినేషన్ దాఖలు
[ 23-04-2024]
ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు చేశారు. -
మంగమఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని మంగ మఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. -
ఊరూరా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మండలంలోని పొన్నారి, తాంసి, హస్నాపూర్, కప్పలరా, బండల నాగపూర్, వడ్డాడి, గిరిగాం తదితర గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ... -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. -
సంక్షేమ మంత్రం.. ప్రత్యర్థులపై విమర్శల బాణం
[ 23-04-2024]
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న భారాస, భాజపా అభ్యర్థులు ఆత్రం సక్కు, గోడం నగేష్ వ్యవహారశైలి మీకు తెలుసు. వారి పనితనం మీకు తెలిసిందే. మంచోడు మంచోడని మంచం ఎక్కిస్తే మంచమంతా పాడు చేసినట్లు ఆత్రం సక్కు వ్యవహారం ఉంటే, బుద్ధిమంతుడని సద్ది కట్టిస్తే బొడ్రాయి దగ్గర భోంచేసి మళ్లీ ఇంటికొచ్చి బోర్లాపడుకున్నట్లు నగేష్ వ్యవహారముంది. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 23-04-2024]
విద్యాసంవత్సరం నేటితో ముగియనుంది. విద్యార్థులకు సంగ్రహణాత్మక(ఎస్ఏ2) పరీక్షలు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. -
శుద్ధజలంపై శ్రద్ధ
[ 23-04-2024]
పంచాయతీల్లో కలుషిత నీటి సరఫరాను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతిరోజు తాగు నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
పారిశ్రామిక ప్రాంతం.. ప్రచారానికి లేదు వేసవి తాపం
[ 23-04-2024]
అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే. -
ఆదిలాబాద్ లోక్సభ బరిలో..
[ 23-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బరిలో నిలిచారు. 1952లో ఆదిలాబాద్ లోక్సభ స్థానంగా ఏర్పడింది. -
మళ్లీ.. ఏనుగు గండం!
[ 23-04-2024]
గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది. -
పట్టణానికి దూరం.. కావాలి ప్రత్యామ్నాయం
[ 23-04-2024]
మంచిర్యాల ఎంసీహెచ్(మాతా, శిశు ఆరోగ్య కేంద్రం).. పట్టణానికి దూరంగా ఉండటంతో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అత్యవసరమైనవి.. ముఖ్యమైనవి.. ఆసుపత్రిలో చల్లదనం, సరిపడా నీటి సౌకర్యం. -
నకిలీ వేలిముద్రలతో పీఎంకేకే పథకంలో మోసం
[ 23-04-2024]
నకిలీ వేలిముద్రలతో హాజరు శాతం ఎక్కువగా చూపించి బిల్లులు కాజేసిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర పథకం నిర్వాహకులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఇసుక దోచేస్తున్నారు..
[ 23-04-2024]
జిల్లాలోని నదులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
సాయంత్రం ఈదురుగాలులతో అతలాకుతలం
[ 23-04-2024]
భైంసా, కుభీరు, కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రగాలులతో రేకుల ఇళ్లు, షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్