గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేద్దాం
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీల నేతల ఆగడాలను తిప్పికొట్టాలి..
భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
అభివాదం చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, చిత్రంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జి గంగాధర్గౌడ్, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే విఠల్రెడ్డి, తదితరుల
నిర్మల్-నర్సాపూర్(జి), న్యూస్టుడే: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీల నేతల ఆగడాలను తిప్పికొట్టాలి.. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉంటూ సమన్వయంతో పనిచేయాలి.. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకెళ్దామని భారాస నేతలు తమ ప్రసంగాల ద్వారా పిలుపునిచ్చారు. కాంగ్రెస్, భాజపా నేతలు ఏం చేశారో ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూనే ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన వారిందరికీ ఏకం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలే లక్ష్యంగా సాగిన నేతల ప్రసంగాలతో భారాస శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భారాస కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకోవడంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆత్మీయ సమ్మేళనాల సమావేశాలకు శ్రీకారం చుట్టారు. గురువారం తొలి భారాస ఆత్మీయ సమ్మేళనం నిర్మల్ నియోజకవర్గంలోని నర్సాపూర్(జి)లో నిర్వహించారు. తొలుత మండల కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా సభా ప్రాంగణం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీకి 50 వేల సభ్యత్వం ఉందని చెబుతూనే మన సైన్యం మరింత పటిష్ఠంగా తయారు కావాలన్నారు. మనమంతా కేసీఆర్ కుటుంబ సభ్యులమని, ప్రతిపక్ష పార్టీ నాయకుల మాయమాటలు నమ్మిపోసపోవద్దని చెప్పారు. అధికారంలో మనమే ఉన్నాం.. అభివృద్ధి మనతోనే సాధ్యమవుతుందని, ఏం కావాలో అడగండి.. చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాలు, మనోభావాలు తెలుసుకునేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాకు వైద్య కళాశాల తీసుకొచ్చామని, 450 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. పార్టీ జిల్లా ఇన్ఛార్జి వి.గంగాధర్గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలకు ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని సూచించారు. ఇంటింటా వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించాలన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి సమానంగా తీసుకెళ్తున్నారన్నారు. భాజపా నాయకులు గ్రామాల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని నిలదీయాలని సూచించారు. జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డిలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ మంత్రి జిల్లాలో చేపట్టిన ప్రగతిని వివరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీసీసీబీ వైస్ఛైర్మన్ రఘునందన్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్ల వెంకట్రాంరెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ ఛైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, అల్లోల సురేందర్రెడ్డి, యువ నాయకుడు అల్లోల గౌతంరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక రమణ, తెరాస జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు నజీరొద్దీన్, స్థానిక జడ్పీటీసీ సభ్యుడు అరుగుమీది రామయ్య, ఎంపీపీ రేఖ, సర్పంచి ఎ.రాంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్వర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు గంగారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, గ్రామ, మండల కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. -
విక్రయదారులు లైసెన్స్ తీసుకోకపోతే చర్యలు
[ 23-04-2024]
ఇండియాస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నమోదు లేదా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. -
25న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. -
25న విశ్రాంత ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఈనెల 25న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. -
హోటల్లో ఆకస్మిక తనిఖీ.. రూ.25వేలు జరిమానా
[ 23-04-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని బావర్చి బిర్యానీ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. -
వ్యాధి తీవ్రత అధికంగా ఉంటేనే రిఫర్ చేయాలి..
[ 23-04-2024]
మహిళల వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేయాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. -
హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు
[ 23-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి, గుట్ట హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మహిళల హక్కుల పై ఉపాధి కూలీలకు అవగాహన
[ 23-04-2024]
సఖీ కేంద్రం, మహిళా సాధికారత కేంద్రం అధ్వర్యంలో మంగళవారం అదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకొలి, లోకారి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు సఖీ కేంద్రం అందించే సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. -
ఆదిత్య ఖండేష్కర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
[ 23-04-2024]
ఆదిత్య ఖండేష్కర్ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
భారాస అభ్యర్థి నామినేషన్ దాఖలు
[ 23-04-2024]
ఆదిలాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్ దాఖలు చేశారు. -
మంగమఠంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలోని మంగ మఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. -
ఊరూరా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
మండలంలోని పొన్నారి, తాంసి, హస్నాపూర్, కప్పలరా, బండల నాగపూర్, వడ్డాడి, గిరిగాం తదితర గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ... -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
[ 23-04-2024]
జిల్లా కేంద్రంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. -
సంక్షేమ మంత్రం.. ప్రత్యర్థులపై విమర్శల బాణం
[ 23-04-2024]
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న భారాస, భాజపా అభ్యర్థులు ఆత్రం సక్కు, గోడం నగేష్ వ్యవహారశైలి మీకు తెలుసు. వారి పనితనం మీకు తెలిసిందే. మంచోడు మంచోడని మంచం ఎక్కిస్తే మంచమంతా పాడు చేసినట్లు ఆత్రం సక్కు వ్యవహారం ఉంటే, బుద్ధిమంతుడని సద్ది కట్టిస్తే బొడ్రాయి దగ్గర భోంచేసి మళ్లీ ఇంటికొచ్చి బోర్లాపడుకున్నట్లు నగేష్ వ్యవహారముంది. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 23-04-2024]
విద్యాసంవత్సరం నేటితో ముగియనుంది. విద్యార్థులకు సంగ్రహణాత్మక(ఎస్ఏ2) పరీక్షలు పూర్తి కావడంతో వాటికి సంబంధించిన ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. -
శుద్ధజలంపై శ్రద్ధ
[ 23-04-2024]
పంచాయతీల్లో కలుషిత నీటి సరఫరాను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రతిరోజు తాగు నీటిని పరీక్షించాకే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
పారిశ్రామిక ప్రాంతం.. ప్రచారానికి లేదు వేసవి తాపం
[ 23-04-2024]
అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే. -
ఆదిలాబాద్ లోక్సభ బరిలో..
[ 23-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బరిలో నిలిచారు. 1952లో ఆదిలాబాద్ లోక్సభ స్థానంగా ఏర్పడింది. -
మళ్లీ.. ఏనుగు గండం!
[ 23-04-2024]
గుంపులో నుంచి తప్పిపోయిన మగ ఏనుగు.. ఈ నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలకు వచ్చి ఇద్దరు రైతులను బలి తీసుకున్న ఘటన భయాందోళనకు గురిచేసింది. -
పట్టణానికి దూరం.. కావాలి ప్రత్యామ్నాయం
[ 23-04-2024]
మంచిర్యాల ఎంసీహెచ్(మాతా, శిశు ఆరోగ్య కేంద్రం).. పట్టణానికి దూరంగా ఉండటంతో ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అత్యవసరమైనవి.. ముఖ్యమైనవి.. ఆసుపత్రిలో చల్లదనం, సరిపడా నీటి సౌకర్యం. -
నకిలీ వేలిముద్రలతో పీఎంకేకే పథకంలో మోసం
[ 23-04-2024]
నకిలీ వేలిముద్రలతో హాజరు శాతం ఎక్కువగా చూపించి బిల్లులు కాజేసిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర పథకం నిర్వాహకులను రామగుండం కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఇసుక దోచేస్తున్నారు..
[ 23-04-2024]
జిల్లాలోని నదులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని ఇటీవల జిల్లా పాలనాధికారి అశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
సాయంత్రం ఈదురుగాలులతో అతలాకుతలం
[ 23-04-2024]
భైంసా, కుభీరు, కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తీవ్రగాలులతో రేకుల ఇళ్లు, షెడ్డుల పైకప్పులు ఎగిరిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?