జర పైలం.. దిగజారుతున్న జలం
జిల్లాలో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసంలో నిలకడగా ఉండి, ఈ నెలలో రెండు మీటర్లకుపైగా దిగజారిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
నెల రోజుల్లో 1.90 మీటర్లు తగ్గిన భూగర్భ నీటిమట్టం
నిర్మల్, న్యూస్టుడే: జిల్లాలో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసంలో నిలకడగా ఉండి, ఈ నెలలో రెండు మీటర్లకుపైగా దిగజారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఏర్పాటుచేసిన 42 ఫిజోమీటర్ల ద్వారా నీటి లెక్కింపు చేసి నివేదిక విడుదల చేశారు. అత్యధికంగా ఆరు మండలాల్లో జలం పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. నీటిని పొదుపు చేయకుండా అవసరానికి మంచి నీటిని వాడటంతో భూగర్భం విచ్ఛిత్తికి గురవుతోంది. నిరంతర విద్యుత్తు సరఫరాతో మోటార్ల ద్వారా ఎక్కువ నీటిని వినియోగిస్తుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి మట్టం పడిపోవడం ప్రమాద సంకేతాన్ని సూచిస్తోంది.
నీటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టకపోవడంతో రోజురోజుకు భూగర్భజల మట్టం పడిపోతుంది. ఫలితంగా తాగు, సాగునీటి కోసం ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెలాఖరునకు జిల్లాలో సగటున 6.50 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉండగా.. ఫిబ్రవరి నెలాఖరునకు 8.40 మీటర్లకు పడిపోయింది. రానున్న రోజుల్లో భూగర్భజలం మరింత పాతాళానికి చేరుకునే ప్రమాదం నెలకొంది.
పంటలపైనా ప్రభావం...
ఓవైపు నిరంతర విద్యుత్తు సరఫరా.. మరోవైపు వాగులు, ఒర్రెల, నదుల నుంచి నిరంతరంగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో భూగర్భజలం కిందకు దిగజారిపోతుండటం ప్రమాదాన్ని సూచిస్తోంది. భూగర్భజలం పడిపోతుండటంతో వాటి పరివాహక ప్రాంతాల్లోని బోర్లలో నీరు రాకపోవడం పంటలపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో 95 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 92 వేల ఎకరాల్లో వరి, 12 వేల ఎకరాల్లో నువ్వులు, మరో 30 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 50 వేల ఎకరాలకుపైగా పంటలు బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్నారు. నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేస్తుండటంతో చాలా ప్రాంతాల్లో అన్నదాతలు పంటలకు నీరు అవసరం లేకున్నా పంపుసెట్లను నడిపిస్తున్నారు. అవసరం మేరకు సాగునీటి వాడుకునే విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తే కొంతవరకైనా మేలు జరుగుతుంది.
30శాతం నీరు ఆవిరే..
వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు మొదలవుతున్నాయి. గతేడాది పుష్కలంగా వర్షాలు కురియడంతో పంటల సాగు విస్తారంగా జరుగుతోంది. యాసంగి సీజన్లోనూ వరి పంటలు సాగు చేస్తుండటంతో బోర్ల ద్వారా నీటి వాడకం ఎక్కువ అవుతోంది. మండుతున్న ఎండల కారణంగా ఆవిరి రూపంలో 30 శాతం నీరు కనుమరుగవుతోందని భూగర్భజలశాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నెలాఖరులో, మే నెలలో జిల్లాలో భూగర్భ జలమట్టం 12 నుంచి 14 మీటర్లకు పడిపోయే ప్రమాదం ఉందని భూగర్భజల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
కొత్తగా బోరుబావులు తవ్వించొద్దు
-శ్రీనివాసబాబు, ఉప సంచాలకుడు, భూగర్భజలశాఖ, నిర్మల్
జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకు పడిపోతూనే ఉన్నాయి. తాగునీటికి అత్యవసరం అనుకుంటే మినహా బోరుబావి తవ్వించొద్దు. భూగర్భంలోని నీటి పొరల్లో నీటి లభ్యత తగ్గిపోవడంతోనే బోరుబావుల ద్వారా నీరు రావడం నిలిచిపోతుంది. రైతులు తమ పంటపొలాల్లో నీటి నిల్వ కోసం గుంతలు తవ్వుకుంటే వర్షాకాంలో నీరు నిలిచి భూగర్భజలాలు వృద్ధి చెంది సాగునీటికి ఇబ్బందులు ఏర్పడవు.
* జిల్లాలో జనవరి నెలాఖరుకు భూగర్భజలాలు (మీటర్లలో) : 6.50
* ఫిబ్రవరి నెలాఖరుకు వరకు :8.40
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటి ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి
[ 19-04-2024]
రామ్ నగర్, వామన్ నగర్, అంబుగాం, లింగుడ, అట్నం కూడా గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?