నిర్లక్ష్యంతో వెనకబడి
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన మన ఊరు - మన బడి పథకం జిల్లాలో నత్తనడకన కొనసాగుతోంది.
మంచిర్యాల గ్రామీణం, న్యూస్టుడే
ఈ చిత్రం చెన్నూరు నియోజకవర్గంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల. మన ఊరు - మన బడి పథకం కింద చేర్చి నిధులు మంజూరు చేశారు. తాగునీటి వసతి, మరుగుదొడ్లు, కుర్చీలు, బెంచీలు వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు శిథిలావస్థకు చేరిన గదిని కూల్చివేసి నూతన భవనం నిర్మించాల్సి ఉంది. కానీ ఇంతవరకు పనులు పూర్తిచేయడం లేదు. మరుగుదొడ్డి పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. శిథిలమైన భవనాన్ని కూల్చే పనులు ఇటీవలే చేపట్టారు. సెలవు దినాల్లో పనులు చేయాల్సి ఉండగా ఓ వైపు పాఠశాల కొనసాగుతుండగానే మరో వైపు పనులు చేస్తున్నారు. దీంతో బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. మధ్యాహ్న భోజనం వండేందుకు, విద్యార్థులు భోజనం చేసే సమయంలో భయాందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన మన ఊరు - మన బడి పథకం జిల్లాలో నత్తనడకన కొనసాగుతోంది. మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తిచేయాలని పాలనాధికారి కచ్చితమైన ఆదేశాలు జారీచేసినప్పటికీ పలు ప్రాంతాల్లో నేటికీ పనులు ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పనుల్లో వేగవంతం చేయాలని ఒత్తిడి తెస్తుండడంతో నాణ్యత లోపిస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనులు చేయాల్సి ఉండగా అనేక పాఠశాలల్లో పనులు ప్రారంభం చేయలేదు. గడువు దగ్గర పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జాప్యంతో ఇబ్బందులు..
జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో చేపట్టిన మన ఊరు- మన బడి పనుల్లో చేస్తున్న జాప్యంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, కిచెన్షెడ్ల నిర్మాణాలు, ప్రహరీలు, అదనపు తరగతి గదుల నిర్మాణం పనుల్లో ఆలస్యమవుతుంది. కొన్ని చోట్ల గుత్తేదారులు, మరికొన్ని ప్రాంతాల్లో ఇసుక కొరత కారణంగా ఆలస్యమవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పనులు చేసే క్రమంలోనూ పలు పాఠశాలల్లో బోధనకు, మధ్యాహ్న భోజన నిర్వహణకు తీవ్ర ఆటంకమేర్పడుతుంది. ఈ ఆర్థిక ఏడాది పనులు పూర్తిచేసిన పక్షంలో మరికొన్ని పాఠశాలలను రెండో విడతలో ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు సమాచారం.
ఈ చిత్రం హాజీపూర్ మండలం ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనిది. మన ఊరు మన బడి పథకం కింద పనులు చేసేందుకు రూ.64 లక్షల మేరకు నిధులు కేటాయించారు. పనులు ప్రారంభించిన నాటి నుంచి నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఇందులో రెండు అదనపు తరగతి గదులు, ప్రహరీ, మరుగుదొడ్లు, వంటగది, డైనింగ్ గదులు, సంపు నిర్మాణం చేయాలి. కుర్చీలు, బెంచీలు, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఇంతవరకు గదుల నిర్మాణం 70 శాతం పనులు కాగా డైనింగ్ గది రూఫ్లెవల్ వరకు చేశారు. వైరింగ్, వంట గదులు, సంపుల నిర్మాణం పనుల్లో జాప్యమేర్పడుతుంది. మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తికాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గణపతి గుడిలో హుండీ చోరీ
[ 25-04-2024]
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్రనగర్ ఓంసాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున చోరీ వెలుగు చూసింది. -
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్