అలా తీసుకొని.. ఇలా అమ్మేస్తున్నారు..
మంచిర్యాలలోని ఓ రేషన్ దుకాణం ఎదుట లబ్ధిదారులు బియ్యం తీసుకుని అక్కడే దళారులకు అమ్ముకుంటున్నారు. రేషన్ కార్డులో ఒక్కో లబ్ధిదారునికి ప్రస్తుతం ప్రభుత్వం 5 కిలోల చొప్పున నలుగురు ఉంటే 20 కిలోలు ఇస్తున్నారు.
చౌకధరల దుకాణాల ఎదుటే దళారుల కొనుగోలు
మంచిర్యాల పట్టణం, న్యూస్టుడే
మంచిర్యాలలోని ఓ రేషన్ దుకాణం ఎదుట లబ్ధిదారులు బియ్యం తీసుకుని అక్కడే దళారులకు అమ్ముకుంటున్నారు. రేషన్ కార్డులో ఒక్కో లబ్ధిదారునికి ప్రస్తుతం ప్రభుత్వం 5 కిలోల చొప్పున నలుగురు ఉంటే 20 కిలోలు ఇస్తున్నారు. ఆ బియ్యం తీసుకున్న లబ్ధిదారుడు చౌకధరల దుకాణం వద్ద సిద్ధంగా ఉన్న దళారులకు కిలోకు రూ.12 చొప్పున అమ్ముతున్నారు. ఆ దళారీ బియ్యం కొనుగోలు చేసి ఇలా ఆటోలో తీసుకొస్తున్నారు.
జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఇప్పటివరకు లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత దళారులకు అమ్ముకునే వారు. ఆ బియ్యాన్ని వారు మహారాష్ట్రకు తరలించి అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. తాజాగా రేషన్ దుకాణాలు తెరిసే సరికే దళారులు అక్కడ సిద్ధంగా ఉంటున్నారు. లబ్ధిదారులు తీసుకున్న వెంటనే అక్కడే దళారులకు అమ్ముతున్నారు. ఇంకొన్నిచోట్ల ఆ బియ్యాన్ని డీలర్లే కొని లబ్ధిదారులకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో పౌరసరఫరాల శాఖ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేక రేషన్ బియ్యం బహిరంగంగా పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం ప్రతి నెల మండల గిడ్డంగుల నుంచి రేషన్ దుకాణాలకు పంపించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. వీటిని ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీలోపు ఒక్క రూపాయికి కిలో చొప్పున లబ్ధిదారులకు డీలర్లు పంపిణీ చేయాలి. గత కొన్ని నెలలుగా బియ్యం ఆలస్యంగా సరఫరా చేయడంతో ప్రతి నెల గడువు పొడిగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రేషన్ డీలర్లు దళారులకు అండగా నిలుస్తున్నారు. లబ్ధిదారులు కొనుగోలు చేసిన బియ్యం ఆ దుకాణం ముందే దళారులకు రూ.12కి కిలో చొప్పున అమ్ముతున్నారు. కొందరు డీలర్లు ఇప్పుడు అక్రమ బియ్యం దందా చేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యానికి బదులు, డీలర్లే రూ.8 కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఆ డబ్బులను లబ్ధిదారులకు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తున్నారు. మరికొందరు బియ్యంకు బదులు నిత్యావసర సరకులు ఇస్తున్నారు. ఆ బియ్యాన్ని డీలర్లు మళ్లీ దళారులకు రూ.15కు కిలో చొప్పున అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తూకం వేసిన తర్వాతనే వేలిముద్ర వేస్తే ఈ-పాస్ యత్రం నుంచి రశీదు వస్తుంది. డీలర్లు బియ్యంతో తూకం వేయకుండా బాట్ల బరువు పెట్టి వేలిముద్రలు తీసుకుంటున్నారు. డీలర్లకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్ కంటే, బియ్యం అక్రమ దందాతో ఆదాయం పెంచుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మంచిర్యాలలో మరికొంతమంది దళారులు రేషన్ దుకాణాల ముందు కొనుగోలు చేసిన బియ్యం ద్విచక్ర వాహనాలపై ఓ రహస్య స్థలానికి తరలిస్తున్నారు. ఎక్కువబియ్యం ఒకేసారి తీసుకెళ్తే అధికారులు పట్టుకుంటారనే ఉద్దేశంలో ఇలా రెండు మూడు బస్తాలు తరలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్