సిరులు కురిపిస్తున్న ఎర్ర బంగారం
గతేడాది వరకు నష్టాలు చవిచూసిన రైతులు వారు.. ఇప్పుడు మార్కెట్ల్ో డిమాండ్ ఉన్న సాగు చేపట్టి లాభాలు గడిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఊరంతా మిర్చి సాగుబాటపట్టి ఔరా అనిపిస్తున్నారు.
మిర్చి సాగు బాట పట్టిన రైతులు
కౌటాల గ్రామీణం, న్యూస్టుడే
ఆరబోసిన మిర్చి
గతేడాది వరకు నష్టాలు చవిచూసిన రైతులు వారు.. ఇప్పుడు మార్కెట్ల్ో డిమాండ్ ఉన్న సాగు చేపట్టి లాభాలు గడిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఊరంతా మిర్చి సాగుబాటపట్టి ఔరా అనిపిస్తున్నారు. కౌటాల మండలంలోని తాటిపల్లి గ్రామ రైతులు గతేడాది వరకు వాణిజ్య పంటలు పండించారు. ప్రకృతి విపత్తులు, దిగుబడులు తగ్గి.. పంటలు బాగా పండినా మద్దతు ధర దక్కక నష్టాలే మిగిలేవి. కానీ మహారాష్ట్రలోని నాగ్పూర్ మార్కెట్లో మిర్చికి గిట్టుబాట ధర దొరుకుతుందని గ్రహించి.. ఈసారి అంతా పంట మార్పిడి చేసి ఆదాయం పొందుతున్నారు.
గ్రామంలో 566 కుటుంబాలు ఉండగా.. దాదాపుగా 500 కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో మిర్చి ఎక్కువగా సాగు చేస్తుండటం గమనించారు. దీంతోవారుకూడా ఎర్రబంగారం సాగుకు శ్రీకారం చుట్టారు. గతేడాది 150 ఎకరాల్లో సాగు చేయగా.. అందరికీ లాభాలు రావడంతో ఈసారి మరికొంత మంది మిర్చి సాగువైపు మళ్లారు. ప్రస్తుతం తాటిపెల్లి ఒక్క గ్రామంలోనే 400 ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. ఎకరానికి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుందని, సుమారు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం నాగ్పూర్ మార్కెట్లో క్వింటాల్కు రూ.25 వేల వరకు ధర పలుకుతుండటంతో బాగా గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు అక్కడి రైతులు.
కష్టమైనా నాగ్పూర్ తరలిస్తూ..
తాటిపెల్లి నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ మార్కెట్ సుమారు 250 కి.మీ. ఉంటుంది. అయినా గిట్టుబాటు ధర కోసం కష్టమైనా అక్కడికి తరలిస్తున్నారు. రాకపోకలకు రూ.12 వేల వరకు అవుతున్నా.. లాభాలు వస్తుండటంతో వెనకడుగు వేయడం లేదు. కౌటాల మండలంలో రైతులు పత్తి, సోయా ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ ఏడాది పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర లేక అన్నదాతల ఇళ్లలో నిల్వలు పేరుకుపోయాయి. తాటిపల్లి రైతులను ఆదర్శంగా తీసుకొని ఇంతకాలం వర్షాధారమైన పత్తి, సోయా పండించిన ప్రాణహిత సరిహద్దు గ్రామాలైన గుండాయిపేట, వీర్దండి, తుమ్మిడిహెట్టి, బూరెపల్లి గ్రామాల రైతులు కూడా మిర్చి సాగుకోసం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు.
నాలుగెకరాల్లో 100 క్వింటాళ్ల దిగుబడి
ఎల్ములె దత్తు, తాటిపల్లి
గతేడాది వరకు మా గ్రామంలో పత్తి పంటే ఎక్కువగా సాగు చేసేవారు. ఏటా దిగుబడి రాక.. మద్దతు ధర లభించక నష్టాలే మిగిలేవి. రెండేళ్లుగా మార్కెట్లో తేజ రకం మిర్చికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో గ్రామంలో చాలామంది రైతులు మిర్చిపంటనే సాగు చేస్తున్నారు. నేను 4 ఎకరాల్లో సాగు చేసాను. దాదాపుగా వంద క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి ఖర్చులు అయ్యాయి.
డిమాండ్ ఉన్న పంటలకే మొగ్గు..
బడిగె దామాజీ, రైతు, తాటిపల్లి
నాకున్న ఆరు ఎకరాల్లో మొత్తం మిర్చి పంట సాగు చేసాను. 170 క్వింటాళ్ల పంట పండింది. ఏటా పత్తి సాగు చేస్తే ఏం లాభం ఉండేది కాదు. ఇప్పుడు మిర్చిసాగుతో లాభాలు వచ్చాయి. నాగ్పూర్ మార్కెట్యార్డులో క్వింటాల్కు రూ.24 వేల ధర వచ్చింది. డిమాండ్ ఉన్న పంటలు సాగు చేస్తే లాభాలు వస్తాయని తెలుసుకున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గణపతి గుడిలో హుండీ చోరీ
[ 25-04-2024]
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్రనగర్ ఓంసాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున చోరీ వెలుగు చూసింది. -
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!