నిఘా నీడలో పదో తరగతి పరీక్షలు
ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ తెలిపారు.
ఆసిఫాబాద్ అర్బన్, న్యూస్టుడే
ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ తెలిపారు. గతేడాది ఫలితాల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన జిల్లాను ఈ సారి గౌరవ ప్రదమైన స్థానంలో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మరో మూడురోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఈఓతో ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలిలా ఉన్నాయి..
న్యూస్టుడే: ఈ సారి పరీక్ష విధానంలో వచ్చిన మార్పులు ఏమిటి?
డీఈఓ: ఈసారి ఆరు పేపర్ల విధానంలో పరీక్షలు ఉంటాయి. సైన్సు పేపర్లు ఒకే రోజు రెండు నిర్వహిస్తారు. ఇంగ్లీషు పేపరు రోజు ప్రశ్నపత్రంలో పార్ట్(ఏ), పార్ట్(బీ)లు ఒకేసారి ఇవ్వనున్నారు. సైన్సు పేపర్లకు చివరి 15 నిమిషాల ముందు, మిగతా విషయాలకు చివరి అరగంట ముందు పార్ట్(బి) ఇస్తారు. ఈ విధానంపై విద్యార్థులకు అవగాహన రావడానికి ఇప్పటికే రెండు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాం.
న్యూ: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు?
డీఈఓ: ఈసారి జిల్లాలోని 6670 మంది రెగ్యులర్, 471 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్ష రాసేందుకు 36 రెగ్యులర్ కేంద్రాలను, 3 ప్రైవేటు కేంద్రాలను ఏర్పాటు చేశాం. 415 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు. వేసవి కాలం అయినందునవల్ల ఈ కేంద్రాల్లో తాగునీటి వసతి, నిరంతర విద్యుత్తు, వైద్య పరమైన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.
న్యూ: హాల్టిక్కెట్ల అందజేత, సందేహాల నివృత్తి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
డీఈవో: విద్యార్థులకు హాల్ టికెట్టు ఇచ్చే ముందు సంబంధిత ప్రధానోపాధ్యాయులు హాల్ టిక్కెట్లలోని ఫొటోలు, వివరాలను పాఠశాల రికార్డుతో సరి చూసుకోవాలి. హాల్ టిక్కెట్ల పంపిణీ విషయంలో ప్రధానోపాధ్యాయుల నుంచి ఇబ్బంది ఎదురైతే విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిపై ప్రధానోపాధ్యాయుల సంతకం అవసరం లేదు. పరీక్షల విషయంలో ఫిర్యాదులు, సందేహాల సంప్రదింపుల కోసం డీఈఓ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాం. విద్యార్థులు చరవాణి సంఖ్య 94415 40927 సంప్రదించవచ్చు.
న్యూ: చూచిరాతలు నియంత్రించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనున్నారు?
డీఈఓ: అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. జవాబు పత్రాల ప్యాకింగ్, మెటీరియల్ను పోస్టాఫీసుకు పంపించే వరకు రికార్డు అవుతూ ఉంటాయి. సీఎస్, డీవోలు, ఇన్విజిలేటర్లు, ఇతర పరీక్ష సిబ్బంది, వైద్య సిబ్బందితోపాటు ఎవరూ కేంద్రంలోకి సెల్ఫోన్లు తీసుకురాకుండా నిషేధించాం. సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లును బోర్డుపై ప్రదర్శిస్తాం. ప్రతి కేంద్రం వద్ద సిట్టింగ్ స్క్వాడ్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించాం.
న్యూ: గ్రామీణ, దూర ప్రాంత విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేందుకు ఎలాంటి రవాణా సదుపాయం కల్పించనున్నారు?
డీఈవో: పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాం. విద్యార్థులకు అవసరమైన రూట్లలో బస్సులు నడుపుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్